Political News

ఎగ్గొట్టే ఉద్దేశ్యం లేదంటోన్న వైసీపీ ఎమ్మెల్యే

పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆస్తుల వేలం అంటూ సంచలన ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆయనకు సంబంధించిన ఆస్తులు వేలం వేసేందుకు కెనరా బ్యాంకు రెడీ అయిందంటూ మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. ఆస్తులను వేలం వేస్తున్నట్టు కెనరా బ్యాంకు బహిరంగ ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ వ్యవహారంపై ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి స్పందించారు. కరోనా సమయంలో వ్యాపారాలు రన్ కాలేదని, అందుకే బ్యాంకుకు రుణాలు చెల్లించడం ఆలస్యం అయ్యిందని ఆయన అంగీకరించారు. అయితే, అప్పు ఎగ్గొట్టాలన్న ఉద్దేశ్యం లేదని, తాను పారిపోయే వాడిని కాదని చెప్పారు. తన పార్టీకి చెందిన కొందరు నేతలే తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.

కంపెనీలో వ్యాపారం జరుగుతోందని, రావాల్సిన బకాయిలు రాలేదని చెప్పుకొచ్చారు. బ్యాంకులకు బిల్లులు చెల్లిస్తున్నానని, వ్యాపార లావాదేవీలలో ఒడిదుడుకులు సహజమని అన్నారు. చెల్లింపు కొంచెం లేట్ అయినంత మాత్రాన ఎగ్గొట్టి పోతారనడం దారుణమని అన్నారు. రూ.1500 కోట్లు విలువైన పనులు జరిగాయని, బకాయిలు రావాల్సి ఉందని అన్నారు. అవి వచ్చిన వెంటనే బ్యాంకు రుణాలు చెల్లిస్తామని వివరణనిచ్చే ప్రయత్నం చేశారు. రాజకీయాన్ని రాజకీయంగా చూడాలని, వ్యాపారాన్ని వ్యాపారంగా చూడాలని అన్నారు. తాను మళ్లీ పోటీ చేస్తే మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఓడిపోతారని ఇలాంటి జిమ్మిక్కులు ఆడుతున్నారని మండిపడ్డారు.

తనను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సాయి సుధీర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ… కెనరా బ్యాంకు నుంచి రుణాలు తీసుకొని చెల్లించలేదు. ఆ రుణాలకు శ్రీధర్ రెడ్డి హామీ ఉన్నారు. దీంతో, కంపెనీతో పాటు, శ్రీధర్ రెడ్డి ఆస్తులను ఆగస్టు 18న వేలం వేయనున్నట్టు బ్యాంకు ప్రకటించిన విషయం తెలిసిందే.

This post was last modified on July 23, 2023 10:34 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

5 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

5 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

7 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

7 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

8 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

8 hours ago