భారీ వర్షాల కారణంగా నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు ప్రమాదంలో పడేలా కనిపిస్తోంది. వరద ముప్పు పొంచి ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి ఈ ప్రాజెక్టుకు 3 లక్షల 87 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. ప్రాజెక్టులో ప్రస్తుత నీటి మట్టం 697 అడుగులకు చేరుకుంది. ఈ ప్రాజెక్టు గరిష్ఠ నీటి మట్టం 700 అడుగులుగా ఉంది. ఈ భారీ వర్షం కారణంగా మరింత వరద ప్రవాహం ప్రాజెక్టును చేరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎప్పుడేం జరుగుతుందో అనే భయం నెలకొంది.
ప్రాజెక్టులో వరద ప్రవాహాన్ని నియంత్రించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 14 గేట్లను ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. దీంతో 2 లక్షల 47 వేల క్యూసెక్కుల నీరు కిందకు వెళ్తోంది. గేట్లు తెరవడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ నెల 15 నుంచి నిరంతరంగా వరద వస్తుండడంతో ఈ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ప్రస్తుత ప్రమాద పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు దగ్గరకు పర్యాటకులను, ప్రజలను అనుమతించడం లేదు.
ప్రాజెక్టు పూర్తి నీట మట్టానికి చేరే అవకాశం ఉండడంతో పరిస్థితిని ఎప్పటికప్పుడూ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. వరద ముంపును తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ కఠిన పరిస్థితుల్లో తమ రక్షణ కోసం అధికారుల సూచలను ప్రజలు పాటించాలని కోరుతున్నారు.
This post was last modified on July 27, 2023 3:33 pm
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
గత ఏడాది లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ మీట్లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం…