Political News

పవన్ కు చంద్రబాబు బాసట

వాలంటీర్ల పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. పవన్ పై జగన్ సర్కార్ పరువు నష్టం కేసు పెట్టిన వ్యవహారంపై తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. పవన్ పై పరువు నష్టం కేసు పెట్టడం బుద్ధిమాలిన చర్య అని, నీతిమాలిన పని అని చంద్రబాబు దుయ్యబట్టారు. ప్రజలు ప్రశ్నిస్తే దాడులు, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే కేసులు అన్న రీతిలో జగన్ రాక్షస పాలన కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం జవాబుదారీగా ఉండాల్సింది పోయి అణచివేత ధోరణికి దిగడం ఏమిటని మండిపడ్డారు.

నిబంధనలకు వ్యతిరేకంగా ప్రజల వ్యక్తిగత వివరాలను వాలంటీర్లు సేకరిస్తున్నారని, దాన్ని ప్రశ్నించిన పవన్ పై కేసు ఎందుకు పెడుతున్నారని మండిపడ్డారు. ఆ సమాచారం సేకరించడమే ప్రభుత్వం చేస్తున్న తప్పు అని, దానిని దుర్వియోగం చేయడం నీచాతి నీచమని ఆగ్రహం వ్యక్తం చేశారు‌. ఒకవేళ కేసు పెట్టాల్సి వస్తే సీఎం జగన్ పైనే పెట్టాలని షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వ వ్యవస్థలను ఆయన దుర్వినియోగం చేసిన విధానంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పరువు గురించి జగన్ మాట్లాడటం జోక్ అని, నాలుగేళ్ల దిక్కుమాలిన పాలనలో రాష్ట్ర పరువు, ప్రతిష్ట ఏనాడో మంట గలిసిపోయాయని నిప్పులు చెరిగారు.

ప్రజల గొంతుకను అణిచివేయడమే లక్ష్యంగా, అరాచక ఆలోచనలు చేయడమే జగన్ పని అని అగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ప్రభుత్వానికి అప్పులు తెచ్చుకోవడంలో ఉన్న శ్రద్ధ.. రాష్ట్ర హక్కులు సాధించడంలో లేదని మండిపడ్డారు. విభజన చట్టం హామీల అమలు ద్వారా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పదేళ్ల రాష్ట్ర విభజన చట్ట కాలపరిమితి మరి కొద్ది నెలల్లో ముగుస్తున్నా జగన్ నిమ్మకునీరెత్తినట్లున్నారని దుయ్యబట్టారు. నాలుగేళ్లలో రాష్ట్రానికి కనీసం ఒక ప్రాజెక్టు గానీ, ఒక సంస్థను గానీ తీసుకొచ్చారా? అని చంద్రబాబు ప్రశ్నించారు.

This post was last modified on July 21, 2023 8:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

3 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

4 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

5 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

5 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

6 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

6 hours ago