Political News

పవన్ వి తప్పుడు లెక్కలు: ఏపీ డీజీపీ

ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. వాలంటీర్లు సేకరించిన డేటా సంఘ విద్రోహ శక్తులకు వెళుతోందని, ఏపీలో దాదాపు 30 వేల మహిళలు మిస్సింగ్ అంటూ పవన్ చేసిన కామెంట్లు కాక రేపాయి. అయితే, పవన్ వి కాకి లెక్కలు అని వైసీపీ నేతలు కొట్టి పారేశారు. ఈ క్రమంలోనే తాజాగా పవన్ చెప్పిన గణాంకాలు కరెక్టేనని ఏకంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇవ్వడంతో వైసీపీ నేతలకు షాక్ తగిలింది.

నేషనల్‌ క్రైమ్ రికార్డ్స్‌ బ్యూరో లెక్కల ప్రకారం ఏపీలో 2019 నుంచి 2021వరకు మూడేళ్లలో 7వేల 928 మంది బాలికలు. .22వేల 278 మంది మహిళలు అదృశ్యమయ్యారని ఆయన వెల్లడించారు. అదే, తెలంగాణలో 8వేల 66 మంది బాలికలు, 34 వేల 495 మంది మహిళల మిస్సింగ్‌ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ మహిళా కమిషన్ పై పవన్ మండిపడ్డారు. కేంద్రమంత్రి కూడా తాను చెప్పిన గణాంకాలే చెప్పారని, ఇప్పుడు మహిళా కమిషన్ ఏం చేస్తుందని ప్రశ్నించారు.

ఏపీలో బాలికలు, మహిళలు ఎందుకు అదృశ్యమవుతున్నారని పవన్ ప్రశ్నించారు. ఈ మిస్సింగ్ కేసులపై హోంమంత్రి, డీజీపీని.. ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్ వివరణ అడగగలదా? అని పవన్ నిలదీశారు. వైసీపీ ప్రభుత్వంపై మహిళా కమిషన్ చర్యలు తీసుకోగలదా అని ప్రశ్నించారు. జగన్‌ పాలనలో భారీ సంఖ్యలో బాలికలు, మహిళలు అదృశ్యం అయ్యారని పవన్ అన్నారు.

ఈ నేపథ్యంలోనే పవన్ కామెంట్లపై ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం 26 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని, వారిలో 23 వేల మందిని గుర్తించామని చెప్పారు. మిగిలిన వారిని గుర్తించే పనిలో ఉన్నామని అన్నారు. రకరకాల కారణాలతో వీరు అదృశ్యమయ్యారని చెప్పారు. కానీ, అవగాహన లేని కొందరు 30 వేల మంది మిస్సింగ్ అంటూ తప్పుడు లెక్కలు చెపుతున్నారని ఆరోపించారు. ఏపీలో ప్రతి ఘటనకు గంజాయితో ముడిపెట్టడం సరికాదని డీజీపీ అన్నారు. గంజాయిని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.

This post was last modified on July 27, 2023 7:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

2 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

3 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

4 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

5 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

6 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

8 hours ago