పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆస్తుల వేలం అంటూ సంచలన ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆయనకు సంబంధించిన ఆస్తులు వేలం వేసేందుకు కెనరా బ్యాంకు రెడీ అయిందంటూ మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. ఆస్తులను వేలం వేస్తున్నట్టు కెనరా బ్యాంకు బహిరంగ ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ వ్యవహారంపై ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి స్పందించారు. కరోనా సమయంలో వ్యాపారాలు రన్ కాలేదని, అందుకే బ్యాంకుకు రుణాలు చెల్లించడం ఆలస్యం అయ్యిందని ఆయన అంగీకరించారు. అయితే, అప్పు ఎగ్గొట్టాలన్న ఉద్దేశ్యం లేదని, తాను పారిపోయే వాడిని కాదని చెప్పారు. తన పార్టీకి చెందిన కొందరు నేతలే తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.
కంపెనీలో వ్యాపారం జరుగుతోందని, రావాల్సిన బకాయిలు రాలేదని చెప్పుకొచ్చారు. బ్యాంకులకు బిల్లులు చెల్లిస్తున్నానని, వ్యాపార లావాదేవీలలో ఒడిదుడుకులు సహజమని అన్నారు. చెల్లింపు కొంచెం లేట్ అయినంత మాత్రాన ఎగ్గొట్టి పోతారనడం దారుణమని అన్నారు. రూ.1500 కోట్లు విలువైన పనులు జరిగాయని, బకాయిలు రావాల్సి ఉందని అన్నారు. అవి వచ్చిన వెంటనే బ్యాంకు రుణాలు చెల్లిస్తామని వివరణనిచ్చే ప్రయత్నం చేశారు. రాజకీయాన్ని రాజకీయంగా చూడాలని, వ్యాపారాన్ని వ్యాపారంగా చూడాలని అన్నారు. తాను మళ్లీ పోటీ చేస్తే మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఓడిపోతారని ఇలాంటి జిమ్మిక్కులు ఆడుతున్నారని మండిపడ్డారు.
తనను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సాయి సుధీర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ… కెనరా బ్యాంకు నుంచి రుణాలు తీసుకొని చెల్లించలేదు. ఆ రుణాలకు శ్రీధర్ రెడ్డి హామీ ఉన్నారు. దీంతో, కంపెనీతో పాటు, శ్రీధర్ రెడ్డి ఆస్తులను ఆగస్టు 18న వేలం వేయనున్నట్టు బ్యాంకు ప్రకటించిన విషయం తెలిసిందే.
This post was last modified on July 23, 2023 10:34 am
ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…
ఇండస్ట్రీలో వరుసగా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవకాశాలు దక్కించుకోవడం అంత తేలికైన విషయం కాదు. కానీ కొందరు డైరెక్టర్లు మాత్రం తమ…
ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…
ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబర్ స్థానానికి పోటీ పడ్డ ఇద్దరు టాప్ హీరోల మధ్య మంచి స్నేహం…
ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…
ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా ఏపీలో పాలన సాగిస్తున్నారు. గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో…