మణిపూర్లో అల్లర్లపై పార్లమెంటులో చర్చించేందుకు నరేంద్రమోడీ ఎంత భయపడుతున్నారో అర్ధమవుతోంది. రెండున్నర నెలలుగా మణిపూర్లో ఎంతటి ఘోరాలు జరుగుతున్నాయో అందరు చూస్తున్నదే. ఒకవైపు రాష్ట్రం అట్టుడికిపోతున్నా, ఘోరాలు జరుగుతున్నా మోడీ ఏమాత్రం పట్టించుకోకుండా హ్యాపీగా విదేశాల్లో తిరిగొచ్చారు. అంతర్జాతీయస్ధాయిలో దేశంపరువు పోయినా మోడీ లెక్కచేయలేదు. ఆ దశలన్నీ దాటిపోయి ఇపుడు మొదలైన వర్షాకాల సమావేశాల్లో ఇదే అంశాన్ని చర్చించాలంటే కేంద్రప్రభుత్వం ఇష్టపడటంలేదు.
పార్లమెంటులో చర్చజరిగితే ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాలంటేనే మోడీ భయపడుతున్నారు. ఇదే విషయమై పార్లమెంటులో ప్రతిపక్షాలు రెండు అంశాలను డిమాండ్ చేస్తున్నాయి. మొదటిదేమో మణిపూర్ ఘటనలపై ప్రత్యేకంగా చర్చ జరగాలని. రెండోదేమిటంటే ఇదే విషమమై మోడీయే ఒక ప్రకటనచేయాలని. చర్చకు ఎందుకు అనుమతించటంలేదో, ప్రకటనచేయటానికి మోడీ ఎందుకు ముందుకు రావటంలేదో ఎవరికీ అర్ధంకావటంలేదు.
రెండున్నర మాసాలుగా మణిపూర్లో అల్లర్లు జరుగుతుంటే మోడీ పట్టించుకున్నట్లే కనబడలేదు. అంతర్గతంగా నివేదికలు తెప్పించుకుని హోంశాఖ, రాష్ట్రప్రభుత్వంతో చర్చలు జరిపి సమీక్షలు జరిపుండవచ్చు. అయితే ఆ విషయం దేశంమొత్తానికి ఎలాగ తెలుస్తుంది ? అందరికీ తెలియాలంటే మీడియా సమావేశం లేదా ఒక ప్రకటన లాంటివి చేస్తేనే కదా తెలిసేది. మణిపూర్లో అమానవీయ ఘటనలు జరుగుతుంటే కూడా తనకేమీ పట్టనట్లు మోడీ వ్యవహరిస్తుంటే అర్ధమేంటి ? పైగా రాష్ట్రంలో పర్యటించాలని అనుకున్న రాహుల్ గాంధి, ప్రతిపక్షాల నేతలను అంగీకరించలేదు. తానూ పర్యటించక, ప్రతిపక్షాలనూ పర్యటించటానికి ఒప్పుకోకపోతే ఏమిటర్ధం ?
పోనీ ఇపుడు పార్లమెంటులో చర్చిస్తారా అంటే అదీలేదు. విపక్షాలేమో ప్రత్యేక చర్చ జరగాలంటే ప్రభుత్వమేమో అర్ధగంట మాత్రమే కేటాయించింది. మణిపూర్లో రెండున్నర నెలల అల్లర్లు, అమానవీయ ఘటనలను చర్చించేందుకు కేంద్రప్రభత్వం అర్ధగంట మాత్రమే కేటాయించిందంటేనే ఎంతగా భయపడుతోందో అర్ధమైపోతోంది. ప్రతిపక్షాల డిమాండ్ల ప్రకారం ప్రత్యేకచర్చ జరిగితే తన బండారం బయటపడుతుందని మోడీ భయపడుతున్నట్లున్నారు. అందుకనే ప్రతిపక్షాలు ఎంతగా డిమాండ్ చేసినా ఎన్డీయే అంగీకరించలేదు. చివరకు అధికార-ప్రతిపక్షాల గోలతో ఎలాంటి చర్చలు జరగకుండానే సమావేశాలు ముగిసిపోవటం ఖాయమనిపిస్తోంది. మోడీకి కావాల్సింది కూడా ఇదేనా ?
This post was last modified on July 25, 2023 10:24 pm
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…