“ఔను.. వారిదే సూత్రం.. వారిదే పాత్ర.. ఈ విషయంలో తేడాలేదు” అని ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి తాజాగా సీబీఐ సమర్పించిన చార్జిషీట్లో కుండబద్దలు కొట్టింది. ఆ వారే.. సీఎం జగన్ పదే పదే తన తమ్ముడు అని సంబోధించే కడప ఎంపీ అవినాష్రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కరరెడ్డి. వీరిద్దరేఅసలు సూత్రధారులు, పాత్ర ధారులు అని సీబీఐ మరోసారి స్పష్టం చేసింది.
ఇప్పటి వరకు పిటిషన్కే పరిమితమైన ఈ విషయం.. కోర్టు కీలకంగా పరిగణనలోకి తీసుకునే చార్జిషీటులో నూ వారిపైనే అభియోగాలు నమోదు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ చార్జిషీటును తాజాగా సీబీఐ కోర్టుకు ఆ సంస్థ తరఫు న్యాయవాదులు సమర్పించారు. ఈ చార్జిషీట్లో మరిన్ని కీలక విషయాలు కూడా వెల్లడించారు. హత్యకు సంబంధించిన కుట్ర, రక్తపు మరకల సాక్ష్యాలు చెరిపేలా చేయడం, హత్య జరిగిన తర్వాత.. దానిని గుండెపోటుగా అభివర్ణించడం.. ఇతర సాక్ష్యాలను కూడా ప్రభావితం చేయడం వంటివాటిని కూడా సీబీఐ పేర్కొంది.
ఈ దారుణ హత్య కేసుపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ తన చార్జి షీటులో పేర్కొంది. దివంగత వైఎస్ వివేకానందరెడ్డి వ్యక్తిగత కార్యదర్శి కృష్ణారెడ్డిపైనా సీబీఐ అనుమానాలు వ్యక్తం చేసింది. అయితే.. ఆయనకు సంబంధించి ఇంకా ఆధారాలు లభించాల్సి ఉందని తెలిపింది. రక్తపు మరకలను ఎలా చెరిపేయాలో.. ఏయే రసాయనాలు వాడాలో డాక్టర్ వైఎస్ మనోహర్ రెడ్డి ఆ సమయంలో వివరించారని.. అయితే.. దీనికి సంబంధించి కూడా సాక్ష్యాలను సేకరించాల్సి ఉందని తెలిపింది.
హత్య జరిగిన ఇంట్లో వైఫై రూటర్లకు కనెక్టయిన వారి వివరాలు సేకరిస్తున్నామని తెలిపింది. వైఫై రూటర్ల వివరాల కోసం అమెరికా అధికారులకు కోరినట్టు సీబీఐ ఇచ్చిన చార్జిషీట్లో స్పష్టం చేసింది. అదేవిధంగా హత్యకు కొన్ని నిముషాల ముందు రాసిన లేఖను నిన్ హైడ్రిన్ పరీక్షకు పంపించామని.. అదేవిధంగా మొబైల్ ఫోన్లను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించామని.. ఆయా నివేదికలు ఇంకా రాలేదని తెలిపింది.
This post was last modified on July 21, 2023 2:49 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…