Political News

పవన్ కు చంద్రబాబు బాసట

వాలంటీర్ల పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. పవన్ పై జగన్ సర్కార్ పరువు నష్టం కేసు పెట్టిన వ్యవహారంపై తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. పవన్ పై పరువు నష్టం కేసు పెట్టడం బుద్ధిమాలిన చర్య అని, నీతిమాలిన పని అని చంద్రబాబు దుయ్యబట్టారు. ప్రజలు ప్రశ్నిస్తే దాడులు, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే కేసులు అన్న రీతిలో జగన్ రాక్షస పాలన కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం జవాబుదారీగా ఉండాల్సింది పోయి అణచివేత ధోరణికి దిగడం ఏమిటని మండిపడ్డారు.

నిబంధనలకు వ్యతిరేకంగా ప్రజల వ్యక్తిగత వివరాలను వాలంటీర్లు సేకరిస్తున్నారని, దాన్ని ప్రశ్నించిన పవన్ పై కేసు ఎందుకు పెడుతున్నారని మండిపడ్డారు. ఆ సమాచారం సేకరించడమే ప్రభుత్వం చేస్తున్న తప్పు అని, దానిని దుర్వియోగం చేయడం నీచాతి నీచమని ఆగ్రహం వ్యక్తం చేశారు‌. ఒకవేళ కేసు పెట్టాల్సి వస్తే సీఎం జగన్ పైనే పెట్టాలని షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వ వ్యవస్థలను ఆయన దుర్వినియోగం చేసిన విధానంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పరువు గురించి జగన్ మాట్లాడటం జోక్ అని, నాలుగేళ్ల దిక్కుమాలిన పాలనలో రాష్ట్ర పరువు, ప్రతిష్ట ఏనాడో మంట గలిసిపోయాయని నిప్పులు చెరిగారు.

ప్రజల గొంతుకను అణిచివేయడమే లక్ష్యంగా, అరాచక ఆలోచనలు చేయడమే జగన్ పని అని అగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ప్రభుత్వానికి అప్పులు తెచ్చుకోవడంలో ఉన్న శ్రద్ధ.. రాష్ట్ర హక్కులు సాధించడంలో లేదని మండిపడ్డారు. విభజన చట్టం హామీల అమలు ద్వారా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పదేళ్ల రాష్ట్ర విభజన చట్ట కాలపరిమితి మరి కొద్ది నెలల్లో ముగుస్తున్నా జగన్ నిమ్మకునీరెత్తినట్లున్నారని దుయ్యబట్టారు. నాలుగేళ్లలో రాష్ట్రానికి కనీసం ఒక ప్రాజెక్టు గానీ, ఒక సంస్థను గానీ తీసుకొచ్చారా? అని చంద్రబాబు ప్రశ్నించారు.

This post was last modified on July 21, 2023 8:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇలాంటి సమయంలో పార్లమెంటుకు రాకపోతే ఎలా రాహుల్ జీ

కాంగ్రెస్ అగ్ర‌నేతే కాదు.. లోక్‌స‌భలో విప‌క్ష నాయ‌కుడు కూడా అయిన రాహుల్‌గాంధీ.. త‌ర‌చుగా త‌ప్పులు చేస్తూనే ఉన్నారు. అయితే.. ఎప్ప‌టిక‌ప్పుడు…

5 minutes ago

ఇడియట్స్ జోలికి ఇప్పుడెందుకు వెళ్లడం

2009లో విడుదలైన బాలీవుడ్ మూవీ 3 ఇడియట్స్ ఒక సంచలనం. అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోని కాలేజీ స్టూడెంట్…

34 minutes ago

`స‌నాత‌న ధ‌ర్మం` స్టాండ్.. సాయిరెడ్డిని ర‌క్షిస్తుందా.. ?

వైసీపీ మాజీ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి మళ్ళీ రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల…

2 hours ago

సినిమా నచ్చకపోతే బాలేదని నలుగురికి చెప్పండి

ఈ రోజుల్లో రీమేక్ సినిమా చేయ‌డం అన్న‌ది పెద్ద రిస్క్‌గా మారిపోయిన మాట వాస్త‌వం. ఇంట‌ర్నెట్, ఓటీటీల విప్ల‌వం వ‌ల్ల…

5 hours ago

‘ఫస్ట్ టైమ్’ ఎంపీకి ‘ఫస్ట్ ర్యాంక్’ ఎలా వచ్చింది?

టీడీపీ ఎంపీ, గుంటూరు పార్లమెంటు సభ్యుడు, కేంద్ర మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్‌, తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో రాష్ట్రంలోని 25…

5 hours ago

శుభవార్త చెప్పబోతున్న అఖండ 2 ?

గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…

8 hours ago