Political News

పవన్ ను లాగిపెట్టి కొట్టాలనుంది: వాసిరెడ్డి పద్మ

ఆంధ్రప్రదేశ్ లో 30 వేల మంది మహిళల మిస్సింగ్ కరెక్టేనంటూ కేంద్ర మంత్రి స్వయంగా చెప్పడంతో ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంతో పాటు ఏపీ మహిళా కమిషన్, ఏపీ డీజీపీ ఇరకాటంలో పడ్డారు. ఆ గణాంకాలపై ఎవరికి వారు వివరణనిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, కేంద్రం చెప్పిన లెక్కలపై సమాధానమివ్వాలంటూ ఏపీ మహిళా కమిషన్ ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే పవన్ వ్యాఖ్యలకు స్పందించిన ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పవన్ దత్తపుత్రుడు మాత్రమే కాదని, విష పుత్రుడు కూడా అని పద్మ షాకింగ్ కామెంట్లు చేశారు. మహిళల అదృశ్యంలో దేశంలోనే ఏపీ 11వ స్థానంలో ఉందన్న విషయాన్ని పవన్ ఎందుకు ప్రస్తావించటం లేదని నిలదీశారు. రాజ్యసభలో ఏపీలో మహిళల అదృశ్యం అంశంపై ఎందుకు ఎక్కువ ఆందోళన చెందుతున్నారని ప్రశ్నించారు. ప్రేమ, ఇతర వ్యక్తిగత వ్యవహారాల వల్లే చాలామంది అమ్మాయిలు, మహిళలు అదృశ్యం అవుతున్నారని పవన్ తెలుసుకోవాలని హితవు పలికారు.

ఈ ప్రేమలకు సినిమాలు ఒక కారణం కాదా అని పవన్ ను ప్రశ్నించారు. మిస్ అయిన వారిలో 70 శాతం వెనక్కి వస్తున్నారని పవన్ గుర్తించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 పెళ్లిళ్లు చేసుకుంటే తప్పేంటి అని పవన్ అన్నారని, హీరోలు ఏం చెప్పినా చెల్లుతుందా?? అని ప్రశ్నించారు. భరణం ఇచ్చి వదిలించుకుంటాం అంటే ఆ మహిళకు అన్యాం చేసినట్లు కాదా అని నిలదీశారు. పవన్ ఎదురుపడితే లాగి లెంపకాయ కొట్టాలనిపిస్తోందని, కానీ, సభ్యత ఉంది కాబట్టే నోటీసులు ఇస్తున్నామని అన్నారు.

అమ్మాయిలు, మహిళల మిస్సింగ్ లో తెలంగాణ రాష్ట్రం ఆరో స్థానంలో ఉందని, మరి, అక్కడ పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు విప్పరని ప్రశ్నించారు. వాలంటీర్ల వల్లే మహిళలు అదృశ్యం అవుతున్నారన్న పవన్ …వాటికి ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మిస్సింగ్ కేసుల రికవరీలో ఏపీ దేశంలోనే రెండో స్థానంలో ఉందని చెప్పారు. అయితే, ఏపీలో మహిళల మిస్సింగ్ కు సినిమాలలో ప్రేమలే కారణమంటూ వాసిరెడ్డి పద్మ చేసిన కామెంట్లపై ట్రోలింగ్ జరుగుతోంది.

This post was last modified on July 27, 2023 7:41 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

భ‌లే టైమింగ్‌లో రాజ‌ధాని ఫైల్స్

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఈ ఏడాది ప‌లు పొలిటిక‌ల్ సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి. వైసీపీకి అనుకూలంగా యాత్ర‌-2,వ్యూహం,…

2 hours ago

దేశంలో అత్యధిక ఓటర్లున్నది ఎక్కడో తెలుసా ?

140 కోట్ల ప్రజలున్న అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. ఇక్కడ సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడం అంటే కత్తి మీద…

2 hours ago

ప్ర‌భాస్‌ను అడ‌గిందొక‌టి.. అత‌ను తీసుకుందొక‌టి

మంచు విష్ణు హీరోగా ఎంతో ప్ర‌తిష్టాత్మకంగా తెర‌కెక్కుతున్న క‌న్న‌ప్ప‌లో భారీ కాస్టింగ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్, అక్ష‌య్ కుమార్,…

3 hours ago

అమెరికాలో ఇద్దరు భారతీయ విద్యార్థుల మృతి

అమెరికాలో మరో ఇద్దరు తెలుగు విద్యార్థులు మరణించారు. ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలన్న వారి కలలు నిండకుండానే…

3 hours ago

నంధ్యాల ఎఫెక్ట్ : అల్లు అర్జున్ పై కేసు

టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ పిఠాపురంలో పోటీ చేస్తున్న మామ పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కాదని నంద్యాలలో తన…

4 hours ago

శ్రీకాళ‌హస్తిలో కాల‌ర్ ఎగ‌రేసేది ఎవ‌రో?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్‌కు కౌంట్‌డౌన్ ద‌గ్గ‌ర‌ప‌డుతోంది. మ‌రొక్క రోజు గ‌డువు మాత్ర‌మే ఉంది. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలోని అసెంబ్లీ…

6 hours ago