భారీ వర్షాల కారణంగా నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు ప్రమాదంలో పడేలా కనిపిస్తోంది. వరద ముప్పు పొంచి ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి ఈ ప్రాజెక్టుకు 3 లక్షల 87 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. ప్రాజెక్టులో ప్రస్తుత నీటి మట్టం 697 అడుగులకు చేరుకుంది. ఈ ప్రాజెక్టు గరిష్ఠ నీటి మట్టం 700 అడుగులుగా ఉంది. ఈ భారీ వర్షం కారణంగా మరింత వరద ప్రవాహం ప్రాజెక్టును చేరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎప్పుడేం జరుగుతుందో అనే భయం నెలకొంది.
ప్రాజెక్టులో వరద ప్రవాహాన్ని నియంత్రించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 14 గేట్లను ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. దీంతో 2 లక్షల 47 వేల క్యూసెక్కుల నీరు కిందకు వెళ్తోంది. గేట్లు తెరవడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ నెల 15 నుంచి నిరంతరంగా వరద వస్తుండడంతో ఈ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ప్రస్తుత ప్రమాద పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు దగ్గరకు పర్యాటకులను, ప్రజలను అనుమతించడం లేదు.
ప్రాజెక్టు పూర్తి నీట మట్టానికి చేరే అవకాశం ఉండడంతో పరిస్థితిని ఎప్పటికప్పుడూ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. వరద ముంపును తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ కఠిన పరిస్థితుల్లో తమ రక్షణ కోసం అధికారుల సూచలను ప్రజలు పాటించాలని కోరుతున్నారు.
This post was last modified on July 27, 2023 3:33 pm
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…