ఏపీలో అధికార పార్టీ మరోసారి విజయం దక్కించుకుంటుందా? లేదా.. అనే విషయం కన్నా ముందు క్షేత్ర స్థాయిలో మాత్రం రాజకీయం వేడెక్కింది. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఇబ్బందిగానే మారింది. స్థానిక నేతల ఆధిపత్యాలు.. గత ఎన్నికల సమయంలో చేసిన ప్రయోగాలు వంటివి.. ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వారి ఆందోళనలు వెరసి.. వైసీపీ పరిస్థితి చాలా నియోజకవర్గాల్లో ఇబ్బందుల్లోనే ఉందని అంటున్నారు పరిశీలకులు.
నందికొట్కూరు, హిందూపురం, ప్రత్తిపాడు, రామచంద్రపురం, రాజమండ్రి రూరల్, పాతపట్నం, టెక్కలి, రాజంపేట, కోడూరు, గిద్దలూరు, అద్దంకి, పరుచూరు.. ఇలా అనేక నియోజకవర్గాల్లో వైసీపీ వేసిన అడుగులు ఇప్పుడు సమస్యలు సృష్టిస్తున్నాయి. ఎక్కడికక్కడ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం.. పార్టీని రోడ్డున పడేయడం వంటివి సర్వసాధారణంగా మారాయనే టాక్ వినిపిస్తోంది. నిజానికి వచ్చే ఎన్నికలకు ముందు పార్టీ డెవలప్ చేయాల్సిన బాధ్యత క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలపైనే ఉంది.
అయితే.. ఇప్పుడు సొంత పార్టీ నాయకులే ప్రతిపక్ష నాయకులకన్నా కూడా ఎక్కువగా రోడ్డునపడి సొంత నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో వైసీపీ ఆయా నియోజకవర్గాల్లో పలుచన అయిందనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. మరో 6-7 మాసాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికైనా.. నాయకులు కలసి కట్టుగా ఉండకపోతే.. ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యర్థి పక్షాలు పాగా వేయడం ఖాయమ నే సంకేతాలు కూడా వస్తున్నాయి. మరి ఏం చేస్తారో చూడాలి.
ఇప్పటికైతే.. నాయకుల మధ్య సఖ్యత కనిపించడం లేదని.. ఎవరికి వారు ఆధిపత్య రాజకీయాలు చేసుకుంటూ.. ముందుకు సాగుతున్నారని అంటున్నారు పరిశీలకులు. మరి వైసీపీ అధిష్టానం ఏం చేస్తుందో చూడాలి.
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…
గజ్వేల్ నియోజకవర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట. అయితే.. ఇక్కడే పాగా వేయాలని.. వచ్చే…
తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…
అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయితే.. ఇప్పటి వరకు చూసింది ఒక లెక్క.. ఇక నుంచి మరో…
ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారిన 'డీజే సౌండ్' వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. తాజాగా అనంతపురంలో నిర్వహించిన వినాయక నిమజ్జన…