ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు మరో 9 నెలలు మాత్రమే గడువుంది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సన్నాహాలు మొదలుపెట్టాయి. అయితే, వైసీపీ మినహా టిడిపి, బిజెపి, జనసేనలు పొత్తులపై మల్లగుల్లాలు పడుతున్నాయి. టిడిపి, బిజెపి, జనసేన కలిసి పోటీ చేస్తాయని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నప్పటికీ కొద్ది రోజుల క్రితం బిజెపి నేతలు చేసిన వ్యాఖ్యలు ఆ ఈక్వేషన్ నుండి టిడిపిని వేరు చేశాయి. దీంతో, జనసేన-టీడీపీ లేదా జనసేన-బీజేపీ ల మధ్య పొత్తు ఉండే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతుంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఎన్డీఏ మిత్ర పక్షాల భేటీకి హాజరయ్యేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లారు. ఈ సమావేశానికి గతంలో ఎన్డీఏ మిత్రపక్షమైన టిడిపికి ఆహ్వానం అందకపోగా జనసేనకు మాత్రం ఆహ్వానం అందింది. దీంతో, ఎన్డీఏలో టీడీపీకి గేట్లు మూసుకుపోయినట్లే. మొత్తం 38 పార్టీలు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నాయని, ఇది బిజెపి బల ప్రదర్శన అని బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా చెప్పారు. దీంతో, బీజేపీ-జనసేనల మధ్య పొత్తు ఖాయమని ముమ్మరంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పొత్తులపై ఢిల్లీలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో ఎన్నికల పొత్తులపై కూడా బీజేపీ పెద్దలతో చర్చించే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ అవకాశం కోసమే చాలాకాలంగా ఎదురుచూస్తున్నానని పవన్ అన్నారు. 2014లో బీజేపీతో కలిసి పోటీ చేశామని, 2019లో విడివిడిగా పోటీ చేశామని పవన్ గుర్తు చేసుకున్నారు. మంగళవారం నాడు జరగబోతున్న ఎన్డీఏ మిత్ర పక్షాల భేటీ కోసం బీజేపీ సీనియర్ నాయకులు తనను ఆహ్వానించారని చెప్పారు. ఈ భేటీలో ఏపీ, తెలంగాణల అభివృద్ధి గురించి చర్చిస్తానని అన్నారు. ఎన్డీఏ విధానాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లే విషయంపై కూడా చర్చలు జరుపుతామని వెల్లడించారు. ఏది ఏమైనా పవన్ తాజా వ్యాఖ్యలతో బీజేపీ, జనసేనల మధ్య పొత్తు ఖాయమన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
This post was last modified on July 18, 2023 10:08 am
తెలుగు వారి నూతన సంవత్సరాది ఉగాది మరో 20 రోజుల్లో రానుంది. ఏటా వచ్చే పండుగే కదా.. ఏముంది ?…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప.. సభకు…
ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…