రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలవాలన్నా బీసీ సామాజికవర్గం ఓట్లే కీలకమన్న విషయం తేలిపోయింది. ఎందుకంటే అధికారంలోకి రావాలని అనుకుంటున్న కాంగ్రెస్, బీజేపీలో బీసీలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతలపై డిమాండ్లు పెరిగిపోతున్నాయి. సామాజికవర్గాల జనాభా ఆధారంగా బీసీలకు ప్రాధాన్యత దక్కాల్సిందే అని బీసీల నేతలు తీర్మానాలు కూడా చేస్తున్నారు. ఇదే సమయంలో ఇదే విషయమై బీఆర్ఎస్ లో కూడా కేసీయార్ పై ఒత్తిడి పెరిగిపోతోందని సమాచారం.
పై రెండు పార్టీలంటే ప్రతిపక్షంలో ఉన్నాయి కాబట్టి అధికారంలోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తామని హామీలిస్తాయి. కానీ బీఆర్ఎ గడచిన తొమ్మిదేళ్ళుగా అధికారంలోనే ఉన్నది. అయినా దామాషా ప్రకారం చూసుకుంటే బీసీలకు చేసింది తక్కువే. అందుకనే రాబోయే ఎన్నికల్లో ఎంపీ, ఎంఎల్ఏల టికెట్ల కేటాయింపులో బీసీలకు సరైన వాటా దక్కకపోతే కతేమిటో చూపిస్తామన్నట్లుగా బెదిరింపులు పెరిగిపోతున్నాయట. అప్పుడెప్పుడు బీసీలకు హామీ ఇచ్చినట్లుగా ఆత్మగౌరవ భవన్ల నిర్మాణాలు పూర్తేకాలేదు.
ఎంబీసీ కార్పొరేషన్ కు ఛైర్మనే లేరు. బీసీల సంక్షేమం కోసం కేటాయించిన నిధుల్లో ఖర్చయినవి చాలా తక్కువట. ఇక కేబినెట్లో బీసీ మంత్రుల సంఖ్య మూడు మాత్రమే. రెడ్లు 6 మంది వెలమలు నలుగురికి అవకాశం ఇచ్చిన కేసీయార్ బీసీల్లో మాత్రం ముగ్గురినే తీసుకున్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన ఈటెల రాజేందర్ ను అవమానించిన తీరు కేసీయార్ పై వ్యతిరేకతను పెంచిందని సమాచారం. ప్రస్తుతం బీఆర్ఎస్ కు 105 మంది ఎంఎల్ఏలుంటే అందులో బీసీల సంఖ్య 22 మాత్రమే.
అదే రెడ్డి సామాజికవర్గం నుండి 36 మందుంటే వెలమలు 10 మందున్నారు. నిజానికి వెలమల సంఖ్య చాలాచాలా తక్కువ. కాకపోతే కేసీయార్ ది అదే సామాజికవర్గం కాబట్టే అవసరానికి మించిన ప్రాధాన్యత దక్కుతోందని బీసీనేతలు మండిపోతున్నారు. గొర్లె పంపిణీ పథకం ఎక్కడికి పోయింది తెలీదు. బీసీ బంధు ఏమైందో కూడా చెప్పలేరు. బీసీలకు న్యాయపరంగా దక్కాల్సింది కూడా దక్కనీయకలేదనే మంట బీసీల్లో పెరిగిపోతోందట. అందుకనే వాస్తవాలు గ్రహించే బీసీలను మంచిచేసుకునే పనిలో కేసీయార్ ప్లాన్లు వేస్తున్నారట. మరి ఆ ప్లేన్లేమిటో ? బీసీలు ఏమిచేస్తారో చూడాలి.
దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో విజయ్ సేతుపతి కలయికలో రూపొందిన స్లమ్ డాగ్ షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. అదిగో ఇదిగో…
మెగా ఫ్యాన్స్ మహా అయోమయంలో ఉన్నారు. పెద్ది పోస్ట్ పోన్ అయ్యింది కానీ జూన్ నెలలో ఏ డేట్ కి…
స్టార్ హీరోలు డిజాస్టర్లు ఇచ్చినప్పుడు దాని తాలూకు పరిణామాలు కేవలం బాక్సాఫీస్ నష్టాలకే పరిమితం కాదు. ముఖ్యంగా సోషల్ మీడియా…
గత కొన్నేళ్లలో ఇండియన్ సినిమాలో వచ్చిన బెస్ట్ లవ్ స్టోరీల్లో ‘సైయారా’ ఒకటి. సంగీత ప్రధానంగా సాగే ఈ ప్రేమకథ.. దేశవ్యాప్తంగా…
ఒక భారీ చిత్రం విడుదలకు చాలా రోజుల ముందే హెచ్డీ ప్రింట్ లీక్ అయిపోవడం గత కొద్ది కాలంలో తొలిసారిగా…
గాడ్ ఆఫ్ వార్.. ఏడాది కిందట్నుంచి టాలీవుడ్లో విపరీతంగా చర్చనీయాంశం అవుతున్న ప్రాజెక్టు. ఇప్పటిదాకా ఎక్కువగా ఫ్యామిలీ, మాస్, యాక్షన్…