ఏపీ సీఎం జగన్.. ప్రతిపక్షంలో ఉండగా.. ఆయనపై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన కోడికత్తి దాడి కేసు గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికి నాలుగేళ్లకుపైగానే ఈ కేసు నానుతోంది. ఈ దాడి చేసిన జనుపల్లి శ్రీనివాసరావు అనే యువకుడు ఇప్పటికీ జైల్లోనే ఉన్నాడు. సరే.. ఈ కేసు దాదాపు పూర్తికావొచ్చింది. అయితే.. కేసులో తాజాగా అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును మరోసారి పూర్తిగా విచారించాలంటూ సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్ను ఎన్ ఐఏ కోర్టు తోసిపుచ్చింది.
కోడి కత్తి కేసులో తదుపరి మరింత లోతుగా దర్యాప్తు చేయాలని జగన్ తరపు న్యాయవాది ఈ కేసును విచారిస్తున్న ఎన్ ఐఏ కోర్టులో(విజయవాడ) పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను ఎన్ఐఏ కోర్టు కొట్టేసింది. విచారణకు రాలేనని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి తరఫున మరో పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. ఈ పిటిషన్పై విచారణను ఆగస్టు 1న నిర్ణయిస్తామని కోర్టు పేర్కొనడం గమనార్హం. ఇక, ఈ కేసులో నిందితుడిగా జైలు జీవితం గడుపుతున్న శ్రీనివాసరావు.. బెయిల్ ఇవ్వాలని కోరుతూ.. కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
నిందితుడు శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ను కూడా ఆగస్టు ఒకటికి వాయిదా వేసినట్లు న్యాయమూర్తి తెలిపారు. మొత్తంగా.. ఈ కేసు విచారణ ఆగస్టు 1కి వాయిదా పడడం గమనార్హం. ఇదిలావుంటే, 2018 అక్టోబర్ లో ప్రజాసంకల్ప పాదయాత్రలో ఉన్న జగన్మోహన్రెడ్డి.. యాత్రకు విరామం ప్రకటించి.. హైదరాబాద్కు బయలు దేరారు. ఈ క్రమంలో విశాఖపట్నం ఎయిర్ పోర్టులో ఆయనపై కోడికత్తి దాడి జరిగింది. అప్పట్లో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దీనిని ఎన్ఐఏ దర్యాప్తును అప్పటి చంద్రబాబు ప్రభుత్వమే అప్పగించింది.
This post was last modified on July 25, 2023 10:20 pm
నిజమే, ఈ రెండు మూగజీవాల కథలు సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను పిండేశాయి. నిహిలిస్ట్ పెంగ్విన్ : ఒక డాక్యుమెంటరీలో…
కొందరు హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో చేసిన సంప్రదాయ పాత్రల కారణంగా వారి మీద ఒక ముద్ర పడిపోతుంది. వాళ్లను గ్లామర్ కోణంలో…
అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…