టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్టు ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకునే వ్యూహంతోపాటు.. తన సొంత నియోజకవర్గం కుప్పంలోనూ ఆయన ఈ సారి భారీ మెజారిటీదక్కించుకుని వైసీపీ నాయకులకు షాక్ ఇవ్వడంతోపాటు.. వారి వ్యూహాలను కూడా పటాపంచలు చేయాలని నిర్ణయించుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తాజాగా సొంత నియోజకవర్గంలో ఇంటి కోసం.. భూమి పూజ చేశారు. ఎలాంటి చడీ చప్పుడు లేకుండా.. చంద్రబాబు ఇక్కడ రెండు ఎకరాల్లో ఇంటి నిర్మాణం చేపట్టనున్నారు. దీనిలోనే పార్టీ కార్యాలయంతో పాటు.. ఆయన ఇంటిని కూడా నిర్మించే ప్లాన్ చేశారు. ఇది వచ్చే మూడు మాసాల్లోనే పూర్తి చేసేలా కాంట్రాక్టర్తో ఒప్పందం చేసుకున్నారు. జిల్లా కార్యక్రమాలతోపాటు.. రాష్ట్రస్థాయి నేతలకు కూడా ఇక్కడవిడిది ఏర్పాటుకు ప్రత్యేకంగా వసతులు కల్పించనున్నారు.
కుప్పంలో ఇంటి నిర్మాణం పూర్తి అయితే.. చంద్రబాబు నెలకు పదిరోజుల పాటు ఇక్కడే ఉండి.. సీమ రాజకీయాల్లోప్రధాన పాత్ర పోషించాలని నిర్ణయించినట్టు సీనియర్లు చెబుతున్నారు. ఇప్పటి వరకు సీమ నేతలను ఉండవల్లిలోని ఇంటికి పిలుచుకుని చర్చిస్తున్నారు. వారి సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తన్నారు. అయితే.. దీనివల్ల కొన్ని సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఎవరు ఏం చెబుతున్నారో.. కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలకు సంబంధించి వైసీపీ నేతలు.. టీడీపీ లొసుగులను తమకు అనుకూలం గా మార్చుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా కుప్పంలో చంద్రబాబును ఓడించాలనేది వైసీపీ వ్యూహం. దీంతో చంద్రబాబు ఇక్కడ ఇంటిని నిర్మించుకోవడం ద్వారా.. స్థానిక రాజకీయలపై మరింత పట్టు పెంచుకుని వాటికి అనుగుణంగా తన వ్యూహాలను మార్చుకునే ఉద్దేశంతో ఉన్నారని.. ఇది వర్కవు ట్ అయితే.. ఇక, కుప్పంలో భారీ మెజారిటీ దక్కించుకోవడంతోపాటు సీమలోనూ.. పార్టీని పరుగులు పెట్టించడం ఖాయమని సీనియర్లుచెబుతున్నారు.
This post was last modified on July 24, 2023 3:08 pm
ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రస్తుతం సీబీఐ విచారణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్ను కూడా నెల్లూరు…
డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…
వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…
హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…