ఏపీ సీఎం జగన్.. తాజాగా రాజధాని అమరావతి గురించి సంచలన ప్రకటన చేశారు. ఏపీలో అధికారం చేపట్టి నాలుగేళ్లు గడిచినా.. కనీసం ఏ వేదికపై నుంచి కూడా అమరావతి అన్న మాట పలకని సీఎం జగన్ .. తాజాగా అమరావతి గురించి మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఆర్-5 జోన్ లో పేదలకు పట్టాలు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికి అనేక షరతులు కూడా ఉన్నాయనుకోండి.
అయితే, ఆయా పట్టాల పంపిణీ అయిపోయిన దరిమిలా..ఇక్కడ ఇళ్ల నిర్మాణానికి ఈ రోజు సీఎం జగన్ శంకు స్థాపన చేశారు. అదేసమయంలో కొందరు లబ్ధి దారులతోనూ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ… అమరావతిపై వ్యాఖ్యలు చేశారు. “అమరావతి మన అందరిదీ!” అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఇప్పటి వరకు ఉన్న అమరావతి వేరని.. ఇప్పుడు ఇది ‘సామాజిక అమరావతి’గా మార్పు చెందిందని చెప్పారు.
పేదలకు అండగా మార్పు మొదలైందన్న సీఎం జగన్.. సామాజిక అమరావతిగా మార్పుకు శ్రీకారం చుట్టామని చెప్పారు. ఇకపై అమరావతి మనందరి అమరావతి అనే భావనను ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు. అమరావతిని వ్యతిరేకించామని దుష్టచతుష్టయం ప్రచారం చేసిందని.. కానీ, రాష్ట్రం బాగుండాలనే మూడు రాజధానులు తీసుకువచ్చామన్నారు. అమరావతిలో శాసన రాజధాని ఉంటుందని..ఇది ఎక్కడికీ పోదని చెప్పారు.
తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గత ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేకపోయిందని సీఎం జగన్ ప్రశ్నించారు. మంచి చేసే కార్యక్రమాన్ని అడ్డుతగలడమే వీరి లక్ష్యమని ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. అక్క చెల్లెమ్మలకు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామని చెప్పారు. కోర్టు కేసులతో దీనినీ అడ్డుకునేందుకు ప్రయత్నించారని విమర్శలు గుప్పించారు. పెత్తందారులపై పేదవాడు సాధించిన విజయం ఇది అంటూ.. అమరావతిలో ఇచ్చిన పట్టాలపై వ్యాఖ్యానించారు. చరిత్ర ఉన్నంతవరకూ ఈ రోజును మరిచిపోలేని రోజుగా ఆయన పేర్కొన్నారు.
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…