ప్రస్తుత రాజకీయాలు చాలా స్పీడయిపోయాయి. ఏరోజు ఏమి జరుగుతోందో కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు. నేతలు తాము పోటీచేయబో నియోజకవర్గాలను కూడా చాలా వేగంగా మార్చేస్తున్నారు. ఇదంతా ఇపుడు ఎందుకంటే రాబోయే తెలంగాణా ఎన్నికల్లో వైఎస్ షర్మిల సికిందరాబాద్ పార్లమెంటు స్ధానానికి పోటీచేయబోతున్నారనే ప్రచారం మొదలైంది. షర్మిల ఇప్పటికే ఖమ్మం జిల్లాలోని పాలేరు నుండి అసెంబ్లీకి పోటీచేయబోతున్నట్లు చాలాసార్లు ప్రకటించారు. అయితే అదంతా ఎప్పుడంటే వైఎస్సార్టీపీ అధినేతగా ఉన్నప్పుడు.
మరిప్పుడు ఏమైంది ? ఏమైందంటే తొందరలోనే తన పార్టీని షర్మిల కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విలీనం నిజమే అయితే షర్మిల పోటీచేయబోయే నియోజకవర్గం కూడా మారిపోతుందని అంటున్నారు. పాలేరు నుండి అసెంబ్లీకి కాకుండా సికిందరాబాద్ నుండి ఎంపీగా పోటీచేయబోతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. పాలేరు నుండి పోటీచేయాలని అనుకుని అక్కడే పార్టీ ఆఫీసు కూడా నిర్మించుకుంటున్నారు. ఇపుడా నిర్మాణపనులు బాగా నెమ్మదించాయని సమాచారం.
కారణం ఏమిటంటే తాజా పరిణామాలే అని అంటున్నారు. సికిందరాబాద్ ఎంపీగా పోటీచేసే పక్షంలో పాలేరులో ఆఫీసు అవసరంలేదని షర్మిలే అనుకుంటున్నట్లు సమాచారం. ఎందుకంటే కాంగ్రెస్ కు గాంధీభవన్ ఉన్నపుడు ఇక ప్రత్యేకించి వేరే ఆఫీసు అవసరంలేదు. ఎంపీగా గెలిస్తే అప్పుడు సికిందరాబాద్ లోనే సొంతంగా తనకు ఆపీసు ఏర్పాటు చేసుకోవాల్సుంటుంది. అందుకనే పాలేరు ఆఫీసు నిర్మాణం జోరు తగ్గించారట. సికిందరాబాద్ ఎంపీగా పోటీ చేయటం కన్ఫర్మ్ అయితే వెంటనే ఇక్కడే ఒక ఆఫీసు ఏర్పాటుచేసుకోవాలి.
ఆ చేసుకునేదేదో లోటస్ పాండ్ లోనే ఉన్న ఆపీసునే వాడుకోవచ్చని కూడా అనుకుంటున్నారట. అంటే సికిందరాబాద్ ఎంపీ ఆఫీసుగానే లోటస్ పాండ్ లో ఇపుడున్న ఆఫీసును వాడుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మొత్తానికి షర్మిల తరపున సీనియర్ కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు వ్యవహారాలు నడుపుతున్నట్లు తెలుస్తోంది. మొదలగా కర్నాటక డిప్యుటీ సీఎం, పీసీసీ ప్రెసిడెంట్ డీకే శివకుమార్ మొదలుపెట్టిన విలీనం ప్రయత్నాలను ఇపుడు కేవీపీ అందుకున్నారట. మరి చివరకు ఏమి తేలుతుందో చూడాల్సిందే.
This post was last modified on July 22, 2023 11:49 am
ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రస్తుతం సీబీఐ విచారణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్ను కూడా నెల్లూరు…
డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…
వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…
హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…