రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలవాలన్నా బీసీ సామాజికవర్గం ఓట్లే కీలకమన్న విషయం తేలిపోయింది. ఎందుకంటే అధికారంలోకి రావాలని అనుకుంటున్న కాంగ్రెస్, బీజేపీలో బీసీలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతలపై డిమాండ్లు పెరిగిపోతున్నాయి. సామాజికవర్గాల జనాభా ఆధారంగా బీసీలకు ప్రాధాన్యత దక్కాల్సిందే అని బీసీల నేతలు తీర్మానాలు కూడా చేస్తున్నారు. ఇదే సమయంలో ఇదే విషయమై బీఆర్ఎస్ లో కూడా కేసీయార్ పై ఒత్తిడి పెరిగిపోతోందని సమాచారం.
పై రెండు పార్టీలంటే ప్రతిపక్షంలో ఉన్నాయి కాబట్టి అధికారంలోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తామని హామీలిస్తాయి. కానీ బీఆర్ఎ గడచిన తొమ్మిదేళ్ళుగా అధికారంలోనే ఉన్నది. అయినా దామాషా ప్రకారం చూసుకుంటే బీసీలకు చేసింది తక్కువే. అందుకనే రాబోయే ఎన్నికల్లో ఎంపీ, ఎంఎల్ఏల టికెట్ల కేటాయింపులో బీసీలకు సరైన వాటా దక్కకపోతే కతేమిటో చూపిస్తామన్నట్లుగా బెదిరింపులు పెరిగిపోతున్నాయట. అప్పుడెప్పుడు బీసీలకు హామీ ఇచ్చినట్లుగా ఆత్మగౌరవ భవన్ల నిర్మాణాలు పూర్తేకాలేదు.
ఎంబీసీ కార్పొరేషన్ కు ఛైర్మనే లేరు. బీసీల సంక్షేమం కోసం కేటాయించిన నిధుల్లో ఖర్చయినవి చాలా తక్కువట. ఇక కేబినెట్లో బీసీ మంత్రుల సంఖ్య మూడు మాత్రమే. రెడ్లు 6 మంది వెలమలు నలుగురికి అవకాశం ఇచ్చిన కేసీయార్ బీసీల్లో మాత్రం ముగ్గురినే తీసుకున్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన ఈటెల రాజేందర్ ను అవమానించిన తీరు కేసీయార్ పై వ్యతిరేకతను పెంచిందని సమాచారం. ప్రస్తుతం బీఆర్ఎస్ కు 105 మంది ఎంఎల్ఏలుంటే అందులో బీసీల సంఖ్య 22 మాత్రమే.
అదే రెడ్డి సామాజికవర్గం నుండి 36 మందుంటే వెలమలు 10 మందున్నారు. నిజానికి వెలమల సంఖ్య చాలాచాలా తక్కువ. కాకపోతే కేసీయార్ ది అదే సామాజికవర్గం కాబట్టే అవసరానికి మించిన ప్రాధాన్యత దక్కుతోందని బీసీనేతలు మండిపోతున్నారు. గొర్లె పంపిణీ పథకం ఎక్కడికి పోయింది తెలీదు. బీసీ బంధు ఏమైందో కూడా చెప్పలేరు. బీసీలకు న్యాయపరంగా దక్కాల్సింది కూడా దక్కనీయకలేదనే మంట బీసీల్లో పెరిగిపోతోందట. అందుకనే వాస్తవాలు గ్రహించే బీసీలను మంచిచేసుకునే పనిలో కేసీయార్ ప్లాన్లు వేస్తున్నారట. మరి ఆ ప్లేన్లేమిటో ? బీసీలు ఏమిచేస్తారో చూడాలి.
తెలుగు వారి నూతన సంవత్సరాది ఉగాది మరో 20 రోజుల్లో రానుంది. ఏటా వచ్చే పండుగే కదా.. ఏముంది ?…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప.. సభకు…
ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…