ఏపీ సీఎం జగన్.. ప్రతిపక్షంలో ఉండగా.. ఆయనపై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన కోడికత్తి దాడి కేసు గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికి నాలుగేళ్లకుపైగానే ఈ కేసు నానుతోంది. ఈ దాడి చేసిన జనుపల్లి శ్రీనివాసరావు అనే యువకుడు ఇప్పటికీ జైల్లోనే ఉన్నాడు. సరే.. ఈ కేసు దాదాపు పూర్తికావొచ్చింది. అయితే.. కేసులో తాజాగా అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును మరోసారి పూర్తిగా విచారించాలంటూ సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్ను ఎన్ ఐఏ కోర్టు తోసిపుచ్చింది.
కోడి కత్తి కేసులో తదుపరి మరింత లోతుగా దర్యాప్తు చేయాలని జగన్ తరపు న్యాయవాది ఈ కేసును విచారిస్తున్న ఎన్ ఐఏ కోర్టులో(విజయవాడ) పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను ఎన్ఐఏ కోర్టు కొట్టేసింది. విచారణకు రాలేనని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి తరఫున మరో పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. ఈ పిటిషన్పై విచారణను ఆగస్టు 1న నిర్ణయిస్తామని కోర్టు పేర్కొనడం గమనార్హం. ఇక, ఈ కేసులో నిందితుడిగా జైలు జీవితం గడుపుతున్న శ్రీనివాసరావు.. బెయిల్ ఇవ్వాలని కోరుతూ.. కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
నిందితుడు శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ను కూడా ఆగస్టు ఒకటికి వాయిదా వేసినట్లు న్యాయమూర్తి తెలిపారు. మొత్తంగా.. ఈ కేసు విచారణ ఆగస్టు 1కి వాయిదా పడడం గమనార్హం. ఇదిలావుంటే, 2018 అక్టోబర్ లో ప్రజాసంకల్ప పాదయాత్రలో ఉన్న జగన్మోహన్రెడ్డి.. యాత్రకు విరామం ప్రకటించి.. హైదరాబాద్కు బయలు దేరారు. ఈ క్రమంలో విశాఖపట్నం ఎయిర్ పోర్టులో ఆయనపై కోడికత్తి దాడి జరిగింది. అప్పట్లో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దీనిని ఎన్ఐఏ దర్యాప్తును అప్పటి చంద్రబాబు ప్రభుత్వమే అప్పగించింది.
This post was last modified on July 25, 2023 10:20 pm
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…
రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత చెలరేగిన తీవ్ర హింస పై కేంద్ర ఎన్నికల సంఘం…
https://www.youtube.com/watch?v=BacOcD8e_3k బాక్సాఫీస్ డ్రైగా ఉన్న టైంలో సరైన సినిమా కోసం మూవీ లవర్సే కాదు ట్రేడ్ మొత్తం ఎదురు చూస్తోంది.…
కథలు, కాంబోలు చూసేందుకు ఎంత బాగున్నా బడ్జెట్ విషయంలో ప్రాక్టికల్ గా ఆలోచించకపోతే చాలా సమస్యలు తలెత్తే పరిస్థితులను నిర్మాతలు…
చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర షూటింగ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విరామంగా జరిగిపోతోంది. ఎన్నికలు ప్లస్ విదేశీ…