ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి.. కడప ఎంపీ అవినాష్ రెడ్డి.. తాజాగా సీబీఐకి రాసిన 96 పేజీల లేఖ సంచలనంగా మారింది. వాస్తవానికి ఇప్పటికే సీబీఐ ఎంపీ అవినాష్రెడ్డిని పలుమార్లు విచారించింది. అంతేకాదు.. ఇప్పటికీ ప్రతిశనివారం విచారణ చేస్తూనే ఉంది. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ఎంపీ ప్రతి శనివారం విచారణకు హాజరవుతున్నారు.
ఇప్పుడు తాజాగా ఎంపీ అవినాష్రెడ్డి సీబీఐకి లేఖ రాయడం సంచలనంగా మారింది. అది కూడా.. 96 పేజీల లేఖలో నేరుగా సీబీఐ అధికారి, గతంలో ఈ కేసును విచారించిన రామ్ సింగ్పైనే విమర్శలు చేయడం.. ఇప్పుడు మరింత ఆశ్చర్యంగా ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ఈ లేఖ మొత్తంగా.. రామ్ సింగ్ చుట్టూ తిరిగింది. ఆయన ఉద్దేశపూర్వకంగానే తమను ఈ కేసులో ఇరికించారని.. దస్తగిరికి సాయం చేశారని పేర్కొన్నారు.
అంతేకాదు.. ఒక హంతకుడు(దస్తగిరి) చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకుని, ఆయనకు బెయిల్ కూడా ఇప్పించేందుకు సహకరించారని ఎంపీ అవినాష్ తన లేఖలో పేర్కొన్నారు. “ఇదంతా ఆయనే (రామ్ సింగ్) చేశారు. నన్ను, నా తండ్రిని ఇరికించారు. అసలు హంతకులను విచారించడం మానేశారు. దర్యాప్తునంతా రామ్సింగ్ పక్షపాతంగా చేశారు. ఇదంతా సునీత(వివేకా కుమార్తె) ప్రోద్బలంతోనే చేశారు” అని తాజాగా సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్(ఇటీవల బాధ్యతలు చేపట్టారు) కు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు.
రాజకీయకోణంలోనే ఈ హత్య జరిగిందనడం అవాస్తవమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తనను, తన తండ్రి భాస్కరరెడ్డిని, స్నేహితుడు గజ్జల ఉదయ్కుమార్రెడ్డిని కేసులో ఇరికించారని పేర్కొన్నారు. మొత్తంగా తమ తప్పు ఏమీలేదని, ఇది ఆస్తి వివాదాలు, వివేకా సెకండ్ మ్యారేజీ చుట్టూ తిరిగిన విషయమని ఎంపీ అవినాష్ పేర్కొన్నారు. అయితే.. ఇలా సీబీఐ డైరెక్టర్ మారగానే ఆయన లేఖ సంధించడం వెనుక వ్యూహాలు ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు.
ఇవీ.. వ్యూహాలు(పరిశీలకులు చెబుతున్నవి-కడపలో చర్చకు వస్తున్నవి)
This post was last modified on July 24, 2023 1:06 pm
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో…
ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 108 సీట్లు గెలుచుకున్న విజయ్ పార్టీ…మ్యాజిక్…
పొట్లూరి వరప్రసాద్.. ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గట్టిగా వినిపించిన పేరు. రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ ‘బలుపు’తో ఆయన…
టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాఠశాలలు, దేవాలయాల సమీపంలో…
రాత్రి వేళ గస్తీ కాసేందుకు దేశం కాని దేశం వస్తున్న నేపాలీలు ఇప్పుడు నేరాల్లో ఆరితేరిపోయారని చెప్పాలి. గుర్ఖాలుగా ఎంట్రీ…
చట్టం గెలిచిందనుకున్న ప్రతీసారి పైరసీ కొత్త అవతారం ఎత్తుతోంది. ఐబొమ్మ ఆపరేటర్ రవి అరెస్ట్, సైట్ క్లోజ్ అని పోలీసులు…