ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి.. కడప ఎంపీ అవినాష్ రెడ్డి.. తాజాగా సీబీఐకి రాసిన 96 పేజీల లేఖ సంచలనంగా మారింది. వాస్తవానికి ఇప్పటికే సీబీఐ ఎంపీ అవినాష్రెడ్డిని పలుమార్లు విచారించింది. అంతేకాదు.. ఇప్పటికీ ప్రతిశనివారం విచారణ చేస్తూనే ఉంది. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ఎంపీ ప్రతి శనివారం విచారణకు హాజరవుతున్నారు.
ఇప్పుడు తాజాగా ఎంపీ అవినాష్రెడ్డి సీబీఐకి లేఖ రాయడం సంచలనంగా మారింది. అది కూడా.. 96 పేజీల లేఖలో నేరుగా సీబీఐ అధికారి, గతంలో ఈ కేసును విచారించిన రామ్ సింగ్పైనే విమర్శలు చేయడం.. ఇప్పుడు మరింత ఆశ్చర్యంగా ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ఈ లేఖ మొత్తంగా.. రామ్ సింగ్ చుట్టూ తిరిగింది. ఆయన ఉద్దేశపూర్వకంగానే తమను ఈ కేసులో ఇరికించారని.. దస్తగిరికి సాయం చేశారని పేర్కొన్నారు.
అంతేకాదు.. ఒక హంతకుడు(దస్తగిరి) చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకుని, ఆయనకు బెయిల్ కూడా ఇప్పించేందుకు సహకరించారని ఎంపీ అవినాష్ తన లేఖలో పేర్కొన్నారు. “ఇదంతా ఆయనే (రామ్ సింగ్) చేశారు. నన్ను, నా తండ్రిని ఇరికించారు. అసలు హంతకులను విచారించడం మానేశారు. దర్యాప్తునంతా రామ్సింగ్ పక్షపాతంగా చేశారు. ఇదంతా సునీత(వివేకా కుమార్తె) ప్రోద్బలంతోనే చేశారు” అని తాజాగా సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్(ఇటీవల బాధ్యతలు చేపట్టారు) కు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు.
రాజకీయకోణంలోనే ఈ హత్య జరిగిందనడం అవాస్తవమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తనను, తన తండ్రి భాస్కరరెడ్డిని, స్నేహితుడు గజ్జల ఉదయ్కుమార్రెడ్డిని కేసులో ఇరికించారని పేర్కొన్నారు. మొత్తంగా తమ తప్పు ఏమీలేదని, ఇది ఆస్తి వివాదాలు, వివేకా సెకండ్ మ్యారేజీ చుట్టూ తిరిగిన విషయమని ఎంపీ అవినాష్ పేర్కొన్నారు. అయితే.. ఇలా సీబీఐ డైరెక్టర్ మారగానే ఆయన లేఖ సంధించడం వెనుక వ్యూహాలు ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు.
ఇవీ.. వ్యూహాలు(పరిశీలకులు చెబుతున్నవి-కడపలో చర్చకు వస్తున్నవి)
This post was last modified on July 24, 2023 1:06 pm
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…