జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేనలు కలిసి పోటీ చేస్తాయని పవన్ ఆశాభావం వ్యక్తం చేసిన వైనం ఏపీ రాజకీయాలలో సంచలనం రేపింది. ఇక, జగన్ సర్కార్ వైఫల్యాలను జాతీయ స్థాయిలో పవన్ ఎండగట్టిన తీరు కూడా వైసీపీ నేతలకు షాకిచ్చింది. మరోవైపు, ఎన్డీఏ కూటమిలోకి దారులు మూసుకుపోయాయనుకుంటున్న టీడీపీకి పవన్ రూపంలో ఆశలు చిగురించాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జ్ మురళీధరన్తో పవన్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నాదెండ్ల మనోహర్ తో కలిసి మురళీధరన్ తో పవన్ దాదాపు 15 నిమిషాలపాటు సమావేశమయ్యారు. మురళీధరన్తో జరిగిన అల్పాహార సమావేశం లో రాబోయే ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపై పవన్ చర్చించారని తెలుస్తోంది.
దాంతోపాటు, టీడీపీకి కూడా కలుపుకుపోతేనే వైసీపీని గద్దె దించగలమని పవన్ చెప్పినట్లు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఎన్డీఏలో చేరేందుకు సుముఖంగా ఉన్నారని పవన్ చెప్పారట. మరోవైపు, ఈ రోజు మరి కొంతమంది బీజేపీ నేతలను పవన్ కలిసి ఏపీ రాజకీయాలపై, పొత్తులపై చర్చించే అవకాశం ఉంది.
This post was last modified on July 19, 2023 8:19 pm
కాంగ్రెస్ అగ్రనేతే కాదు.. లోక్సభలో విపక్ష నాయకుడు కూడా అయిన రాహుల్గాంధీ.. తరచుగా తప్పులు చేస్తూనే ఉన్నారు. అయితే.. ఎప్పటికప్పుడు…
2009లో విడుదలైన బాలీవుడ్ మూవీ 3 ఇడియట్స్ ఒక సంచలనం. అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోని కాలేజీ స్టూడెంట్…
వైసీపీ మాజీ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి మళ్ళీ రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల…
ఈ రోజుల్లో రీమేక్ సినిమా చేయడం అన్నది పెద్ద రిస్క్గా మారిపోయిన మాట వాస్తవం. ఇంటర్నెట్, ఓటీటీల విప్లవం వల్ల…
టీడీపీ ఎంపీ, గుంటూరు పార్లమెంటు సభ్యుడు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో రాష్ట్రంలోని 25…
గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…