Political News

పవన్ వి తప్పుడు లెక్కలు: ఏపీ డీజీపీ

ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. వాలంటీర్లు సేకరించిన డేటా సంఘ విద్రోహ శక్తులకు వెళుతోందని, ఏపీలో దాదాపు 30 వేల మహిళలు మిస్సింగ్ అంటూ పవన్ చేసిన కామెంట్లు కాక రేపాయి. అయితే, పవన్ వి కాకి లెక్కలు అని వైసీపీ నేతలు కొట్టి పారేశారు. ఈ క్రమంలోనే తాజాగా పవన్ చెప్పిన గణాంకాలు కరెక్టేనని ఏకంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇవ్వడంతో వైసీపీ నేతలకు షాక్ తగిలింది.

నేషనల్‌ క్రైమ్ రికార్డ్స్‌ బ్యూరో లెక్కల ప్రకారం ఏపీలో 2019 నుంచి 2021వరకు మూడేళ్లలో 7వేల 928 మంది బాలికలు. .22వేల 278 మంది మహిళలు అదృశ్యమయ్యారని ఆయన వెల్లడించారు. అదే, తెలంగాణలో 8వేల 66 మంది బాలికలు, 34 వేల 495 మంది మహిళల మిస్సింగ్‌ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ మహిళా కమిషన్ పై పవన్ మండిపడ్డారు. కేంద్రమంత్రి కూడా తాను చెప్పిన గణాంకాలే చెప్పారని, ఇప్పుడు మహిళా కమిషన్ ఏం చేస్తుందని ప్రశ్నించారు.

ఏపీలో బాలికలు, మహిళలు ఎందుకు అదృశ్యమవుతున్నారని పవన్ ప్రశ్నించారు. ఈ మిస్సింగ్ కేసులపై హోంమంత్రి, డీజీపీని.. ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్ వివరణ అడగగలదా? అని పవన్ నిలదీశారు. వైసీపీ ప్రభుత్వంపై మహిళా కమిషన్ చర్యలు తీసుకోగలదా అని ప్రశ్నించారు. జగన్‌ పాలనలో భారీ సంఖ్యలో బాలికలు, మహిళలు అదృశ్యం అయ్యారని పవన్ అన్నారు.

ఈ నేపథ్యంలోనే పవన్ కామెంట్లపై ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం 26 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని, వారిలో 23 వేల మందిని గుర్తించామని చెప్పారు. మిగిలిన వారిని గుర్తించే పనిలో ఉన్నామని అన్నారు. రకరకాల కారణాలతో వీరు అదృశ్యమయ్యారని చెప్పారు. కానీ, అవగాహన లేని కొందరు 30 వేల మంది మిస్సింగ్ అంటూ తప్పుడు లెక్కలు చెపుతున్నారని ఆరోపించారు. ఏపీలో ప్రతి ఘటనకు గంజాయితో ముడిపెట్టడం సరికాదని డీజీపీ అన్నారు. గంజాయిని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.

This post was last modified on July 27, 2023 7:34 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

కేజ్రీవాల్‌కు బెయిల్‌.. ష‌ర‌తులు పెట్టిన సుప్రీంకోర్టు

ఢిల్లీ ముఖ్య‌మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అర‌వింద్ కేజ్రీవాల్‌కు ఊపిరి వ‌చ్చింది. ప్ర‌స్తుతం జైల్లో ఉన్న ఆయ‌నకు మ‌ధ్యంత…

1 min ago

అంత డ‌బ్బు ఎలా వ‌చ్చింది?: ఈసీ ప్ర‌శ్న‌

ఏపీలోని జ‌గ‌న్‌ ప్ర‌భుత్వానికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం తాజాగా సంచ‌ల‌న లేఖ రాసింది. ఒక్క‌సారిగా ప్ర‌భుత్వానికి ఇంత డ‌బ్బు ఎక్క‌డినుంచి…

9 mins ago

పాలిటిక్స్‌కు అతీతంగా ఉంటా: చిరు

మెగాస్టార్ చిరంజీవి.. రాజ‌కీయాల‌పై త‌న మ‌న‌సులో మాట వెల్ల‌డించారు. పాలిటిక్స్‌కు తాను అతీతంగా ఉంటాన‌ని తేల్చి చెప్పారు. అయితే.. సహజంగానే…

19 mins ago

లగడపాటి రాజగోపాల్ ఎక్కడ ? సర్వే ఎప్పుడు ?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో లగడపాటి రాజగోపాల్ ది ప్రత్యేక స్థానం. 2004, 2009 లోక్ సభ ఎన్నికలలో విజయవాడ నుండి పోటీ…

1 hour ago

కుమారీ ఆంటీ మద్దతు ఎవరికో తెలుసా ?

కుమారి ఆంటీ. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలోనే కాదు బయట కూడా దాదాపు ఈ పేరు తెలియని వారు…

2 hours ago

అదే .. మా నాన్నకు రేవంత్ ఇచ్చిన గిఫ్ట్

'కొండ'ను పిండి చేస్తాం. చేవెళ్లలో గెలవనివ్వం అని రేవంత్ రెడ్డి అనడం డ్రామా. కాంగ్రెస్ బతకాలంటే రేవంత్ పీసీసీ చీఫ్…

3 hours ago