ఆంధ్రప్రదేశ్లో తిరిగి పార్టీని అధికారంలోకి తేవాలని చూస్తున్న టీడీపీ అధినేత.. అధికార వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్పై విమర్శలను పదునెక్కించారు. రైతుల సమస్యలు పట్టని వైసీపీ ప్రభుత్వం అంటూ బాబు ధ్వజమెత్తారు. కానీ ఈ క్రమంలోనే తెలంగాణలో రైతులు సంతోషంగా ఉన్నారంటూ.. ఇక్కడి కేసీఆర్ ప్రభుత్వాన్ని పొగుడుతూ వ్యాఖ్యానించడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. పార్టీ అధినేతే.. కేసీఆర్కు సానుకూలంగా మాట్లాడితే ఇక తెలంగాణలో టీడీపీ ఉండడం ఎందుకనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ సర్కారుకు రైతులపై ప్రేమ ఉందని, అందుకే మోటర్లకు మీటర్లు పెట్టనివ్వలేదని చంద్రబాబు అన్నారు. కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టేందుకు కేసీఆర్ ఒప్పుకోలేదని, రైతులపై ప్రేమ, గౌరవం ఉన్న ప్రభుత్వమే అలాంటి నిర్ణయం తీసుకుంటుందని బాబు చెప్పారు. అంతే కాకుండా తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని కూడా అన్నారు. అందుకే అక్కడ భూములు విలువ పెరిగిందని చెప్పారు. జగన్ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు పక్క రాష్ట్రం తెలంగాణ సర్కారును పొగుడుతూ బాబు వ్యాఖ్యలు చేయడం బాగానే ఉంది. కానీ తెలంగాణలోనూ టీడీపీ ఉందని ఆయన మర్చిపోయినట్లు ఉన్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
వరుసగా రెండు ఎన్నికల్లోనూ దారుణ ఫలితాలతో తెలంగాణలో టీడీపీ పత్తాలేకుండా పోయిందనే అభిప్రాయాలున్నాయి. కానీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ణానేశ్వర్.. తెలంగాణలో టీడీపీ ఉనికిని నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా మరో అయిదుగురి చేరికతో రాష్ట్ర కమిటీని బలోపేతం చేయాలని చూస్తున్నారు. కానీ అధినేత బాబు తాజా వ్యాఖ్యలు టీ టీడీపీకి మింగుడుపడడం లేదు. కేసీఆర్ ప్రభుత్వాన్ని బాబు పొగుడుతుంటే.. తాము ఆ పార్టీపై ఎలా పోరాడగలమని టీ టీడీపీ శ్రేణులు అంటున్నాయి.
This post was last modified on July 26, 2023 3:04 pm
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో…
ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో…
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’లో ప్రగ్యా జైశ్వాల్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.…
తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరల పెంపు గురించి ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. ఆల్రెడీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పెరుగుతున్న…