ఉమెన్ ట్రాఫికింగ్. ఈ విషయం ఇటీవల కాలంలో ఎక్కువగా చర్చకు వచ్చిన విషయం. వారాహి యాత్ర 2.0 చేపట్టిన పవన్ కళ్యాణ్ ఏలూరులో నిర్వహించిన సభలో ఉమెన్ ట్రాఫికింగ్లో ఏపీ ముందుందని, వలంటీర్లు పెద్ద ఎత్తున దీనిని ప్రోత్సహిస్తున్నారని వ్యాఖ్యానించి రాజకీయ దుమారానికి తెరదీశారు. ఇక, పవన్కు వైసీపీ నుంచి అదే రేంజ్లో ఎదురు దాడి వచ్చింది. సరే.. ఈ విషయాన్ని పక్కన పెడితే.. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఉమెన్ ట్రాఫికింగ్పై లెక్క తేల్చింది.
పార్లమెంటులో ఈ రోజు ఏపీ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి.. ఉమెన్ ట్రాఫికింగ్ వివరాలను వెల్లడించారు. దీని ప్రకారం.. ఉమెన్ ట్రాఫికింగ్ విషయంలో తెలంగాణ రెండు తెలుగు తెలుగు రాష్ట్రాల్లోనూ ముందుండడం షాకింగ్ అంశంగా మారింది. కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. 2019-21 సంవత్సరాల మధ్య.. అంటే రెండేళ్ల కాలానికి తెలంగాణలో ఏకంగా 8099 మంది బాలికలు, 34,495 మంది మహిళలు అదృశ్యమయ్యారని కేంద్రం వెల్లడించింది.
ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. 7928 మంది బాలికలు కనిపించకుండా పోయారని కేంద్రం తెలిపింది. అదేవిధంగా 22278 మంది మహిళలు 2019-21 మధ్య కనిపించకుండా పోయారని వివరించింది. అయితే.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వీరిని గుర్తించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాయని.. కేంద్రం పేర్కొనడం గమనార్హం. ఇదిలావుంటే.. ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉమెన్ ట్రాఫికింగ్ను అరికట్టేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసేలా నిర్ణయం తీసుకోనుందని మంత్రి తానేటి వనిత వెల్లడించడం గమనార్హం.
రాఘవ లారెన్స్ అంటే మొదట స్టార్ కొరియోగ్రాఫర్. తర్వాత అతను నటుడిగా మారి కొన్ని సినిమాలు చేశాడు. అంత వరకు…
బాలీవుడ్ బిగ్గెస్ట్ విజువల్ గ్రాండియర్ గా ప్రచారంలో ఉన్న రామాయణ పార్ట్ 1 దీపావళి విడుదలకు రెడీ అవుతోంది. ఇంకా…
బాలీవుడ్లో దీపికా పదుకొనే, ఆలియా భట్ లాంటి హై ప్రొఫైల్ హీరోయిన్ల పోటీని తట్టుకుని చాలా ఏళ్లుగా టాప్లో కొనసాగుతున్న…
జింబాబ్వే పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్లదే ఆధిపత్యం నడుస్తోంది. కుర్రాడు వైభవ్ సూర్యవంశీతో…
ఇటీవలే విడుదలైన నాగబంధంకు అంత ఓపెనింగ్స్ వస్తాయని ఊహించినవాళ్లు చాలా తక్కువ. ఎంత విజువల్ ఎఫెక్ట్స్ తో తీసిన సినిమా…
రెండు సంవత్సరాలకు పైగా మోక్షం కోసం ఎదురు చూస్తున్న విశ్వంభర విడుదలకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే ఆలస్యం వల్ల హైప్…