Political News

ఏపీ ప్రభుత్వం కూలిపోతుంది – RRR

ఏమాటకు ఆమాట… ఇంతవరకు వైఎస్ జగన్ కి రఘురామరాజు ఒక్క తప్పుడు సలహా ఇవ్వలేదు. రాంగోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ కు నిజమైన అభిమాని అవునో కాదో తెలియదు గాని రఘురామరాజు మాత్రం… వైసీపీని, జగన్ ని తప్పు దోవ పట్టించే సలహా ఎపుడూ ఇవ్వలేదు. వారి తప్పులను, పొరపాట్లను ఎత్తిచూపుతూ వచ్చారు. వాటిని సరిదిద్దుకుని 30 ఏళ్లు అధికారంలో ఉండమని జగన్ ను కోరారు. కానీ అలా కోరిన రఘురామరాజు నేడు ‘జగన్ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో ఓ తెలుగు పత్రిక న్యాయమూర్తుల ఫోన్ల ట్యాపింగ్ జరుగుతోంది అంటూ ఒక సంచలన కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ఇది ఈరోజు ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో చర్చనీయాంశం అవుతోంది. దీనిపై స్పందించిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం తీరును తప్పుపడుతూ వారి వ్యవహారంపై మండిపడ్డారు. ఫోన్‌ ట్యాపింగ్‌తో ముఖ్యమంత్రి జగన్ సర్కారుకు ఇబ్బందులు తప్పవు అని హెచ్చరించారు. ప్రభుత్వమే కూలిపోయే పరిస్థితులు రావొచ్చన్నారు.

నా ఫోన్లు కూడా ట్యాప్ చేసే ఉంటారన్న అనుమానాన్ని వ్యక్తంచేశారు. న్యాయమూర్తుల ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంపై తక్షణ విచారణకు ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే.. ఈ ప్రచారంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. న్యాయవ్యవస్థకు, ప్రభుత్వం మధ్య వైరం పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఏపీ భావిస్తోందని చెబుతున్నారు. కొన్ని శక్తులు న్యాయవస్థను పక్కదారి పట్టించే కుట్ర చేస్తున్నారని ప్రభుత్వం అనుమానం వ్యక్తంచేస్తోందట. ఆ క్రమంలోనే ఈ ప్రచారంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.

This post was last modified on August 15, 2020 9:38 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

మల్లీశ్వరి పెట్టిన ‘కోటి’ కష్టాలు

పెద్ద సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన షాకింగ్ సంగతులు ఎప్పుడో తర్వాత సంవత్సరాల్లో బయట పడతాయి. అలాంటిదే ఇది…

2 hours ago

గోదావరి తీరంలో ‘గ్యాంగ్’ సమరం

https://www.youtube.com/watch?v=CAR8XtEpwhE గత ఏడాది దాస్ కా ధమ్కీ ఆశించిన స్థాయిలో గొప్ప ఫలితాన్ని ఇవ్వకపోయినా ఈ సంవత్సరం గామి విశ్వక్…

3 hours ago

జ‌గ‌న్ అతి విశ్వాసం.. గెలిపిస్తుందా?

విశ్వాసం ఉండడం త‌ప్పుకాదు.. కానీ, అతి విశ్వాసం ఎప్పుడూ.. కొంప ముంచేస్తుంది. ఇప్పుడు ఈ మాట ఎవ‌రో అన‌డం లేదు.…

4 hours ago

వాలెంటైన్ – ఫైటర్ కంటే ఇదే నయం

చరిత్రకు సంబంధించిన ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తెరకెక్కించేటప్పుడు రీసెర్చ్ చాలా అవసరం. కానీ కొందరు దర్శకులు కేవలం మీడియాలో వచ్చిన…

5 hours ago

జగన్ బ్యాండేజీ తీసేశాడహో..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి ఘటన కొన్ని రోజుల పాటు ఎంత చర్చనీయాంశం అయిందో…

5 hours ago

సుకుమార్ సుహాస్ ఇద్దరూ సేఫ్

యూత్ హీరోల్లో బడ్జెట్ పరంగా ప్రామిసింగ్ గా మారుతున్న సుహాస్ కొత్త సినిమా ప్రసన్నవదనం మే 3 విడుదల కానుంది.…

6 hours ago