ఎన్నికలకు దగ్గరపడుతున్న నేపధ్యంలో కేసీయార్ కు ఎక్కడెక్కడి మైనారిటీలు, సామాజికవర్గాలు గుర్తుకొచ్చేస్తున్నాయి. ఒకసారి ఉద్యోగులంటారు. మరోసారి నిరుద్యోగుల కోసం ఉద్యోగాల భర్తీ అంటారు. వెనుకబడిన వర్గాలు, దళితులు, గిరిజనులకు ఆర్ధిక సాయమంటారు. ఏదిచేసినా రాబోయే ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టడం కోసమే అన్న విషయం అందరికీ అర్ధమైపోతోంది. ఇప్పుడిదంతా ఎందుకంటే తాజాగా మైనారిటిలకు నూరుశాతం సబ్సిడితో లక్షరూపాయల రుణాలను ఇవ్వటానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
మైనారిటీలంటే ముస్లింలు, క్రిస్తియన్లు మాత్రమే కాదు. తెలంగాణాలో ఉంటున్న సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు కూడా ఉన్నారు. సిక్కు, జైనులు, పార్శీల్లో పేదలున్నారా లేదా అన్న విషయమై సరైన క్లారిటిలేదు. ఎందుకంటే వీళ్ళు జనాభారీత్యా మైనారిటీలే కావచ్చు కానీ ఆర్ధికంగా మంచి స్ధితిలోనే ఉండే అవకాశముంది. అయినా సరే ఎవరినీ వదిలే ఉద్దేశ్యంలో కేసీయార్ లేరు. అందుకనే కలిపి మైనారిటీలందరికీ లక్ష రూపాయల రుణాన్ని అందించాలని డిసైడ్ చేసింది.
డబ్బులు అవసరమైన వాళ్ళు ఓబీఎంఎంఎస్ పోర్టల్ ద్వారా ఆన్ లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. తెలంగాణా స్టేట్ క్రిస్తియన్, మైనారిటి ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించటానికి ప్రభుత్వం రంగం సిద్ధంచేసింది. మైనారిటీల సంక్షేమం కోసం 2014-23 మధ్యలో రు. 8,581 కోట్లు ఖర్చుచేసినట్లు చెప్పుకుంటోంది. రాబోయే ఎన్నికల్లో మైనారిటీల ఓట్లు చాలా కీలకమని కేసీయార్ గుర్తించారు. ఎందుకంటే ఫైట్ చాలా టైటుగా జరిగినపుడు గెలుపోటముల మధ్య తేడా చాలా తక్కువగానే ఉంటుంది. ఈ తేడాను 1-2 శాతాల ఓట్లు కూడా మార్చేస్తాయి.
అందుకనే కేసీయార్ వ్యూహాత్మకంగా మైనారిటీల ఓట్లపై దృష్టిపెట్టారు. మిగిలిన మైనారిటి వర్గాల సంగతి ఎలాగున్నా ముస్లింల ఓట్లుమాత్రం చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఓల్డ్ సిటిలో మెజారిటి ఓట్లు ముస్లింలవే. అలాగే తెలంగాణా వ్యాప్తంగా కనీసం 30 నియోజకవర్గాల్లో ముస్లింల ఓట్లు గెలుపోటములను డిసైడ్ చేస్తాయనే అంచనా ఉంది. అందుకనే గెలుపుకోసం ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకూడదని కేసీయార్ డిసైడ్ అయ్యారు. కాబట్టి సడెన్ గా మైనారిటీల కోసం అని నిధుల పంపిణీకి రెడీ అయిపోయారు.
This post was last modified on July 25, 2023 11:43 am
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…