Political News

గ‌తం మ‌రిచిపోతే ఎలా.. సీఎం వ్యాఖ్య‌ల‌పై స‌భ‌లో టాక్‌!

ఏపీ సీఎం జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై స‌భ‌లో ఉన్న‌వారే.. ఒకింత ఆశ్చ‌ర్య‌పోయారు. గ‌తం మ‌రిచిపోతే ఎలా! అంటూ.. ఒక‌రిద్ద‌రు చ‌ర్చించుకోవ‌డం క‌నిపించింది. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. తాజాగా అమ‌రావ‌తి ప్రాంతంలో ఆర్‌-5 జోన్‌లో పేద‌ల‌కు ఇళ్ల ప‌ట్టాలు ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో వారు ఇళ్లు నిర్మించుకునేందుకు వీలుగా చ‌దును చేసిన ప్లాట్ల‌ను కూడా ఇచ్చారు. ఇప్పుడు ఇక్క‌డ నిర్మాణాలు చేప‌ట్టేందుకు సీఎం జ‌గ‌న్ శంకు స్థాప‌న చేశారు. అదేవిధంగా వ‌న‌మ‌హోత్స‌వాన్ని ప్రారంభించారు.

అనంత‌రం సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ.. పెత్తందారులపై పేదవాడు సాధించిన విజయం ఇద‌ని పేర్కొన్నా రు. ఇంటి పట్టాలు అందించి ఇప్పుడు ఇళ్ల నిర్మాణానికి పునాదు వేస్తున్నామ‌న్నారు. మన పేదల ప్రభు త్వానికి పెత్తందారుల కూటమికి యుద్ధం జరుగుతోందని చెప్పారు. ఇదేస‌మ‌యంలో విప‌క్షాల‌పై విమ‌ర్శ లు చేశారు. “పేదవాడికి ఏ మంచి పని జరిగినా అడ్డుకోవడమే వీరి పని. పేదల పిల్లలు ఇంగ్లిష్‌ మీడియంలో చదవకూడదా? పెత్తందారుల పిల్లలే ఇంగ్లీష్‌ మీడియంలో చదవాలా” అని ప్ర‌శ్నించారు.

అంతేకాదు.. పేదల శత్రువలపై పేదలు సాధించిన విజయం ఇదని సీఎం పేర్కొన్నారు. ఎన్నో అవరోధాలను అధిగమించి ఇళ్లు నిర్మిస్తున్నామ‌ని చెప్పారు. పేద‌ల‌కు అంద‌రికీ ఇళ్లు కట్టిస్తానని చంద్రబాబు మోసం చేశారని విమ‌ర్శించారు. ఇప్పుడు తాము క‌ట్టిస్తుంటే సైంధ‌వుల్లా అడ్డు ప‌డుతున్నార‌ని వ్యాఖ్యానించారు. పేదలకు ఇల్లు రాకూడదనేదే వీరందరి కుట్రగా పేర్కొన్నారు. దీని కోసం సుప్రీంకోర్టుకు వెళ్లి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి మన రాష్ట్రంలోనే చూశామ‌ని సీఎం వ్యాఖ్యానించారు.

అయితే.. సీఎం వ్యాఖ్య‌ల‌పై స‌భ‌లోనే ఉన్న కొంద‌రు విద్యావంతులు.. స్థానికంగా జ‌రిగిన విష‌యాల‌పై అవ‌గాహ‌న ఉన్న‌వారు బుగ్గ‌లు నొక్కుకున్నారు. గ‌తంలో ఇదే ప్రాంతంపై అనేక సార్లు కోర్టుకు వెళ్లింది మీరే క‌దా? ప్ర‌పంచ బ్యాంకు నుంచి రుణాలు ద‌క్క‌కుండా చేయ‌డంలో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి లేఖ‌లు రాయ‌లేదా? కోర్టులో కేసులు వేయ‌లేదా? ఇక్క‌డేదో జ‌రిగిపోతోంద‌ని.. సుప్రీంకోర్టు వ‌ర‌కు వెళ్లింది ఎవ‌రు? అని ప్ర‌శ్నించారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు మీరు చేసిందీ ఇదే క‌దా! అని బుగ్గ‌లు నొక్కుకున్నారు.

This post was last modified on July 24, 2023 5:42 pm

Share

Recent Posts

సాలిడ్ కంటెంట్ పడితే రవితేజ స్టామినా ఇది

టాలీవుడ్ థియేటర్ల దగ్గర ఇరుముడి సందడి ఓ రేంజ్ లో ఉంది. సెకండ్ షోలు సైతం టికెట్ ముక్క దొరకనంతగా…

24 minutes ago

వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ?

కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…

3 hours ago

మెగాస్టార్ ప్రస్థానం… టాలీవుడ్ మాస్ సంతకం

తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…

3 hours ago

సందీప్ వంగ ‘చిరు’ ఫ్యానిజం… ఇది చాలా లోతు బాసూ

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…

3 hours ago

చిరంజీవి కాకా… అదిరింది కానుక

ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…

4 hours ago

ప్యారడైజ్ నిర్ణయం ఇరుముడికి వరం

ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…

5 hours ago