ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి.. కడప ఎంపీ అవినాష్ రెడ్డి.. తాజాగా సీబీఐకి రాసిన 96 పేజీల లేఖ సంచలనంగా మారింది. వాస్తవానికి ఇప్పటికే సీబీఐ ఎంపీ అవినాష్రెడ్డిని పలుమార్లు విచారించింది. అంతేకాదు.. ఇప్పటికీ ప్రతిశనివారం విచారణ చేస్తూనే ఉంది. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ఎంపీ ప్రతి శనివారం విచారణకు హాజరవుతున్నారు.
ఇప్పుడు తాజాగా ఎంపీ అవినాష్రెడ్డి సీబీఐకి లేఖ రాయడం సంచలనంగా మారింది. అది కూడా.. 96 పేజీల లేఖలో నేరుగా సీబీఐ అధికారి, గతంలో ఈ కేసును విచారించిన రామ్ సింగ్పైనే విమర్శలు చేయడం.. ఇప్పుడు మరింత ఆశ్చర్యంగా ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ఈ లేఖ మొత్తంగా.. రామ్ సింగ్ చుట్టూ తిరిగింది. ఆయన ఉద్దేశపూర్వకంగానే తమను ఈ కేసులో ఇరికించారని.. దస్తగిరికి సాయం చేశారని పేర్కొన్నారు.
అంతేకాదు.. ఒక హంతకుడు(దస్తగిరి) చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకుని, ఆయనకు బెయిల్ కూడా ఇప్పించేందుకు సహకరించారని ఎంపీ అవినాష్ తన లేఖలో పేర్కొన్నారు. “ఇదంతా ఆయనే (రామ్ సింగ్) చేశారు. నన్ను, నా తండ్రిని ఇరికించారు. అసలు హంతకులను విచారించడం మానేశారు. దర్యాప్తునంతా రామ్సింగ్ పక్షపాతంగా చేశారు. ఇదంతా సునీత(వివేకా కుమార్తె) ప్రోద్బలంతోనే చేశారు” అని తాజాగా సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్(ఇటీవల బాధ్యతలు చేపట్టారు) కు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు.
రాజకీయకోణంలోనే ఈ హత్య జరిగిందనడం అవాస్తవమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తనను, తన తండ్రి భాస్కరరెడ్డిని, స్నేహితుడు గజ్జల ఉదయ్కుమార్రెడ్డిని కేసులో ఇరికించారని పేర్కొన్నారు. మొత్తంగా తమ తప్పు ఏమీలేదని, ఇది ఆస్తి వివాదాలు, వివేకా సెకండ్ మ్యారేజీ చుట్టూ తిరిగిన విషయమని ఎంపీ అవినాష్ పేర్కొన్నారు. అయితే.. ఇలా సీబీఐ డైరెక్టర్ మారగానే ఆయన లేఖ సంధించడం వెనుక వ్యూహాలు ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు.
ఇవీ.. వ్యూహాలు(పరిశీలకులు చెబుతున్నవి-కడపలో చర్చకు వస్తున్నవి)
This post was last modified on July 24, 2023 1:06 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…