రాజకీయాల్లో చూసే కోణాలు.. వేసే అడుగులు ఎప్పుడు ఎలాగైనా మారొచ్చు. అవసరం-అవకాశం అనే రెండు పట్టాలపైనే ఏ రాజకీయ పార్టీ అయినా..అడుగులు వేస్తుంది. ముఖ్యంగా కాకలు తీరిన రాజకీయ నాయకులుగా పేరున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వంటివారు.. ఊరకరారు మహాను భావులు అన్నట్టుగా.. ఊరికేనే వారు ఏమీ చేయరు.. ఎవరినీ పిలవరు. ఆమూలాగ్రం అన్ని కోణాల్లోనూ ఆలోచించుకునే వారు ప్రయత్నాలు చేస్తారు. రాజకీయం చూస్తారు.
ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయాన్ని కొంత లోతుగా చూస్తే.. ఆయనను కలుపుకొని వెళ్లేందుకు బీజేపీ ముం దుకు వచ్చినట్టుగా కనిపిస్తోంది. తాజాగా జరిగిన ఢిల్లీ ఎన్డీయే కూటమి సమావేశానికి ఆయనకు ఆహ్వానం కూడా అందింది. దీంతో పవన్ అక్కడకు వెళ్లారు. అయితే.. దీనిపై సహజంగానే ఏపీలోని రాజకీయ పక్షాల నుంచి కొంత పెదవి విరుపులు కనిపిం చాయి. నిజానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్డీయేకూటమికి వెళ్లిన ఏకైక పార్టీ జనసేన, ఏకైకనాయకుడు కూడా పవనే కావ డం గమనార్హం. దీంతో ఆయననే బీజేపీ ఎందుకు ఆహ్వానించింది.. అసలు ఈ ఆహ్వానం వెనుక బీజేపీ చూస్తున్న యాంగిల్ ఏంటి? అనేది ఆసక్తిగా మారింది.
దీనిపై పెద్ద ఎత్తున చర్చ కూడా సాగుతోంది. పవన్ కళ్యాణ్ను రాజకీయ కోణంలో చూస్తే.. ఆయన గత ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. పైగా ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలిచినా..ఆయన కూడా పొరుగు పార్టీలో చేరిపోయారు. ఇక, క్షేత్రస్తాయిలో నిజాలు మాట్లాడుకుంటే.. బూత్ స్థాయి కమిటీలు లేవు, మండల స్థాయి యంత్రాంగం కూడా లేదు. ఇంటింటికీ తిరినే కార్యకర్తలు కూడా లేరు. పోనీ.. ఇవన్నీ కాకుండా.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే.. పోటీ చేసే సామర్థ్యం ఉన్న 100 మంది నాయకులుకూడా లేరు. (ఇది కొందరికి నచ్చకపోవచ్చు. కానీ,నిజమే కదా!)
మరి ఏం చూసి.. బీజేపీ పవన్ను చేరదీసింది. పైగా.. వచ్చే ఎన్నికలుకీలకం కదా! అంటే.. ఈ విషయంలో బీజేపీ రాజకీయంగా కన్నా.. ఆయనకు ఉన్న సినిమా ఇమేజ్ను చూస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పవన్ కళ్యాణ్ కు సినీ అభిమానులు, ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్లినా వారు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్కు ఉన్న ఈ సినీ ఇమేజ్ను ఇరురాష్ట్రాలలోనూ వినియోగించుకోవాలనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. ఈ కోణంలోనే పవన్ బీజేపీ ఎక్కువగా ఆదరిస్తోందని విశ్లేషిస్తున్నారు.
This post was last modified on July 19, 2023 12:42 pm
ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…