భారీ వర్షాల కారణంగా నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు ప్రమాదంలో పడేలా కనిపిస్తోంది. వరద ముప్పు పొంచి ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి ఈ ప్రాజెక్టుకు 3 లక్షల 87 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. ప్రాజెక్టులో ప్రస్తుత నీటి మట్టం 697 అడుగులకు చేరుకుంది. ఈ ప్రాజెక్టు గరిష్ఠ నీటి మట్టం 700 అడుగులుగా ఉంది. ఈ భారీ వర్షం కారణంగా మరింత వరద ప్రవాహం ప్రాజెక్టును చేరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎప్పుడేం జరుగుతుందో అనే భయం నెలకొంది.
ప్రాజెక్టులో వరద ప్రవాహాన్ని నియంత్రించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 14 గేట్లను ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. దీంతో 2 లక్షల 47 వేల క్యూసెక్కుల నీరు కిందకు వెళ్తోంది. గేట్లు తెరవడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ నెల 15 నుంచి నిరంతరంగా వరద వస్తుండడంతో ఈ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ప్రస్తుత ప్రమాద పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు దగ్గరకు పర్యాటకులను, ప్రజలను అనుమతించడం లేదు.
ప్రాజెక్టు పూర్తి నీట మట్టానికి చేరే అవకాశం ఉండడంతో పరిస్థితిని ఎప్పటికప్పుడూ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. వరద ముంపును తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ కఠిన పరిస్థితుల్లో తమ రక్షణ కోసం అధికారుల సూచలను ప్రజలు పాటించాలని కోరుతున్నారు.
This post was last modified on July 27, 2023 3:33 pm
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…