పార్లమెంటులో ఈ రోజు జరిగిన పరిణామాలు మరోసారి వైసీపీ-మోడీ మధ్య బంధాన్ని స్పష్టం చేశాయి. తాజాగా పార్లమెంటులో మోడీ సర్కారుపై ప్రతిపక్ష కూటమి పార్టీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాయి. ఈ రోజు ఉదయం సభ ప్రారంభం కాగానే.. మోడీ సర్కారుపై విశ్వాసం లేదంటూ.. కాంగ్రెస్ సభ్యుడు గొగోయ్ అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ ఓం బిర్లాకు అందించారు. దీనిని దాదాపు ఇండియాలోని అన్ని పక్షాలు సమర్థించాయి.
అయితే.. ఇండియాలోనే ఉన్నా.. కొన్ని పక్షాలు మాత్రం దూరంగా ఉన్నాయి. దీనిపై చర్చ చేపట్టాక మద్దతిస్తామని ప్రకటించాయి. ఈ తీర్మానం తీసుకున్న స్పీకర్ ఓం బిర్లా.. దీనిపై అన్ని పార్టీల సభ్యులతోనూ చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని..తర్వాత చర్చ చేపడతామని చెప్పారు. దీంతో సభలో ఒకింత శాంతియుత వాతావరణం ఏర్పడింది. అయినప్పటికీ.. మణిపూర్ వేడి అయితే తగ్గలేదు.
ఇదిలావుంటే.. ప్రతిపక్షాలు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “అవిశ్వాస తీర్మానం వల్ల ఒరిగేదీ ఏమీలేదు. అయినా.. సభలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. అనవసరంగా రచ్చ చేసుకుంటున్నారు. సజావుగా సాగుతున్న సభలో ఈ అవిశ్వాసం ఎందుకు? దీనివల్ల ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేసినట్టు అవుతుంది. దీనికి వైసీపీ దూరంగా ఉంటుంది. మేం మద్దతు ఇవ్వం” అని వ్యాఖ్యానించారు. అంటే.. మొత్తంగా వైసీపీ మోడీకే మద్దతు ఇచ్చిందా! అని విపక్షాలు చర్చించుకున్నాయి.
This post was last modified on July 26, 2023 5:03 pm
కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…
తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…
ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…
ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…
కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…