“ఔను.. వారిదే సూత్రం.. వారిదే పాత్ర.. ఈ విషయంలో తేడాలేదు” అని ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి తాజాగా సీబీఐ సమర్పించిన చార్జిషీట్లో కుండబద్దలు కొట్టింది. ఆ వారే.. సీఎం జగన్ పదే పదే తన తమ్ముడు అని సంబోధించే కడప ఎంపీ అవినాష్రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కరరెడ్డి. వీరిద్దరేఅసలు సూత్రధారులు, పాత్ర ధారులు అని సీబీఐ మరోసారి స్పష్టం చేసింది.
ఇప్పటి వరకు పిటిషన్కే పరిమితమైన ఈ విషయం.. కోర్టు కీలకంగా పరిగణనలోకి తీసుకునే చార్జిషీటులో నూ వారిపైనే అభియోగాలు నమోదు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ చార్జిషీటును తాజాగా సీబీఐ కోర్టుకు ఆ సంస్థ తరఫు న్యాయవాదులు సమర్పించారు. ఈ చార్జిషీట్లో మరిన్ని కీలక విషయాలు కూడా వెల్లడించారు. హత్యకు సంబంధించిన కుట్ర, రక్తపు మరకల సాక్ష్యాలు చెరిపేలా చేయడం, హత్య జరిగిన తర్వాత.. దానిని గుండెపోటుగా అభివర్ణించడం.. ఇతర సాక్ష్యాలను కూడా ప్రభావితం చేయడం వంటివాటిని కూడా సీబీఐ పేర్కొంది.
ఈ దారుణ హత్య కేసుపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ తన చార్జి షీటులో పేర్కొంది. దివంగత వైఎస్ వివేకానందరెడ్డి వ్యక్తిగత కార్యదర్శి కృష్ణారెడ్డిపైనా సీబీఐ అనుమానాలు వ్యక్తం చేసింది. అయితే.. ఆయనకు సంబంధించి ఇంకా ఆధారాలు లభించాల్సి ఉందని తెలిపింది. రక్తపు మరకలను ఎలా చెరిపేయాలో.. ఏయే రసాయనాలు వాడాలో డాక్టర్ వైఎస్ మనోహర్ రెడ్డి ఆ సమయంలో వివరించారని.. అయితే.. దీనికి సంబంధించి కూడా సాక్ష్యాలను సేకరించాల్సి ఉందని తెలిపింది.
హత్య జరిగిన ఇంట్లో వైఫై రూటర్లకు కనెక్టయిన వారి వివరాలు సేకరిస్తున్నామని తెలిపింది. వైఫై రూటర్ల వివరాల కోసం అమెరికా అధికారులకు కోరినట్టు సీబీఐ ఇచ్చిన చార్జిషీట్లో స్పష్టం చేసింది. అదేవిధంగా హత్యకు కొన్ని నిముషాల ముందు రాసిన లేఖను నిన్ హైడ్రిన్ పరీక్షకు పంపించామని.. అదేవిధంగా మొబైల్ ఫోన్లను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించామని.. ఆయా నివేదికలు ఇంకా రాలేదని తెలిపింది.
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…
మళ్ళీ ఓజి 2 హాట్ టాపిక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుంచి పవన్, దర్శకుడు సుజిత్…
హీరోల స్టార్ పవర్ పెద్దగా పని చేయట్లేదు ఈ రోజుల్లో. కంటెంట్ను బట్టే సినిమాలు చూస్తున్నారు. స్టార్లను చూసి ఎగబడి…
టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…
బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీశారు. ఆస్కార్ వేదిక మీద తన బృందానికి అవార్డు వచ్చేలా చేశారు. వారణాసిని ఇంటర్నేషనల్…
టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడు…