తెలంగాణా బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న కిషన్ రెడ్డికి అప్పుడే చుక్కలు కనబడుతున్నాయి. ప్రమాణస్వీకారం రోజునే సీనియర్ల మధ్య విభేదాలు బయటపడ్డాయి. దాంతో ఏమి చేయలేక వేదికమీద జరుగతున్నది కిషన్ చూస్తుండిపోయారు. ఇంతకీ విషయం ఏమిటంటే వేదిక మీద మాట్లాడుతు మాజీ అద్యక్షుడు బండి సంజయ్ కొందరు నేతలపై మండిపోయారు. ఢిల్లీకి వెళ్ళి ఫిర్యాదులు చేయటం మానుకోవాలని ఎవరిపేరును ప్రస్తావించకుండానే బండి చురకలంటించారు. ఫిర్యాదుల కారణంగానే తాను అధ్యక్షుడిగా తప్పుకోవాల్సొచ్చిందన్నట్లుగా మాట్లాడారు.
కొత్తగా బాధ్యతలు తీసుకుంటున్న కిషన్ రెడ్డినయినా ప్రశాంతంగా పనిచేసుకోనీయాలని హితవుచెప్పారు. ఇక వేదికమీదే ఉన్నప్పటికీ కిషన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఎడమొహం, పెడమొహంగానే ఉండిపోయారు. వేదికమీదకు వెళ్ళిన కోమటిరెడ్డి కిషన్ రెడ్డికి రెండువైపుల కూర్చున్న నేతలకు హలో చెప్పి చేయి కలిపారుగానీ కిషన్ కు మాత్రం హలో చెప్పలేదు, చేయి కలపలేదు. తర్వాత దూరంగా వెళ్ళి ఎక్కడో కూర్చున్నారు.
అలాగే విజయశాంతి అసంతృప్తి మరోరకం. ఆమె వేదికమీదకు చేరుకుని కిషన్ రెడ్డికి అభినందనలు, శుభాకాంక్షలు చెప్పారు. వెంటనే వేదిక దిగి అక్కడినుండి వెళ్ళిపోయారు. ఇదే విషయమై మీడియాతో మాట్లాడుతు ఒకపుడు తెలంగాణాను అత్యంత తీవ్రంగా వ్యతిరేకించి, తెలంగాణా వాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని ప్రయత్నించిన వారితో వేదికను పంచుకోవటం ఇష్టంలేకే అక్కడి నుండి వెళ్ళిపోయినట్లు చెప్పారు. విజయశాంతి చేసిన వ్యాఖ్యలు మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి చేసినవే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.
ఎందుకంటే కిషన్ బాధ్యతలు తీసుకునేటపుడు వేదికమీద కిరణ్ కూడా ఉన్నారు. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే చేర్చుకున్న పార్టీ పెద్దలకు, చేరిన కిరణ్ కు లేని బాధ విజయశాంతికి ఏమిటో అర్ధంకావటంలేదు. ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తెలంగాణాను వ్యతిరేకించిన తాను ఇపుడు తెలంగాణా బీజేపీతో కలిసి ఎలా పనిచేయాలా అని ఆలోచించుకోవాల్సింది కిరణ్ మాత్రమే. అలాంటి కిరణ్ పాత విషయాలను పక్కనపెట్టేసి అన్నీ మరచిపోయినట్లుగా వ్యవహరిస్తున్నారు. మిగిలిన నేతలు కూడా కిరణ్ తో బాగానే ఉన్నారు. మధ్యలో విజయశాంతికి ఏమైందో అర్ధంకావటంలేదు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…
జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్…
ఏపీలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందని.. మళ్లీ మళ్లీ ప్రభుత్వం మారే పరిస్థితి కూడా ఉండదని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఆ…
పెద్ది హడావిడి అయిపోతోంది. మూడో వారంలో అడుగు పెట్టబోతున్న తరుణంలో బుకింగ్స్ బానే ఉన్నాయి కానీ కలెక్షన్ల పరంగా మరీ…