తెలంగాణా బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న కిషన్ రెడ్డికి అప్పుడే చుక్కలు కనబడుతున్నాయి. ప్రమాణస్వీకారం రోజునే సీనియర్ల మధ్య విభేదాలు బయటపడ్డాయి. దాంతో ఏమి చేయలేక వేదికమీద జరుగతున్నది కిషన్ చూస్తుండిపోయారు. ఇంతకీ విషయం ఏమిటంటే వేదిక మీద మాట్లాడుతు మాజీ అద్యక్షుడు బండి సంజయ్ కొందరు నేతలపై మండిపోయారు. ఢిల్లీకి వెళ్ళి ఫిర్యాదులు చేయటం మానుకోవాలని ఎవరిపేరును ప్రస్తావించకుండానే బండి చురకలంటించారు. ఫిర్యాదుల కారణంగానే తాను అధ్యక్షుడిగా తప్పుకోవాల్సొచ్చిందన్నట్లుగా మాట్లాడారు.
కొత్తగా బాధ్యతలు తీసుకుంటున్న కిషన్ రెడ్డినయినా ప్రశాంతంగా పనిచేసుకోనీయాలని హితవుచెప్పారు. ఇక వేదికమీదే ఉన్నప్పటికీ కిషన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఎడమొహం, పెడమొహంగానే ఉండిపోయారు. వేదికమీదకు వెళ్ళిన కోమటిరెడ్డి కిషన్ రెడ్డికి రెండువైపుల కూర్చున్న నేతలకు హలో చెప్పి చేయి కలిపారుగానీ కిషన్ కు మాత్రం హలో చెప్పలేదు, చేయి కలపలేదు. తర్వాత దూరంగా వెళ్ళి ఎక్కడో కూర్చున్నారు.
అలాగే విజయశాంతి అసంతృప్తి మరోరకం. ఆమె వేదికమీదకు చేరుకుని కిషన్ రెడ్డికి అభినందనలు, శుభాకాంక్షలు చెప్పారు. వెంటనే వేదిక దిగి అక్కడినుండి వెళ్ళిపోయారు. ఇదే విషయమై మీడియాతో మాట్లాడుతు ఒకపుడు తెలంగాణాను అత్యంత తీవ్రంగా వ్యతిరేకించి, తెలంగాణా వాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని ప్రయత్నించిన వారితో వేదికను పంచుకోవటం ఇష్టంలేకే అక్కడి నుండి వెళ్ళిపోయినట్లు చెప్పారు. విజయశాంతి చేసిన వ్యాఖ్యలు మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి చేసినవే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.
ఎందుకంటే కిషన్ బాధ్యతలు తీసుకునేటపుడు వేదికమీద కిరణ్ కూడా ఉన్నారు. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే చేర్చుకున్న పార్టీ పెద్దలకు, చేరిన కిరణ్ కు లేని బాధ విజయశాంతికి ఏమిటో అర్ధంకావటంలేదు. ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తెలంగాణాను వ్యతిరేకించిన తాను ఇపుడు తెలంగాణా బీజేపీతో కలిసి ఎలా పనిచేయాలా అని ఆలోచించుకోవాల్సింది కిరణ్ మాత్రమే. అలాంటి కిరణ్ పాత విషయాలను పక్కనపెట్టేసి అన్నీ మరచిపోయినట్లుగా వ్యవహరిస్తున్నారు. మిగిలిన నేతలు కూడా కిరణ్ తో బాగానే ఉన్నారు. మధ్యలో విజయశాంతికి ఏమైందో అర్ధంకావటంలేదు.
This post was last modified on July 22, 2023 11:43 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…
ఏపీకి పొరుగునే ఉన్న తమిళనాడులో ఇప్పుడు ఇదే తరహా రాజకీయాలు కూడా కనిపిస్తున్నాయి. పార్టీలు లెక్కకు మిక్కిలిగా ఉన్నా.. నాయకులు…