Political News

రాజాం ర‌చ్చ‌పై చంద్ర‌బాబు క్లారిటీ.. ప్ర‌తిభ వార‌సురాలికి షాక్‌…!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకోవ‌డ‌మే ధ్యేయంగా అడుగులు వేస్తున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు.. ఆదిశ‌గా క‌స‌ర‌త్తును ముమ్మ‌రం చేశారు. బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాల‌ను, కంచుకోట‌ల‌ను ఎట్టి ప‌రిస్తితిలోనూ వ‌దులుకోకూడ‌దే నిర్ణ‌యానికి ఆయ‌న వ‌చ్చారు. ఈ విష‌యంలో ఆయ‌న ఒకింత క‌ఠినంగానే వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని చెప్పాలి. తాజాగా ఉమ్మ‌డి శ్రీకాకుళం జిల్లాలోని రాజాం ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గానికి దాదాపు టికెట్ క‌న్ఫ‌ర్మ్ చేసేశారు. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మాజీ మంత్రి కోండ్రు ముర‌ళి ఇంచార్జిగా ఉన్నారు.

అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాజాం టికెట్‌ను త‌మ‌కు కేటాయించాల‌ని మాజీ స్పీక‌ర్ ప్ర‌తిభా భార‌తి కుమార్తె కావ‌లి గ్రీష్మ కోరుతు న్నారు. ప‌లు సంద‌ర్భాల్లో పార్టీ త‌ర‌ఫున బ‌ల‌మైన గ‌ళం కూడా వినిపిస్తున్నారు. మ‌హానాడు (ఒంగోలులో)లో కూడా తొడ‌గొట్టి మ‌రీ వైసీపీ నేత‌ల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. సుదీర్ఘ రాజ‌కీయ‌చ‌రిత్ర ఉన్న కుటుంబం కావ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు త‌థ్య‌మ‌ని గ్రీష్మ భావించారు. దీనిపై అనేక సార్లు చంద్ర‌బాబుతోనూ ఆమె భేటీ అయి విష‌యం చెప్పారు. ఇక‌, తాజాగా ఈ విష‌యంలో చంద్ర‌బాబు కొంత క‌ఠిన నిర్ణ‌య‌మే తీసుకోవాల్సి వ‌చ్చింది.

ప్ర‌స్తుతం మ‌నం రాక్ష‌సుల‌తో పోరాటం చేయాల్సి వ‌చ్చింది. అందుకే నువ్వేమీ అనుకోకు అని గ్రీష్మ‌కు న‌చ్చజెప్పిన‌ట్టు ఎన్టీఆర్ భ‌వ‌న్ వ‌ర్గాలుచెబుతున్నాయి. ఇక‌, ఈ రాజాం టికెట్‌ను దాదాపు కోండ్రు ముర‌ళికే చంద్ర‌బాబు ఖ‌రారు చేశారు. అయితే.. ఆయ‌న‌ను కూడా చంద్ర‌బాబు హెచ్చ‌రించారు. అంద‌రినీ క‌లుపుకొని పోవాల‌ని.. అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని చంద్ర‌బాబు ఒకింత గ‌ట్టిగానే సూచించిన‌ట్టు స‌మాచారం. అంతేకాదు.. ప్ర‌తిభా భార‌తి, క‌ళా వెంక‌ట్రావు వ‌ర్గాల‌ను కూడా ఒకే వేదిక‌పైకి తెచ్చేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నించారు.

మీలో మీరు గొడ‌వ‌లు ప‌డితే.. పార్టీ ప‌రిస్థితి ఏంటి? పోనీ.. వేరే వేదిక‌లుఏమైనా ఉన్నాయా? అని ప్ర‌శ్నించిన‌ట్టు స‌మాచారం. దీనికి వారు మౌనంగా ఉన్నార‌ని.. దీంతో చంద్ర‌బాబు కొన్ని కొన్ని చిన్న చిన్న స‌మ‌స్య‌లు ఎప్పుడూ ఉంటాయ‌ని.. కుటుంబం లోనే గొడ‌వ‌లు ఉన్న‌ప్పుడు అతి పెద్ద‌పార్టీలో గొడ‌వ‌లు ఉండ‌కుండా ఉండ‌వ‌ని.. అన్నీ త‌న‌కు తెలుసున‌ని.. స‌ర్దుకుపోయి.. క‌లిసి మెలిసిపార్టీని గెలిపించ‌డ‌మే ధ్యేయంగా ప‌నిచేయాల‌ని సూచించిన‌ట్టు స‌మాచారం. మొత్తానికి రాజాం నియోజ‌క‌వ‌ర్గంలో నెల‌కొన్న ర‌చ్చ‌కు దాదాపు చంద్ర‌బాబు చెక్ పెట్టిన‌ట్టేన‌ని అంటున్నారు టీడీపీ సీనియ‌ర్లు.

This post was last modified on July 19, 2023 8:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రొడ్యూసర్ల కోసం పవన్ త్యాగం

రెమ్యునేషన్లు పూర్తిగా చేతికి అందకుంటే డబ్బింగ్ చెప్పకుండా ఇబ్బంది పెట్టే స్టార్ హీరోలు ఇండస్ట్రీలో లేకపోలేదు. అందుకే బిజినెస్ జరిగినా…

7 minutes ago

క్షమాపణలు చెప్పిన నాయుడు గారి అబ్బాయి

తమిళంలో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా పార్తీబన్‌కు గొప్ప పేరే ఉంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన సినీ ప్రయాణం కొనసాగుతోంది.…

3 hours ago

తెలుగు అభిమానులకు దురంధర్ స్ట్రోక్

భయపడినట్టే జరిగింది. దురంధర్ ది రివెంజ్ తెలుగు ప్రీమియర్లు క్యాన్సిలయ్యాయని ట్రేడ్ టాక్. పివిఆర్ ఐనాక్స్ లాంటి మల్టీప్లెక్సులు ఇప్పటికే…

4 hours ago

ట్రెండింగ్ మొదలుపెట్టిన భగత్ సింగ్

ఓజితో పోలిస్తే ఆ స్థాయిలో బజ్ లేదు. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్…

6 hours ago

దురంధర్ 2 ప్రీమియర్లు…..వాటి మీదే అందరి కళ్ళు

మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…

6 hours ago

బీఆర్ఎస్ టాక్‌: రోహిత్‌రెడ్డిపై ఇంత‌క‌న్నా చేయ‌లేం

'మొయినాబాద్ డ్ర‌గ్స్ పార్టీ' కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత‌, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్‌రెడ్డి విష‌యం మాజీ…

6 hours ago