Political News

పవన్ పై కోర్టుకు ఏపీ ప్రభుత్వం

ఏపీలో వాలంటీర్ల పై, వాలంటీర్ల వ్యవస్థ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ప్రజల సున్నితమైన డేటాను వాలంటీర్లు సేకరించి ప్రైవేటు వ్యక్తులకు చేరవేస్తున్నారని, ఏపీలో వాలంటీర్లు సేకరించిన డేటా హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడాలో ఉందని పవన్ ఆరోపించడం కలకలం రేపింది. ఆ డేటానుపయోగించి హ్యూమన్ ట్రాఫికింగ్, ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతోందని పవన్ చేసిన వ్యాఖ్యలు షాకింగ్ గా మారాయి. ఈ క్రమంలోనే పవన్ పై వైసీపీ నేతలు కూడా ప్రతి విమర్శలు గుప్పించారు.

ఈ నేపథ్యంలోనే పవన్ వ్యాఖ్యలపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. వాలంటీర్లను అవమానిస్తూ పవన్ చేసిన వ్యాఖ్యలపై కోర్టుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ పరువుకు పవన్ వ్యాఖ్యలు భంగం కలిగించేలా ఉన్నాయని వాలంటీర్లు భావిస్తున్నారని ప్రభుత్వం చెబుతోంది. అంతేకాదు, వాలంటీర్లపై పవన్ దురుద్దేశ్యపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేశారరని, వాలంటీర్లలో మహిళలను కించపరిచేలా పవన్ మాట్లాడారని ఆరోపిస్తోంది.

మరోవైపు, వాలంటీర్లపై మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న సురక్ష కార్యక్రమానికి హాజరుకాని వాలంటీర్లపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. తనతోపాటు, పార్టీ శ్రేణులు, అధికారులు హాజరైనపుడు వాలంటీర్లు రాకపోవడం ఏంటని ధర్మాన మండిపడ్డారు. పని చేయడం ఇష్టం లేని, ఆసక్తి లేని వాలంటీర్లు తమకు వద్దని, వారు స్వచ్ఛందంగా తొలగిపోవచ్చని చెప్పారు. సమావేశానికి గైర్హాజరైన వాలంటీర్లను తక్షణమే తొలగించాలని ఆదేశించారు.

This post was last modified on July 20, 2023 8:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago