Political News

మోడీ స‌ర్కారుపై ఇండియా అవిశ్వాసం!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ స‌ర్కారుపై కాంగ్రెస్ నేతృత్వంలోని విప‌క్షాల కూట‌మి ఇండియా అవిశ్వాస తీర్మానం ఇచ్చేందుకు రెడీ అయింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే నేతృత్వంలో భేటీ అయిన‌.. విప‌క్షాలు.. ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నాయి. అవిశ్వాస తీర్మానం క‌నుక లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ పెడితే.. విప‌క్షాల‌కు పైచేయి ల‌భించిన‌ట్టు అవుతుంద‌ని భావిస్తున్నారు.

లోక్‌స‌భ నిబంధ‌న‌లలోని రూల్ 198 ప్ర‌కారం.. అవిశ్వాస తీర్మానంపై ఎన్నిరోజులైనా చ‌ర్చించ‌వ‌చ్చు. అప్పుడు ఖ‌చ్చితంగా ప్ర‌తిప‌క్షాల‌కు మాట్లాడే అవకాశం ఉంటుంది. అదే స‌మ‌యంలో ప్ర‌భుత్వం కూడా ఆయా చ‌ర్య‌ల‌కు స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతం మ‌ణిపూర్ రాష్ట్రంలో జ‌రుగుతున్న అల్ల‌ర్ల‌పై చ‌ర్చ‌కు విప‌క్షాలు ప‌ట్టుబ‌ట్టాయి. అయితే.. దీనిపై చ‌ర్చించే ముందు కాంగ్రెస్ స‌హా విప‌క్షాల పాలిత రాష్ట్రాల్లో జ‌రుగుతున్న దారుణాల‌పై చ‌ర్చించాల‌ని బీజేపీ ప‌ట్టుబ‌డుతోంది.

ఈ నేప‌థ్యంలో తాజాగా విప‌క్షాలు వ్యూహం మార్చుకున్నాయి. ప్ర‌భుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెడితే.. ఖ‌చ్చితంగా అప్పుడు అన్ని అంశాల‌పైనా చ‌ర్చించేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తున్నాయి.

పార్లమెంట్ లోని ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఛాంబర్ లో జరిగిన కీలక సమావేశంలో… విపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మాన నిర్ణయం తీసుకొన్నాయి. అవిశ్వాస తీర్మానం ద్వారా… మణిపూర్ సహా… పలు అంశాలపై చర్చించే అవకాశం దొరుకుతుందని ప్రతిపక్షాల వ్యూహంగా క‌నిపిస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on July 25, 2023 3:39 pm

Share

Recent Posts

అల వైకుంఠపురములో కాదు అనంతపురములో… వైరల్

‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…

1 hour ago

మమిత బైజు – వయసు తక్కువా… హిట్లు ఎక్కువ!

ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…

2 hours ago

కేరళం ప్రకృతి వైద్యానికి పవన్ ప్రాధాన్యత

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…

2 hours ago

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

4 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

5 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

5 hours ago