Political News

బండి సంజయ్ కోసం బాత్రూంలో ఏడ్చారట

తెలగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ను తొలగించి ఆ స్థానంలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డిని బీజేపీ అధిష్టానం నియమించిన సంగతి తెలిసిందే. బండి సంజయ్ కు కేంద్ర స్థాయిలో పదవి ఇస్తారని టాక్ వచ్చింది. అయితే, ఆ పదవి పై బండి సంజయ్ కు ఆసక్తి లేదని, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగానే కొనసాగాలని ఆయనకు ఉందని ప్రచారం జరిగింది. రాబోయే ఎన్నికల్లో బీజేపీని రాష్ట్రంలో గెలిపించుకొని సీఎం అవుదామని ఆయన ఆశపడ్డారని, ఆయన అనుచరులు కూడా సీఎం సీఎం అంటూ బండి సంజయ్ సమక్షంలో నినాదాలు చేశారని టాక్ వచ్చింది.

బండి సంజయ్ ను తొలగించడంతో ఆయన అభిమానులు, అనుచరులు తీవ్ర ఆవేదనకు గురైన సంగతి తెలిసిందే. అయితే, బండి సంజయ్ తొలగింపు ఆయన అనుచరులకే కాదు…మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి కూడా తీవ్ర భావోద్వేగాన్ని మిగిల్చిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజాగా కిషన్‌ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఈ విషయాన్ని రాజగోపాల్ రెడ్డి స్వయంగా వెల్లడించడం విశేషం. రాజ గోపాల్‌ రెడ్డి చేసిన కామెంట్లు బీజేపీ నేతలను ఆశ్చర్యంలో ముంచెత్తాయి.

సంజయ్‌ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించినపుడు తనకు కన్నీళ్లు వచ్చాయని, ఆ టైంలో బాత్రూంకి వెళ్లి ఏడ్చానని రాజగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజీలేని పోరాటంతో పార్టీకి సంజయ్ కొత్త ఊపు తెచ్చారని కొనియాడారు. అందుకే, ఆయన తొలగింపు తనకు బాధ కలిగించిందని అన్నారు. కానీ, బీజేపీ అధిష్టానం నిర్ణయానికి అంతా కట్టుబడి ఉండాలన్నారు. అయితే, మొన్న మొన్ననే బీజేపీలో చేరిన రాజగోపాల్ రెడ్డి…బండి సంజయ్ పై ఇంత ప్రేమ చూపించడం పలువురుని ఆశ్చర్యానికి గురి చేసింది.

This post was last modified on July 21, 2023 6:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చైనాలోని ఆ రాష్ట్రమే తెలంగాణ అభివృద్ధికి స్పూర్తి

తెలంగాణ రాష్ట్రాన్ని వ‌చ్చే 2047 నాటికి 3(30 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు) ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా రూపొందించ‌డ‌మే ల‌క్ష్యంగా…

20 minutes ago

ఇలాంటి సమయంలో పార్లమెంటుకు రాకపోతే ఎలా రాహుల్ జీ

కాంగ్రెస్ అగ్ర‌నేతే కాదు.. లోక్‌స‌భలో విప‌క్ష నాయ‌కుడు కూడా అయిన రాహుల్‌గాంధీ.. త‌ర‌చుగా త‌ప్పులు చేస్తూనే ఉన్నారు. అయితే.. ఎప్ప‌టిక‌ప్పుడు…

1 hour ago

ఇడియట్స్ జోలికి ఇప్పుడెందుకు వెళ్లడం

2009లో విడుదలైన బాలీవుడ్ మూవీ 3 ఇడియట్స్ ఒక సంచలనం. అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోని కాలేజీ స్టూడెంట్…

2 hours ago

`స‌నాత‌న ధ‌ర్మం` స్టాండ్.. సాయిరెడ్డిని ర‌క్షిస్తుందా.. ?

వైసీపీ మాజీ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి మళ్ళీ రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల…

3 hours ago

సినిమా నచ్చకపోతే బాలేదని నలుగురికి చెప్పండి

ఈ రోజుల్లో రీమేక్ సినిమా చేయ‌డం అన్న‌ది పెద్ద రిస్క్‌గా మారిపోయిన మాట వాస్త‌వం. ఇంట‌ర్నెట్, ఓటీటీల విప్ల‌వం వ‌ల్ల…

6 hours ago

‘ఫస్ట్ టైమ్’ ఎంపీకి ‘ఫస్ట్ ర్యాంక్’ ఎలా వచ్చింది?

టీడీపీ ఎంపీ, గుంటూరు పార్లమెంటు సభ్యుడు, కేంద్ర మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్‌, తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో రాష్ట్రంలోని 25…

7 hours ago