ఏమాటకు ఆమాట… ఇంతవరకు వైఎస్ జగన్ కి రఘురామరాజు ఒక్క తప్పుడు సలహా ఇవ్వలేదు. రాంగోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ కు నిజమైన అభిమాని అవునో కాదో తెలియదు గాని రఘురామరాజు మాత్రం… వైసీపీని, జగన్ ని తప్పు దోవ పట్టించే సలహా ఎపుడూ ఇవ్వలేదు. వారి తప్పులను, పొరపాట్లను ఎత్తిచూపుతూ వచ్చారు. వాటిని సరిదిద్దుకుని 30 ఏళ్లు అధికారంలో ఉండమని జగన్ ను కోరారు. కానీ అలా కోరిన రఘురామరాజు నేడు ‘జగన్ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో ఓ తెలుగు పత్రిక న్యాయమూర్తుల ఫోన్ల ట్యాపింగ్ జరుగుతోంది అంటూ ఒక సంచలన కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ఇది ఈరోజు ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో చర్చనీయాంశం అవుతోంది. దీనిపై స్పందించిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం తీరును తప్పుపడుతూ వారి వ్యవహారంపై మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్తో ముఖ్యమంత్రి జగన్ సర్కారుకు ఇబ్బందులు తప్పవు అని హెచ్చరించారు. ప్రభుత్వమే కూలిపోయే పరిస్థితులు రావొచ్చన్నారు.
నా ఫోన్లు కూడా ట్యాప్ చేసే ఉంటారన్న అనుమానాన్ని వ్యక్తంచేశారు. న్యాయమూర్తుల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తక్షణ విచారణకు ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే.. ఈ ప్రచారంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. న్యాయవ్యవస్థకు, ప్రభుత్వం మధ్య వైరం పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఏపీ భావిస్తోందని చెబుతున్నారు. కొన్ని శక్తులు న్యాయవస్థను పక్కదారి పట్టించే కుట్ర చేస్తున్నారని ప్రభుత్వం అనుమానం వ్యక్తంచేస్తోందట. ఆ క్రమంలోనే ఈ ప్రచారంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.
This post was last modified on August 15, 2020 9:38 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…