ఏపీ సీఎం జగన్.. ప్రతిపక్షంలో ఉండగా.. ఆయనపై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన కోడికత్తి దాడి కేసు గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికి నాలుగేళ్లకుపైగానే ఈ కేసు నానుతోంది. ఈ దాడి చేసిన జనుపల్లి శ్రీనివాసరావు అనే యువకుడు ఇప్పటికీ జైల్లోనే ఉన్నాడు. సరే.. ఈ కేసు దాదాపు పూర్తికావొచ్చింది. అయితే.. కేసులో తాజాగా అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును మరోసారి పూర్తిగా విచారించాలంటూ సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్ను ఎన్ ఐఏ కోర్టు తోసిపుచ్చింది.
కోడి కత్తి కేసులో తదుపరి మరింత లోతుగా దర్యాప్తు చేయాలని జగన్ తరపు న్యాయవాది ఈ కేసును విచారిస్తున్న ఎన్ ఐఏ కోర్టులో(విజయవాడ) పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను ఎన్ఐఏ కోర్టు కొట్టేసింది. విచారణకు రాలేనని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి తరఫున మరో పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. ఈ పిటిషన్పై విచారణను ఆగస్టు 1న నిర్ణయిస్తామని కోర్టు పేర్కొనడం గమనార్హం. ఇక, ఈ కేసులో నిందితుడిగా జైలు జీవితం గడుపుతున్న శ్రీనివాసరావు.. బెయిల్ ఇవ్వాలని కోరుతూ.. కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
నిందితుడు శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ను కూడా ఆగస్టు ఒకటికి వాయిదా వేసినట్లు న్యాయమూర్తి తెలిపారు. మొత్తంగా.. ఈ కేసు విచారణ ఆగస్టు 1కి వాయిదా పడడం గమనార్హం. ఇదిలావుంటే, 2018 అక్టోబర్ లో ప్రజాసంకల్ప పాదయాత్రలో ఉన్న జగన్మోహన్రెడ్డి.. యాత్రకు విరామం ప్రకటించి.. హైదరాబాద్కు బయలు దేరారు. ఈ క్రమంలో విశాఖపట్నం ఎయిర్ పోర్టులో ఆయనపై కోడికత్తి దాడి జరిగింది. అప్పట్లో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దీనిని ఎన్ఐఏ దర్యాప్తును అప్పటి చంద్రబాబు ప్రభుత్వమే అప్పగించింది.
జూన్ నెల వచ్చేసింది. కొత్త రిలీజులు క్యూ కడుతున్నాయి. పెద్ది ఆల్రెడీ ఓపెనింగ్ రికార్డులు మొదలుపెట్టేసింది. వచ్చే వారం నుంచి…
తాజాగా విడుదలైన పెద్దిలో జాన్వీ కపూర్ పాత్ర మీద సోషల్ మీడియాలో గట్టి చర్చే జరుగుతోంది. అసలామె క్యారెక్టర్ ని…
ఒక సినిమా అనుభవం ఉన్న దర్శకుడు.. అది కూడా కొత్త వాళ్లతో ఒక ప్రేమకథ చేసిన వాడు.. మెగా పవర్…
సంక్రాంతి తర్వాత సరైన భారీ చిత్రాలు లేక వెలవెలబోయిన టాలీవుడ్ బాక్సాఫీస్కు ‘పెద్ది’ సినిమా ఊపిరులూదుతోంంది. టాక్ ఎలా ఉందన్నదాంతో…
కన్నడ సీనియర్ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కొన్నేళ్ల క్రితం వరకు మన ప్రేక్షకులకు అంతగా సుపరిచితం కాదు. జైలర్…
2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి గురువారానికి సరిగ్గా రెండేళ్లు పూర్తి అయ్యింది. ఆ ఎన్నికల్లో కేంద్రంలో వరుసగా మూడో…