Political News

బండి సంజయ్ కోసం బాత్రూంలో ఏడ్చారట

తెలగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ను తొలగించి ఆ స్థానంలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డిని బీజేపీ అధిష్టానం నియమించిన సంగతి తెలిసిందే. బండి సంజయ్ కు కేంద్ర స్థాయిలో పదవి ఇస్తారని టాక్ వచ్చింది. అయితే, ఆ పదవి పై బండి సంజయ్ కు ఆసక్తి లేదని, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగానే కొనసాగాలని ఆయనకు ఉందని ప్రచారం జరిగింది. రాబోయే ఎన్నికల్లో బీజేపీని రాష్ట్రంలో గెలిపించుకొని సీఎం అవుదామని ఆయన ఆశపడ్డారని, ఆయన అనుచరులు కూడా సీఎం సీఎం అంటూ బండి సంజయ్ సమక్షంలో నినాదాలు చేశారని టాక్ వచ్చింది.

బండి సంజయ్ ను తొలగించడంతో ఆయన అభిమానులు, అనుచరులు తీవ్ర ఆవేదనకు గురైన సంగతి తెలిసిందే. అయితే, బండి సంజయ్ తొలగింపు ఆయన అనుచరులకే కాదు…మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి కూడా తీవ్ర భావోద్వేగాన్ని మిగిల్చిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజాగా కిషన్‌ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఈ విషయాన్ని రాజగోపాల్ రెడ్డి స్వయంగా వెల్లడించడం విశేషం. రాజ గోపాల్‌ రెడ్డి చేసిన కామెంట్లు బీజేపీ నేతలను ఆశ్చర్యంలో ముంచెత్తాయి.

సంజయ్‌ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించినపుడు తనకు కన్నీళ్లు వచ్చాయని, ఆ టైంలో బాత్రూంకి వెళ్లి ఏడ్చానని రాజగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజీలేని పోరాటంతో పార్టీకి సంజయ్ కొత్త ఊపు తెచ్చారని కొనియాడారు. అందుకే, ఆయన తొలగింపు తనకు బాధ కలిగించిందని అన్నారు. కానీ, బీజేపీ అధిష్టానం నిర్ణయానికి అంతా కట్టుబడి ఉండాలన్నారు. అయితే, మొన్న మొన్ననే బీజేపీలో చేరిన రాజగోపాల్ రెడ్డి…బండి సంజయ్ పై ఇంత ప్రేమ చూపించడం పలువురుని ఆశ్చర్యానికి గురి చేసింది.

This post was last modified on July 21, 2023 6:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈసారి ఉగాది పండగ మాత్రమే కాదు

తెలుగు వారి నూత‌న సంవ‌త్స‌రాది ఉగాది మ‌రో 20 రోజుల్లో రానుంది. ఏటా వ‌చ్చే పండుగే క‌దా.. ఏముంది ?…

3 hours ago

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

6 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

6 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

8 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

8 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

9 hours ago