రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలవాలన్నా బీసీ సామాజికవర్గం ఓట్లే కీలకమన్న విషయం తేలిపోయింది. ఎందుకంటే అధికారంలోకి రావాలని అనుకుంటున్న కాంగ్రెస్, బీజేపీలో బీసీలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతలపై డిమాండ్లు పెరిగిపోతున్నాయి. సామాజికవర్గాల జనాభా ఆధారంగా బీసీలకు ప్రాధాన్యత దక్కాల్సిందే అని బీసీల నేతలు తీర్మానాలు కూడా చేస్తున్నారు. ఇదే సమయంలో ఇదే విషయమై బీఆర్ఎస్ లో కూడా కేసీయార్ పై ఒత్తిడి పెరిగిపోతోందని సమాచారం.
పై రెండు పార్టీలంటే ప్రతిపక్షంలో ఉన్నాయి కాబట్టి అధికారంలోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తామని హామీలిస్తాయి. కానీ బీఆర్ఎ గడచిన తొమ్మిదేళ్ళుగా అధికారంలోనే ఉన్నది. అయినా దామాషా ప్రకారం చూసుకుంటే బీసీలకు చేసింది తక్కువే. అందుకనే రాబోయే ఎన్నికల్లో ఎంపీ, ఎంఎల్ఏల టికెట్ల కేటాయింపులో బీసీలకు సరైన వాటా దక్కకపోతే కతేమిటో చూపిస్తామన్నట్లుగా బెదిరింపులు పెరిగిపోతున్నాయట. అప్పుడెప్పుడు బీసీలకు హామీ ఇచ్చినట్లుగా ఆత్మగౌరవ భవన్ల నిర్మాణాలు పూర్తేకాలేదు.
ఎంబీసీ కార్పొరేషన్ కు ఛైర్మనే లేరు. బీసీల సంక్షేమం కోసం కేటాయించిన నిధుల్లో ఖర్చయినవి చాలా తక్కువట. ఇక కేబినెట్లో బీసీ మంత్రుల సంఖ్య మూడు మాత్రమే. రెడ్లు 6 మంది వెలమలు నలుగురికి అవకాశం ఇచ్చిన కేసీయార్ బీసీల్లో మాత్రం ముగ్గురినే తీసుకున్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన ఈటెల రాజేందర్ ను అవమానించిన తీరు కేసీయార్ పై వ్యతిరేకతను పెంచిందని సమాచారం. ప్రస్తుతం బీఆర్ఎస్ కు 105 మంది ఎంఎల్ఏలుంటే అందులో బీసీల సంఖ్య 22 మాత్రమే.
అదే రెడ్డి సామాజికవర్గం నుండి 36 మందుంటే వెలమలు 10 మందున్నారు. నిజానికి వెలమల సంఖ్య చాలాచాలా తక్కువ. కాకపోతే కేసీయార్ ది అదే సామాజికవర్గం కాబట్టే అవసరానికి మించిన ప్రాధాన్యత దక్కుతోందని బీసీనేతలు మండిపోతున్నారు. గొర్లె పంపిణీ పథకం ఎక్కడికి పోయింది తెలీదు. బీసీ బంధు ఏమైందో కూడా చెప్పలేరు. బీసీలకు న్యాయపరంగా దక్కాల్సింది కూడా దక్కనీయకలేదనే మంట బీసీల్లో పెరిగిపోతోందట. అందుకనే వాస్తవాలు గ్రహించే బీసీలను మంచిచేసుకునే పనిలో కేసీయార్ ప్లాన్లు వేస్తున్నారట. మరి ఆ ప్లేన్లేమిటో ? బీసీలు ఏమిచేస్తారో చూడాలి.
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…