ఎన్డీఏ కూటమి పార్టీల సమావేశానికి ఏపీ నుంచి జనసేనకు మాత్రమే ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. అయితే, గతంలో ఎన్డీఏలో ఉండి ఆ తర్వాత బయటకు వచ్చిన టీడీపీకి మాత్రం కమలనాథుల నుంచి కబురందలేదు. దీంతో, బీజేపీ-జనసేనల మధ్య పొత్తు ఖాయమని, టీడీపీ విడిగానే పోటీ చేయబోతోందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీలో ఎన్డీఏ కూటమి సమావేశానికి హాజరైన పవన్ కల్యాణ్ ఏపీలో పొత్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసే పోటీచేసే అవకాశముందని పవన్ అన్నారు. జాతీయ మీడియాతో మాట్లాడిన పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ, బీజేపీ, జనసేన 2014లో కలిసి పోటీ చేశాయని, కానీ, 2019లో విడిపోయామని అన్నారు. కానీ, 2019 ఎన్నికల తర్వాత బీజేపీ, జనసేన కలిశాయని, టీడీపీ, బీజేపీల మధ్య మాత్రం అండర్స్టాడింగ్ ఇష్యూ ఉందని పవన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే, వాళ్ల సమస్యలపై తాను మాట్లాడటం సరికాదని పవన్ అన్నారు. అయితే, ఆ ఇష్యూస్ సెటిల్ చేసుకొని రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా కలిసి పోటీ చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
సీఎం అభ్యర్థి ఎవరన్న వ్యవహారంపై కూడా పవన్ స్పందించారు.. సీఎం ఎవరనేది సమస్య కాదని, అయితే, జనసేన కేడర్ తనను సీఎంగా చూడాలనుకుంటోందని చెప్పారు. కానీ, క్షేత్రస్థాయిలో బలాబలాల ఆధారంగా నిర్ణయాలు ఉంటాయని పవన్ చెప్పారు. ఎన్నికల సమయంలో సీఎం అభ్యర్ధి ఎవరు అన్న విషయంపై క్లారిటీ వస్తుందన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూడడం, వైసీపీని ఓడించి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమన్నారు.
ఆధార్ డేటా వ్యక్తిగత గోప్యతకు భంగం అని చర్చ జరుగుతున్న సమయంలో 5 వేల రూపాయల జీతానికి ప్రజల డేటాను ప్రైవేటు వ్యక్తులు సేకరిస్తున్నారని ఆరోపించారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉందని, మౌలిక వసతులు పూర్తిగా లేవని, రైతులకు మద్దతు ధర రావడం లేదని పవన్ ఆరోపించారు. ఉద్యోగులకు సక్రమంగా జీతాలు రావడం లేదని, వాటిపై ప్రశ్నించడానికి జనసేన ముందుకోచ్చిందని చెప్పారు.
This post was last modified on July 19, 2023 8:45 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…
ఏపీకి పొరుగునే ఉన్న తమిళనాడులో ఇప్పుడు ఇదే తరహా రాజకీయాలు కూడా కనిపిస్తున్నాయి. పార్టీలు లెక్కకు మిక్కిలిగా ఉన్నా.. నాయకులు…