Political News

రాజాం ర‌చ్చ‌పై చంద్ర‌బాబు క్లారిటీ.. ప్ర‌తిభ వార‌సురాలికి షాక్‌…!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకోవ‌డ‌మే ధ్యేయంగా అడుగులు వేస్తున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు.. ఆదిశ‌గా క‌స‌ర‌త్తును ముమ్మ‌రం చేశారు. బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాల‌ను, కంచుకోట‌ల‌ను ఎట్టి ప‌రిస్తితిలోనూ వ‌దులుకోకూడ‌దే నిర్ణ‌యానికి ఆయ‌న వ‌చ్చారు. ఈ విష‌యంలో ఆయ‌న ఒకింత క‌ఠినంగానే వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని చెప్పాలి. తాజాగా ఉమ్మ‌డి శ్రీకాకుళం జిల్లాలోని రాజాం ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గానికి దాదాపు టికెట్ క‌న్ఫ‌ర్మ్ చేసేశారు. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మాజీ మంత్రి కోండ్రు ముర‌ళి ఇంచార్జిగా ఉన్నారు.

అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాజాం టికెట్‌ను త‌మ‌కు కేటాయించాల‌ని మాజీ స్పీక‌ర్ ప్ర‌తిభా భార‌తి కుమార్తె కావ‌లి గ్రీష్మ కోరుతు న్నారు. ప‌లు సంద‌ర్భాల్లో పార్టీ త‌ర‌ఫున బ‌ల‌మైన గ‌ళం కూడా వినిపిస్తున్నారు. మ‌హానాడు (ఒంగోలులో)లో కూడా తొడ‌గొట్టి మ‌రీ వైసీపీ నేత‌ల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. సుదీర్ఘ రాజ‌కీయ‌చ‌రిత్ర ఉన్న కుటుంబం కావ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు త‌థ్య‌మ‌ని గ్రీష్మ భావించారు. దీనిపై అనేక సార్లు చంద్ర‌బాబుతోనూ ఆమె భేటీ అయి విష‌యం చెప్పారు. ఇక‌, తాజాగా ఈ విష‌యంలో చంద్ర‌బాబు కొంత క‌ఠిన నిర్ణ‌య‌మే తీసుకోవాల్సి వ‌చ్చింది.

ప్ర‌స్తుతం మ‌నం రాక్ష‌సుల‌తో పోరాటం చేయాల్సి వ‌చ్చింది. అందుకే నువ్వేమీ అనుకోకు అని గ్రీష్మ‌కు న‌చ్చజెప్పిన‌ట్టు ఎన్టీఆర్ భ‌వ‌న్ వ‌ర్గాలుచెబుతున్నాయి. ఇక‌, ఈ రాజాం టికెట్‌ను దాదాపు కోండ్రు ముర‌ళికే చంద్ర‌బాబు ఖ‌రారు చేశారు. అయితే.. ఆయ‌న‌ను కూడా చంద్ర‌బాబు హెచ్చ‌రించారు. అంద‌రినీ క‌లుపుకొని పోవాల‌ని.. అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని చంద్ర‌బాబు ఒకింత గ‌ట్టిగానే సూచించిన‌ట్టు స‌మాచారం. అంతేకాదు.. ప్ర‌తిభా భార‌తి, క‌ళా వెంక‌ట్రావు వ‌ర్గాల‌ను కూడా ఒకే వేదిక‌పైకి తెచ్చేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నించారు.

మీలో మీరు గొడ‌వ‌లు ప‌డితే.. పార్టీ ప‌రిస్థితి ఏంటి? పోనీ.. వేరే వేదిక‌లుఏమైనా ఉన్నాయా? అని ప్ర‌శ్నించిన‌ట్టు స‌మాచారం. దీనికి వారు మౌనంగా ఉన్నార‌ని.. దీంతో చంద్ర‌బాబు కొన్ని కొన్ని చిన్న చిన్న స‌మ‌స్య‌లు ఎప్పుడూ ఉంటాయ‌ని.. కుటుంబం లోనే గొడ‌వ‌లు ఉన్న‌ప్పుడు అతి పెద్ద‌పార్టీలో గొడ‌వ‌లు ఉండ‌కుండా ఉండ‌వ‌ని.. అన్నీ త‌న‌కు తెలుసున‌ని.. స‌ర్దుకుపోయి.. క‌లిసి మెలిసిపార్టీని గెలిపించ‌డ‌మే ధ్యేయంగా ప‌నిచేయాల‌ని సూచించిన‌ట్టు స‌మాచారం. మొత్తానికి రాజాం నియోజ‌క‌వ‌ర్గంలో నెల‌కొన్న ర‌చ్చ‌కు దాదాపు చంద్ర‌బాబు చెక్ పెట్టిన‌ట్టేన‌ని అంటున్నారు టీడీపీ సీనియ‌ర్లు.

This post was last modified on July 19, 2023 8:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

క్లాస్ రవితేజకు మాస్ చిరు ఛాలెంజ్

సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…

38 minutes ago

అనిల్ రావిపూడి కారు సమర్పించుకోవాల్సిందే..

నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…

2 hours ago

‘పోలవరం పూర్తయితే ఏపీతో ఎవరూ పోటీ పడలేరు’

పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…

3 hours ago

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

3 hours ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

8 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

8 hours ago