Political News

కిషన్ కు అప్పుడే చుక్కలు కనబడ్డాయా ?

తెలంగాణా బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న కిషన్ రెడ్డికి అప్పుడే చుక్కలు కనబడుతున్నాయి. ప్రమాణస్వీకారం రోజునే సీనియర్ల మధ్య విభేదాలు బయటపడ్డాయి. దాంతో ఏమి చేయలేక వేదికమీద జరుగతున్నది కిషన్ చూస్తుండిపోయారు. ఇంతకీ విషయం ఏమిటంటే వేదిక మీద మాట్లాడుతు మాజీ అద్యక్షుడు బండి సంజయ్ కొందరు నేతలపై మండిపోయారు. ఢిల్లీకి వెళ్ళి ఫిర్యాదులు చేయటం మానుకోవాలని ఎవరిపేరును ప్రస్తావించకుండానే బండి చురకలంటించారు. ఫిర్యాదుల కారణంగానే తాను అధ్యక్షుడిగా తప్పుకోవాల్సొచ్చిందన్నట్లుగా మాట్లాడారు.

కొత్తగా బాధ్యతలు తీసుకుంటున్న కిషన్ రెడ్డినయినా ప్రశాంతంగా పనిచేసుకోనీయాలని హితవుచెప్పారు. ఇక వేదికమీదే ఉన్నప్పటికీ కిషన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఎడమొహం, పెడమొహంగానే ఉండిపోయారు. వేదికమీదకు వెళ్ళిన కోమటిరెడ్డి కిషన్ రెడ్డికి రెండువైపుల కూర్చున్న నేతలకు హలో చెప్పి చేయి కలిపారుగానీ కిషన్ కు మాత్రం హలో చెప్పలేదు, చేయి కలపలేదు. తర్వాత దూరంగా వెళ్ళి ఎక్కడో కూర్చున్నారు.

అలాగే విజయశాంతి అసంతృప్తి మరోరకం. ఆమె వేదికమీదకు చేరుకుని కిషన్ రెడ్డికి అభినందనలు, శుభాకాంక్షలు చెప్పారు. వెంటనే వేదిక దిగి అక్కడినుండి వెళ్ళిపోయారు. ఇదే విషయమై మీడియాతో మాట్లాడుతు ఒకపుడు తెలంగాణాను అత్యంత తీవ్రంగా వ్యతిరేకించి, తెలంగాణా వాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని ప్రయత్నించిన వారితో వేదికను పంచుకోవటం ఇష్టంలేకే అక్కడి నుండి వెళ్ళిపోయినట్లు చెప్పారు. విజయశాంతి చేసిన వ్యాఖ్యలు మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి చేసినవే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.

ఎందుకంటే కిషన్ బాధ్యతలు తీసుకునేటపుడు వేదికమీద కిరణ్ కూడా ఉన్నారు. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే చేర్చుకున్న పార్టీ పెద్దలకు, చేరిన కిరణ్ కు లేని బాధ విజయశాంతికి ఏమిటో అర్ధంకావటంలేదు. ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తెలంగాణాను వ్యతిరేకించిన తాను ఇపుడు తెలంగాణా బీజేపీతో కలిసి ఎలా పనిచేయాలా అని ఆలోచించుకోవాల్సింది కిరణ్ మాత్రమే. అలాంటి కిరణ్ పాత విషయాలను పక్కనపెట్టేసి అన్నీ మరచిపోయినట్లుగా వ్యవహరిస్తున్నారు. మిగిలిన నేతలు కూడా కిరణ్ తో బాగానే ఉన్నారు. మధ్యలో విజయశాంతికి ఏమైందో అర్ధంకావటంలేదు.

This post was last modified on July 22, 2023 11:43 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

3 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

4 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

5 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

5 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

6 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

6 hours ago