ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి.. కడప ఎంపీ అవినాష్ రెడ్డి.. తాజాగా సీబీఐకి రాసిన 96 పేజీల లేఖ సంచలనంగా మారింది. వాస్తవానికి ఇప్పటికే సీబీఐ ఎంపీ అవినాష్రెడ్డిని పలుమార్లు విచారించింది. అంతేకాదు.. ఇప్పటికీ ప్రతిశనివారం విచారణ చేస్తూనే ఉంది. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ఎంపీ ప్రతి శనివారం విచారణకు హాజరవుతున్నారు.
ఇప్పుడు తాజాగా ఎంపీ అవినాష్రెడ్డి సీబీఐకి లేఖ రాయడం సంచలనంగా మారింది. అది కూడా.. 96 పేజీల లేఖలో నేరుగా సీబీఐ అధికారి, గతంలో ఈ కేసును విచారించిన రామ్ సింగ్పైనే విమర్శలు చేయడం.. ఇప్పుడు మరింత ఆశ్చర్యంగా ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ఈ లేఖ మొత్తంగా.. రామ్ సింగ్ చుట్టూ తిరిగింది. ఆయన ఉద్దేశపూర్వకంగానే తమను ఈ కేసులో ఇరికించారని.. దస్తగిరికి సాయం చేశారని పేర్కొన్నారు.
అంతేకాదు.. ఒక హంతకుడు(దస్తగిరి) చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకుని, ఆయనకు బెయిల్ కూడా ఇప్పించేందుకు సహకరించారని ఎంపీ అవినాష్ తన లేఖలో పేర్కొన్నారు. “ఇదంతా ఆయనే (రామ్ సింగ్) చేశారు. నన్ను, నా తండ్రిని ఇరికించారు. అసలు హంతకులను విచారించడం మానేశారు. దర్యాప్తునంతా రామ్సింగ్ పక్షపాతంగా చేశారు. ఇదంతా సునీత(వివేకా కుమార్తె) ప్రోద్బలంతోనే చేశారు” అని తాజాగా సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్(ఇటీవల బాధ్యతలు చేపట్టారు) కు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు.
రాజకీయకోణంలోనే ఈ హత్య జరిగిందనడం అవాస్తవమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తనను, తన తండ్రి భాస్కరరెడ్డిని, స్నేహితుడు గజ్జల ఉదయ్కుమార్రెడ్డిని కేసులో ఇరికించారని పేర్కొన్నారు. మొత్తంగా తమ తప్పు ఏమీలేదని, ఇది ఆస్తి వివాదాలు, వివేకా సెకండ్ మ్యారేజీ చుట్టూ తిరిగిన విషయమని ఎంపీ అవినాష్ పేర్కొన్నారు. అయితే.. ఇలా సీబీఐ డైరెక్టర్ మారగానే ఆయన లేఖ సంధించడం వెనుక వ్యూహాలు ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు.
ఇవీ.. వ్యూహాలు(పరిశీలకులు చెబుతున్నవి-కడపలో చర్చకు వస్తున్నవి)
This post was last modified on July 24, 2023 1:06 pm
ఏపీలో పోలింగ్ ప్రక్రియకు మరికొన్ని గంటల ముందు.. సంచలనం చోటు చేసుకుంది. కూటమి పార్టీల ముఖ్య నేత, టీడీపీ అధినేత…
ఏపీలో చిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. శనివారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసిపోవడంతో నాయకులు, పార్టీల అధినే తలు ఎక్కడికక్కడ సేద…
బెట్టింగ్లో రూ.2 కోట్లు పోగొట్టిన కుమారుడిని తండ్రి హతమార్చిన ఘటన మెదక్ జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం బగిరాత్పల్లిలో చోటు చేసుకుంది.…
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల్లో యూత్లో పవన్కు ఉన్నది మామూలు క్రేజ్ కాదు. సినిమాల్లో సూపర్ స్టార్ ఇమేజ్ వల్ల…
ఆంధ్రప్రదేశ్లో గత పర్యాయం వైఎస్సార్ కాంగ్రెస్ 151 సీట్లతో ఘనవిజయం సాధించడంలో ఆ పార్టీకి వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్…
దాదాపు 55 రోజుల పాటు అవిశ్రాంతంగా పార్లమెంటు ఎన్నికల ప్రచారం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పీసీసీచీఫ్ ఎనుముల రేవంత్…