టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్టు ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకునే వ్యూహంతోపాటు.. తన సొంత నియోజకవర్గం కుప్పంలోనూ ఆయన ఈ సారి భారీ మెజారిటీదక్కించుకుని వైసీపీ నాయకులకు షాక్ ఇవ్వడంతోపాటు.. వారి వ్యూహాలను కూడా పటాపంచలు చేయాలని నిర్ణయించుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తాజాగా సొంత నియోజకవర్గంలో ఇంటి కోసం.. భూమి పూజ చేశారు. ఎలాంటి చడీ చప్పుడు లేకుండా.. చంద్రబాబు ఇక్కడ రెండు ఎకరాల్లో ఇంటి నిర్మాణం చేపట్టనున్నారు. దీనిలోనే పార్టీ కార్యాలయంతో పాటు.. ఆయన ఇంటిని కూడా నిర్మించే ప్లాన్ చేశారు. ఇది వచ్చే మూడు మాసాల్లోనే పూర్తి చేసేలా కాంట్రాక్టర్తో ఒప్పందం చేసుకున్నారు. జిల్లా కార్యక్రమాలతోపాటు.. రాష్ట్రస్థాయి నేతలకు కూడా ఇక్కడవిడిది ఏర్పాటుకు ప్రత్యేకంగా వసతులు కల్పించనున్నారు.
కుప్పంలో ఇంటి నిర్మాణం పూర్తి అయితే.. చంద్రబాబు నెలకు పదిరోజుల పాటు ఇక్కడే ఉండి.. సీమ రాజకీయాల్లోప్రధాన పాత్ర పోషించాలని నిర్ణయించినట్టు సీనియర్లు చెబుతున్నారు. ఇప్పటి వరకు సీమ నేతలను ఉండవల్లిలోని ఇంటికి పిలుచుకుని చర్చిస్తున్నారు. వారి సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తన్నారు. అయితే.. దీనివల్ల కొన్ని సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఎవరు ఏం చెబుతున్నారో.. కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలకు సంబంధించి వైసీపీ నేతలు.. టీడీపీ లొసుగులను తమకు అనుకూలం గా మార్చుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా కుప్పంలో చంద్రబాబును ఓడించాలనేది వైసీపీ వ్యూహం. దీంతో చంద్రబాబు ఇక్కడ ఇంటిని నిర్మించుకోవడం ద్వారా.. స్థానిక రాజకీయలపై మరింత పట్టు పెంచుకుని వాటికి అనుగుణంగా తన వ్యూహాలను మార్చుకునే ఉద్దేశంతో ఉన్నారని.. ఇది వర్కవు ట్ అయితే.. ఇక, కుప్పంలో భారీ మెజారిటీ దక్కించుకోవడంతోపాటు సీమలోనూ.. పార్టీని పరుగులు పెట్టించడం ఖాయమని సీనియర్లుచెబుతున్నారు.
This post was last modified on July 24, 2023 3:08 pm
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…