Political News

ఎగ్గొట్టే ఉద్దేశ్యం లేదంటోన్న వైసీపీ ఎమ్మెల్యే

పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆస్తుల వేలం అంటూ సంచలన ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆయనకు సంబంధించిన ఆస్తులు వేలం వేసేందుకు కెనరా బ్యాంకు రెడీ అయిందంటూ మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. ఆస్తులను వేలం వేస్తున్నట్టు కెనరా బ్యాంకు బహిరంగ ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ వ్యవహారంపై ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి స్పందించారు. కరోనా సమయంలో వ్యాపారాలు రన్ కాలేదని, అందుకే బ్యాంకుకు రుణాలు చెల్లించడం ఆలస్యం అయ్యిందని ఆయన అంగీకరించారు. అయితే, అప్పు ఎగ్గొట్టాలన్న ఉద్దేశ్యం లేదని, తాను పారిపోయే వాడిని కాదని చెప్పారు. తన పార్టీకి చెందిన కొందరు నేతలే తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.

కంపెనీలో వ్యాపారం జరుగుతోందని, రావాల్సిన బకాయిలు రాలేదని చెప్పుకొచ్చారు. బ్యాంకులకు బిల్లులు చెల్లిస్తున్నానని, వ్యాపార లావాదేవీలలో ఒడిదుడుకులు సహజమని అన్నారు. చెల్లింపు కొంచెం లేట్ అయినంత మాత్రాన ఎగ్గొట్టి పోతారనడం దారుణమని అన్నారు. రూ.1500 కోట్లు విలువైన పనులు జరిగాయని, బకాయిలు రావాల్సి ఉందని అన్నారు. అవి వచ్చిన వెంటనే బ్యాంకు రుణాలు చెల్లిస్తామని వివరణనిచ్చే ప్రయత్నం చేశారు. రాజకీయాన్ని రాజకీయంగా చూడాలని, వ్యాపారాన్ని వ్యాపారంగా చూడాలని అన్నారు. తాను మళ్లీ పోటీ చేస్తే మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఓడిపోతారని ఇలాంటి జిమ్మిక్కులు ఆడుతున్నారని మండిపడ్డారు.

తనను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సాయి సుధీర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ… కెనరా బ్యాంకు నుంచి రుణాలు తీసుకొని చెల్లించలేదు. ఆ రుణాలకు శ్రీధర్ రెడ్డి హామీ ఉన్నారు. దీంతో, కంపెనీతో పాటు, శ్రీధర్ రెడ్డి ఆస్తులను ఆగస్టు 18న వేలం వేయనున్నట్టు బ్యాంకు ప్రకటించిన విషయం తెలిసిందే.

This post was last modified on July 23, 2023 10:34 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రేమ పెళ్లితో షాకిచ్చిన వైర‌ల్ మోనాలిసా

మోనాలిసా.. గ‌త ఏడాది సోష‌ల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జ‌రిగిన‌ మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…

22 seconds ago

కిం క‌ర్త‌వ్యం… అంత‌ర్మ‌థ‌నంలో బీఆర్ఎస్‌?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌, మాజీ మంత్రి పార్టీ కీల‌క…

33 minutes ago

ఇరానీ చాయ్ మీద ఇరాన్ వార్

ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…

39 minutes ago

లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాసం.. ఎందుకంటే!

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్‌సభ స్పీకర్‌పై తమకు విశ్వాసం…

50 minutes ago

రెండు విషయాల్లో ఉస్తాదే కరెక్ట్

ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…

1 hour ago

అసెంబ్లీకి వస్తే ఆ జాకీలను పడేయొచ్చుగా జగన్

అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…

4 hours ago