ఏపీలో బీజేపీ, జనసేనల మధ్య అధికారికంగా పొత్తు ఖాయమైన సంగతి తెలిసిందే. అయితే, టీడీపీతో బీజేపీకి ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ ను తాను సెట్ చేస్తానని, మూడు పార్టీలు కలిసి రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే బీజేపీ, టీడీపీల మధ్య పవన్ రాయబారం చేస్తున్నారంటూ వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ వ్యవహారంపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.
పవన్ కల్యాణ్, చంద్రబాబు పొలిటికల్ సూసైడ్ కు ప్రయత్నిస్తున్నారని, మునిగిన పడవపై ప్రయాణిస్తున్నారని నారాయణ షాకింగ్ కామెంట్లు చేశారు. తాము పవన్, చంద్రబాబుకు మద్దతివ్వబోమని తేల్చేశారు. పవన్, టీడీపీ కలిసి రాజకీయం చేస్తున్నారని, సీమ అభివృద్ధికి 50 కోట్లు ఇస్తానని ఒక్క కోటి కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరంపై ప్రజలకు బీజేపీ అన్యాయం చేసిందని, బీజేపీతో కలిసే పార్టీలన్నీ తెలుగు ప్రజలకు ద్రోహం చేసినట్లేనని అన్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే తమ మద్దతు ఎవరికో చెబుతామని, కమ్యూనిస్టు పార్టీగానే పోటీ చేస్తామని తెలిపారు. సీపీఐ, సీపీఎం కలిసి సమిష్టి నిర్ణయం తీసుకుంటాయన్నారు.
కేంద్రం ప్రవేశపెట్టే బిల్లులలకు ముందు ఓటు వేసేది వైసీపీ అని ఆరోపించారు. ఏపీలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, రాష్ట్రంలో దొంగలు, అరాచకాలు, దౌర్జన్యం, మాఫియా పెరిగిపోయాయని మండిపడ్డారు. కమ్యూనిస్టుల బలం తగ్గడంతో వల్లే పార్లమెంటులో ప్రజాసమస్యల పరిష్కారం కావడం లేదని, మణిపూర్ లో గిరిజనులను బెదిరించి 50వేల ఎకరాల భూమిని అదానీకి అప్పగించిందని ఆరోపించారు. బీజేపీతో జగన్ కలిసే ఉన్నారని అన్నారు.
This post was last modified on July 24, 2023 10:01 pm
టీడీపీతో రాజకీయం మొదలుపెట్టి...ఆపై బీఆర్ఎస్ లో చేరి సక్సెస్ ఫుల్ రాజకీయవేత్తగా ఎదిగిన మాజీ మంత్రి మల్లారెడ్డి త్వరలోనే మరోమారు పార్టీ…
వైసీపీ కీలక నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. రాజమహేంద్రవరంలోని కోర్టు విచారణకు హాజరై తిరిగి…
రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు సింగపూర్లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన శుక్రవారం తో ముగియనుంది. మూడు రోజుల పర్యటనలో…
సినిమా ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ కాంబినేషన్లు సెట్స్ పైకి వెళ్లకముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్,…
నందమూరి బాలకృష్ణ స్పీడ్ ను అందుకోవడం ఇప్పుడున్న కుర్ర హీరోలకు కూడా కష్టమే అనిపిస్తోంది. అఖండ 2 ఫ్లాప్ అయినా…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. వాస్తవానికి గతంలో కొన్ని కొన్ని చెదురుమొదురు ఘటనలు జరిగేవి. తాజాగా…