Political News

జగన్ కు సారీ చెప్పిన పిల్లి సుభాష్

రామచంద్రాపురం వైసీపీలో రాజుకున్న రాజకీయ చిచ్చు ఆ పార్టీ అధిష్టానాన్ని కలవరపెడుతోన్న సంగతి తెలిసిందే. మంత్రి వేణుగోపాల్ వర్సెస్ ఎంపీ పిల్లి సుభాష్ ల కోల్డ్ వార్ ఎపిసోడ్ కు ది ఎండ్ కార్డ్ వేసేందుకు తూర్పుగోదావరి వైసీపీ ఇన్ చార్జ్ మంత్రి, ఎంపీ మిథున్ రెడ్డి చేసిన మధ్యవర్తిత్వం దాదాపుగా ఫలించినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే తాను పార్టీ మారబోతున్నాను అంటూ జరుగుతున్న ప్రచారంపై తాజాగా పిల్లి సుభాష్ స్పందించారు. తాను జనసేనలో చేరబోతున్నాను అన్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన క్లారిటీనిచ్చారు.

వైసీపీ నిర్మాణంలో తాను పిల్లర్‌ వంటి వాడినని, తాను వైసీపీని వీడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అయితే, ఎంపీ పదవికి రాజీనామా చేసి, ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని చేసిన కామెంట్లకు గాను సీఎం జగన్‌కి క్షమాపణలు చెప్తున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలా మాట్లాడకుండా ఉండాల్సిందని, క్యాడర్ నిరాశానిస్పృహలు చూసి అలా మాట్లాడాల్సి వచ్చిందని వివరణనిచ్చే ప్రయత్నం చేశారు. రామచంద్రపురం టికెట్ ఎవరిది అన్న విషయంపై కూడా క్లారిటీనిచ్చారు. సీఎం పర్సనల్ టీం సర్వే చేసి ఇచ్చే నివేదిక, బలాబలాల ఆధారంగా తదుపరి నిర్ణయాలుంటాయని చెప్పారు. ఆ ప్రతిపాదనకు తాను అంగీకరించానని వెల్లడించారు.

అయితే, కార్యకర్తల మీద క్రిమినల్ కేసులు పెడుతున్న ఆధారాలను సీఎంకు ఇచ్చామని, జరుగుతున్న విషయాలను నిర్మొహమాటంగా పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లానని అన్నారు. కార్యకర్తల ఇబ్బంది చూసి అలా వ్యాఖ్యానించానని, పార్టీ పెద్దలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి వేణు తన పని తాను చేసుకుంటాడని, తన పని తాను చేసుకుంటానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

This post was last modified on July 26, 2023 1:25 pm

Share
Show comments

Recent Posts

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

3 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

4 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

4 hours ago

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

5 hours ago

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

8 hours ago

ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. జ‌గ‌న్‌ పై బాబు సీరియ‌స్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ పాల‌న‌తో రాష్ట్రం పూర్తిగా విధ్వంస‌మైందని అన్నారు.…

9 hours ago