భారీ వర్షాల కారణంగా నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు ప్రమాదంలో పడేలా కనిపిస్తోంది. వరద ముప్పు పొంచి ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి ఈ ప్రాజెక్టుకు 3 లక్షల 87 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. ప్రాజెక్టులో ప్రస్తుత నీటి మట్టం 697 అడుగులకు చేరుకుంది. ఈ ప్రాజెక్టు గరిష్ఠ నీటి మట్టం 700 అడుగులుగా ఉంది. ఈ భారీ వర్షం కారణంగా మరింత వరద ప్రవాహం ప్రాజెక్టును చేరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎప్పుడేం జరుగుతుందో అనే భయం నెలకొంది.
ప్రాజెక్టులో వరద ప్రవాహాన్ని నియంత్రించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 14 గేట్లను ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. దీంతో 2 లక్షల 47 వేల క్యూసెక్కుల నీరు కిందకు వెళ్తోంది. గేట్లు తెరవడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ నెల 15 నుంచి నిరంతరంగా వరద వస్తుండడంతో ఈ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ప్రస్తుత ప్రమాద పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు దగ్గరకు పర్యాటకులను, ప్రజలను అనుమతించడం లేదు.
ప్రాజెక్టు పూర్తి నీట మట్టానికి చేరే అవకాశం ఉండడంతో పరిస్థితిని ఎప్పటికప్పుడూ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. వరద ముంపును తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ కఠిన పరిస్థితుల్లో తమ రక్షణ కోసం అధికారుల సూచలను ప్రజలు పాటించాలని కోరుతున్నారు.
This post was last modified on July 27, 2023 3:33 pm
అదేంటో గానీ... ఉన్న రోగానికి మందేస్తే... ఆ రోగం సంగతేమో గానీ... కొత్త రోగం వచ్చి పడుతోంది. ఈ తరహా…
మన నిర్మాతలు ఈ మధ్య బౌండరీలు దాటేసి, వేరే ఇండస్ట్రీల సూపర్ స్టార్లతో సినిమాలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్…
జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఆందోళన విరమించినప్పటికీ అది సృష్టించిన తుఫాన్ కొనసాగుతుంది. సద్దుమణిగిందనుకున్న విషయాన్ని శుక్రవారం…
చెన్నై లవ్ స్టోరీ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లలో యూనిట్ సభ్యులు కొందరు వాడిన మాట ఒకటుంది. అదే కిరణ్ అబ్బవరం హ్యాట్రిక్…
ఆ మధ్య జరిగిన లెనిన్ సక్సెస్ మీట్ లో కింగ్ నాగార్జున ఒక మాట అన్నారు. ది ఒడిస్సి లాంటి…
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…