Political News

టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ: వినుకొండ‌లో పోలీసుల కాల్పులు

ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలోని వినుకొండ‌లో తీవ్ర ఉద్రిక్త‌త కొన‌సాగుతోంది. టీడీపీ-వైసీపీ నేత‌ల మ‌ధ్య చోటు చేసుకున్న తీవ్ర వివాదం.. పోలీసులు గాలిలోకి కాల్పులు జ‌రిపే వ‌ర‌కు చేరింది. దీంతో ఇక్క‌డ ప‌రిస్థితి ర‌ణ‌రంగంగా మారింది. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ హింసకు దారి తీసింది. వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు మ‌ట్టి, ఇసుక అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నార‌ని.. కోట్ల రూపాయ‌లు దోచుకుంటున్నార‌ని కొన్నాళ్లుగా టీడీపీ నాయ‌కులు విమ‌రిస్తున్నారు.

ఈ క్ర‌మంలో స‌ద‌రు ఆరోప‌ణ‌ల‌ను నిరూపించాలంటూ.. ఎమ్మెల్యే బొల్లా స‌వాల్ విసిరారు. మ‌రోవైపు మట్టి తవ్వకాలకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు ఈ రోజు(గురువారం) ర్యాలీ నిర్వహించాయి. ఈ క్రమంలో ర్యాలీలో పాల్గొన్న పలువురు టీడీపీ శ్రేణులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. తమపై అక్రమ కేసులు పెట్టారంటూ మరోసారి టీడీపీ శ్రేణులు నిరసన ర్యాలీని చేపట్టాయి. అదే సమయంలో టీడీపీ శ్రేణులకు పోటీగా వైసీపీ శ్రేణులు అక్కడకు చేరుకున్నాయి.

ఒకరిపై మరొకరు కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అదేస‌మ‌యంలో కారులో అక్క‌డికి చేరుకున్నారు. దీంతో కొంద‌రు ఆందోళ‌న‌కారులు ఆయ‌న‌ కారుపై రాళ్లు రువ్వారు. ఇరు వర్గాల రాళ్ల దాడిలో ప‌లువురు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు స‌ర్కిల్ ఇన్‌స్పెక్ట‌ర్ సాంబ‌శివ‌రావు గాలిలోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఇదిలావుంటే జిల్లా అధికారులు వినుకొండలో ఇంటర్నెట్ ను నిలిపివేశారు.

This post was last modified on July 27, 2023 3:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

19 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago