Political News

ఉమెన్ ట్రాఫికింగ్.. ఏపీ, తెలంగాణ‌ల లెక్క తేల్చిన కేంద్రం!

ఉమెన్ ట్రాఫికింగ్‌. ఈ విష‌యం ఇటీవ‌ల కాలంలో ఎక్కువ‌గా చ‌ర్చ‌కు వ‌చ్చిన విష‌యం. వారాహి యాత్ర 2.0 చేప‌ట్టిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏలూరులో నిర్వ‌హించిన స‌భ‌లో ఉమెన్ ట్రాఫికింగ్‌లో ఏపీ ముందుంద‌ని, వ‌లంటీర్లు పెద్ద ఎత్తున దీనిని ప్రోత్స‌హిస్తున్నార‌ని వ్యాఖ్యానించి రాజ‌కీయ దుమారానికి తెర‌దీశారు. ఇక‌, ప‌వ‌న్‌కు వైసీపీ నుంచి అదే రేంజ్‌లో ఎదురు దాడి వ‌చ్చింది. స‌రే.. ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం ఉమెన్ ట్రాఫికింగ్‌పై లెక్క తేల్చింది.

పార్ల‌మెంటులో ఈ రోజు ఏపీ స‌భ్యుడు అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పిన కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి.. ఉమెన్ ట్రాఫికింగ్ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. దీని ప్ర‌కారం.. ఉమెన్ ట్రాఫికింగ్ విష‌యంలో తెలంగాణ రెండు తెలుగు తెలుగు రాష్ట్రాల్లోనూ ముందుండ‌డం షాకింగ్ అంశంగా మారింది. కేంద్రం వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. 2019-21 సంవ‌త్స‌రాల మ‌ధ్య.. అంటే రెండేళ్ల కాలానికి తెలంగాణ‌లో ఏకంగా 8099 మంది బాలిక‌లు, 34,495 మంది మ‌హిళ‌లు అదృశ్య‌మ‌య్యార‌ని కేంద్రం వెల్ల‌డించింది.

ఇదే స‌మ‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌యానికి వ‌స్తే.. 7928 మంది బాలిక‌లు క‌నిపించ‌కుండా పోయార‌ని కేంద్రం తెలిపింది. అదేవిధంగా 22278 మంది మ‌హిళ‌లు 2019-21 మ‌ధ్య క‌నిపించ‌కుండా పోయార‌ని వివ‌రించింది. అయితే.. ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు వీరిని గుర్తించేందుకు శాయ‌శ‌క్తులా కృషి చేస్తున్నాయ‌ని.. కేంద్రం పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ఇదిలావుంటే.. ఏపీలో రాష్ట్ర ప్ర‌భుత్వం తాజాగా ఉమెన్ ట్రాఫికింగ్‌ను అరిక‌ట్టేందుకు ప్ర‌త్యేక వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసేలా నిర్ణ‌యం తీసుకోనుంద‌ని మంత్రి తానేటి వ‌నిత వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on July 26, 2023 10:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కార్యకర్తలతో చంద్రబాబు… కాఫీ కబుర్లు

తెలుగుదేశం పార్టీ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.   'కాఫీ కబుర్లు' పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కార్యకర్తల్లో…

24 minutes ago

ప్రశ్నార్థకంగా మారుతున్న రామ్ సెలక్షన్

ఆంధ్రకింగ్ తాలూకా ఫైనల్ రన్ అయిపోయింది. పాజిటివ్ రివ్యూలు, బాగుందని చెప్పిన పబ్లిక్ టాక్స్ ఇవేవి పట్టుమని మూడు వారాల…

54 minutes ago

సెన్సారుకి సారీ… మంచి సాంప్రదాయం

నిన్న జరిగిన మోగ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విలన్ గా నటించిన బండి సరోజ్ కుమార్ సెన్సార్ బోర్డుని…

2 hours ago

కోహ్లీ, రోహిత్‌… జీతాలు తగ్గుతాయా?

టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల జీతాల్లో కోత పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏటా ఆటగాళ్లకు…

3 hours ago

కొండా సురేఖకు నాన్ బెయిలబుల్ వారెంట్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ తో పాటు ప్రముఖ సినీ నటులు నాగార్జున, సమంత, నాగ చైతన్యలపై…

3 hours ago

హడావిడి చేసిన ‘డెవిల్’ ఎలా ఉన్నాడు

జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా డెవిల్ ఇవాళ భారీ హడావిడి మధ్య కర్ణాటకలో విడుదలయ్యింది.…

4 hours ago