Political News

మ‌చిలీప‌ట్నం పాలిటిక్స్ మారుతున్నాయ్‌.. పేర్నికి క‌ష్టాలేనా?

ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం మ‌చిలీప‌ట్నం. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి వైసీపీ త‌ర‌ఫున పేర్ని నాని గెలుపు గుర్రం ఎక్కారు. త‌ర్వాత ఆయ‌న సీఎం జ‌గ‌న్ కేబినెట్‌లో మంత్రిగా కూడా ప‌నిచేశారు. అయితే.. గ‌త ఏడాది రెండో సారి మంత్రివ‌ర్గాన్ని విస్త‌రించిన‌ప్పుడు.. పేర్నిని త‌ప్పించారు. ఇక‌, ఇప్పుడు పేర్ని కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న కుమారుడు పేర్ని కృష్ణ‌మూర్తి(కిట్టు)కి టికెట్ ఇవ్వాల‌ని కోరుతున్నారు. ఇదిలావుంటే.. మ‌రోవైపు.. ప్ర‌తిప‌క్షాలు పుంజుకుంటున్నాయి.

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర 2014లో ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పేర్నిపై ఓడిపోయినా పార్టీ త‌ర‌ఫున బ‌ల‌మైన గ‌ళం వినిపిస్తున్నారు. మ‌ధ్య‌లో ఆయ‌న‌ను కూడా ఓ కేసులో పోలీసులు అరెస్టుచేశారు. అయినా.. ఎడ‌తెగ‌కుండా టీడీపీ వాయిస్ వినిపిస్తున్నారు. దీంతో టీడీపీ ఇక్క‌డ బ‌లం కోల్పోలేద‌నే వాద‌న వినిపిస్తోంది. మ‌రో వైపు స్థానికంగా బ‌ల‌మైన సామాజిక వ‌ర్గంగా ఉన్న కాపులు .. గ‌త ఎన్నిక‌ల్లో పేర్ని నానికి మ‌ద్దుతుగా నిలిచారు. అయితే.. ఈ సారి మాత్రం వారి ఊపు.. చూపు.. కూడా మారుతున్న సంకేతాలు వ‌స్తున్నాయి.

తాజాగా.. జనసేన తీర్థం పుచ్చుకునేందుకు మ‌చిలీప‌ట్నం కాపు నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే రాధారంగా మిత్రమం డలి నాయకులు బుల్లెట్ ధర్మారావు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. అదే బాటలో మరోనేత‌, కాపు సామాజిక వర్గంలో బలమై న నేత బిజెపి నుండి జనసేన పార్టీలో చేరేందుకు సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్టు తెలిసింది. దీంతో ఆయ‌నకు కూడా ప‌వ‌న్ ఢిల్లీ నుంచి రాగానే గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తార‌ని జ‌న‌సేన నాయ‌కులు చెబుతున్నారు.

ఒక‌వైపు టిడిపిలో బీసీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పుంజుకుంటుండ‌డం, మ‌రోవైపు.. కాపు నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు జ‌న‌సేన వైపు చూస్తుండ‌డం, బల‌మైన నాయ‌కులు ప‌వ‌న్‌కు జై కొడుతుండ‌డంతో మ‌చిలీప‌ట్నం రాజ‌కీయంలో స్ప‌ష్ట‌మైన మార్పులు క‌నిపిస్తున్నాయి. ఈ ప‌రిణామం మాజీ మంత్రి ఫైర్ బ్రాండ్ పేర్ని నానికి సెగ పుట్టిస్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి దీనిని ఆయ‌న ఏవిధంగా ఎదుర్కొంటారో చూడాలి.

This post was last modified on July 20, 2023 11:10 am

Share
Show comments

Recent Posts

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

7 minutes ago

ప్రేక్షకులు మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

2 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

2 hours ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

3 hours ago

కూట‌మికి `బ్ర‌హ్మాస్త్రం` ఇచ్చేసిన‌ ప‌య్యావుల ..!

కూట‌మి నాయ‌కుల‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క రాజ‌కీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం`` అంటూ..…

4 hours ago

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కౌంట్ డౌన్?

వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…

6 hours ago