Political News

టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ: వినుకొండ‌లో పోలీసుల కాల్పులు

ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలోని వినుకొండ‌లో తీవ్ర ఉద్రిక్త‌త కొన‌సాగుతోంది. టీడీపీ-వైసీపీ నేత‌ల మ‌ధ్య చోటు చేసుకున్న తీవ్ర వివాదం.. పోలీసులు గాలిలోకి కాల్పులు జ‌రిపే వ‌ర‌కు చేరింది. దీంతో ఇక్క‌డ ప‌రిస్థితి ర‌ణ‌రంగంగా మారింది. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ హింసకు దారి తీసింది. వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు మ‌ట్టి, ఇసుక అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నార‌ని.. కోట్ల రూపాయ‌లు దోచుకుంటున్నార‌ని కొన్నాళ్లుగా టీడీపీ నాయ‌కులు విమ‌రిస్తున్నారు.

ఈ క్ర‌మంలో స‌ద‌రు ఆరోప‌ణ‌ల‌ను నిరూపించాలంటూ.. ఎమ్మెల్యే బొల్లా స‌వాల్ విసిరారు. మ‌రోవైపు మట్టి తవ్వకాలకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు ఈ రోజు(గురువారం) ర్యాలీ నిర్వహించాయి. ఈ క్రమంలో ర్యాలీలో పాల్గొన్న పలువురు టీడీపీ శ్రేణులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. తమపై అక్రమ కేసులు పెట్టారంటూ మరోసారి టీడీపీ శ్రేణులు నిరసన ర్యాలీని చేపట్టాయి. అదే సమయంలో టీడీపీ శ్రేణులకు పోటీగా వైసీపీ శ్రేణులు అక్కడకు చేరుకున్నాయి.

ఒకరిపై మరొకరు కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అదేస‌మ‌యంలో కారులో అక్క‌డికి చేరుకున్నారు. దీంతో కొంద‌రు ఆందోళ‌న‌కారులు ఆయ‌న‌ కారుపై రాళ్లు రువ్వారు. ఇరు వర్గాల రాళ్ల దాడిలో ప‌లువురు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు స‌ర్కిల్ ఇన్‌స్పెక్ట‌ర్ సాంబ‌శివ‌రావు గాలిలోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఇదిలావుంటే జిల్లా అధికారులు వినుకొండలో ఇంటర్నెట్ ను నిలిపివేశారు.

This post was last modified on July 27, 2023 3:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విచార‌ణ మ‌ధ్య‌లో `సెక్స్` వీడియోలు.. హైకోర్టు జ‌డ్జికి షాక్‌!

అది ఢిల్లీ హైకోర్టు. ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఓ కేసు విచార‌ణను ఆన్‌లైన్‌లో ప్రారంభించారు. కొన్ని నిమిషాలు జ‌రిగాయి. వ‌ర్చువ‌ల్ విచార‌ణ‌లో…

4 hours ago

ప‌సుపు జెండా పౌరుషం ఎప్పుడూ త‌గ్గ‌లేదు

టీడీపీ నూత‌న కార్య‌వ‌ర్గ ప్ర‌మాణ స్వీకారం ఘ‌నంగా జ‌రిగింది. ఇటీవ‌ల పార్టీలో జాతీయ‌, రాష్ట్ర స్థాయి కార్య‌వ‌ర్గాల‌తోపాటు.. పొలిట్ బ్యూరోను…

7 hours ago

పెద్ద ట్విస్టు… పెద్ది విడుదల తేదీ ఇదా

మెగా ఫ్యాన్స్ కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న శుభ వార్త పెద్ది విడుదల తేది. ఏప్రిల్ 30 నుంచి…

9 hours ago

కేర‌ళం నాడి: విజ‌య‌న్‌.. ప‌రాజ‌య‌న్‌.. కాంగ్రెస్‌కే మొగ్గు!

కేర‌ళంలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సుదీర్ఘ విరామం త‌ర్వాత‌.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తోందా? అంటే.. ఔన‌నే అంటు న్నాయి……

9 hours ago

అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్‌… స‌ర్వేల‌న్నీ.. క‌మ‌లం వైపే!

ఈశాన్య రాష్ట్రం అస్సాంలో బీజేపీ త‌న ప‌ట్టును వ‌రుసగా మూడో సారి కూడా నిలబెట్టుకుంటోంద‌ని స‌ర్వే సంస్థ‌లు తేల్చి చెప్పాయి.…

9 hours ago

మోదీ vs దీదీ – బెంగాల్ పీఠం ఎవరిది? ఎగ్సిట్ పోల్స్ వచ్చేశాయి…

దీదీనా-మోదీనా నినాదంతో జ‌రిగిన ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోటీలో మోదీదే పైచేయి అని బీజేపీనే విజ‌యం ద‌క్కించు కుంటుంద‌ని…

9 hours ago