పార్లమెంటులో ఈ రోజు జరిగిన పరిణామాలు మరోసారి వైసీపీ-మోడీ మధ్య బంధాన్ని స్పష్టం చేశాయి. తాజాగా పార్లమెంటులో మోడీ సర్కారుపై ప్రతిపక్ష కూటమి పార్టీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాయి. ఈ రోజు ఉదయం సభ ప్రారంభం కాగానే.. మోడీ సర్కారుపై విశ్వాసం లేదంటూ.. కాంగ్రెస్ సభ్యుడు గొగోయ్ అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ ఓం బిర్లాకు అందించారు. దీనిని దాదాపు ఇండియాలోని అన్ని పక్షాలు సమర్థించాయి.
అయితే.. ఇండియాలోనే ఉన్నా.. కొన్ని పక్షాలు మాత్రం దూరంగా ఉన్నాయి. దీనిపై చర్చ చేపట్టాక మద్దతిస్తామని ప్రకటించాయి. ఈ తీర్మానం తీసుకున్న స్పీకర్ ఓం బిర్లా.. దీనిపై అన్ని పార్టీల సభ్యులతోనూ చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని..తర్వాత చర్చ చేపడతామని చెప్పారు. దీంతో సభలో ఒకింత శాంతియుత వాతావరణం ఏర్పడింది. అయినప్పటికీ.. మణిపూర్ వేడి అయితే తగ్గలేదు.
ఇదిలావుంటే.. ప్రతిపక్షాలు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “అవిశ్వాస తీర్మానం వల్ల ఒరిగేదీ ఏమీలేదు. అయినా.. సభలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. అనవసరంగా రచ్చ చేసుకుంటున్నారు. సజావుగా సాగుతున్న సభలో ఈ అవిశ్వాసం ఎందుకు? దీనివల్ల ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేసినట్టు అవుతుంది. దీనికి వైసీపీ దూరంగా ఉంటుంది. మేం మద్దతు ఇవ్వం” అని వ్యాఖ్యానించారు. అంటే.. మొత్తంగా వైసీపీ మోడీకే మద్దతు ఇచ్చిందా! అని విపక్షాలు చర్చించుకున్నాయి.
బాహుబలి సినిమాను అప్పట్లో టాలీవుడ్ను మించి బాలీవుడ్యే ఎక్కువగా మోసింది. అందుక్కారణం అగ్ర నిర్మాత కరణ్ జోహార్ ఆ చిత్రాన్ని…
టాలీవుడ్లో కొన్నేళ్లుగా సినిమాల మేకింగ్ బాగా ఆలస్యం అవుతోంది. ఒకసారి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయక, దాన్ని మార్చకుండా చెప్పిన…
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని క్షేత్రస్థాయి నుంచి పునర్నిర్మించాలని భావిస్తున్న…
టాలీవుడ్ అగ్ర నిర్మాత సి అశ్వినీదత్ ఇవాళ ఎమోషనల్ అయ్యారు. సింగ్ గీతం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…
జెన్ జీ యుగంలో యువత ఎక్కడికి పోతోందో?… ఏమేం చేస్తుందోనన్న విషయాలపై అంతు చిక్కడం లేదని చెప్పాలి. ఏదో ఒక…
తమిళ రాజకీయాలు దేశవ్యాప్తంగా అమితాసక్తి రేకెత్తిస్తున్నాయి. రెండేళ్ల క్రితం రాజకీయాల్లోకి దూకిన తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి మొన్నటి…