Political News

బీజేపీతో పొత్తుపై చర్చిస్తా: పవన్

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు మరో 9 నెలలు మాత్రమే గడువుంది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సన్నాహాలు మొదలుపెట్టాయి. అయితే, వైసీపీ మినహా టిడిపి, బిజెపి, జనసేనలు పొత్తులపై మల్లగుల్లాలు పడుతున్నాయి. టిడిపి, బిజెపి, జనసేన కలిసి పోటీ చేస్తాయని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నప్పటికీ కొద్ది రోజుల క్రితం బిజెపి నేతలు చేసిన వ్యాఖ్యలు ఆ ఈక్వేషన్ నుండి టిడిపిని వేరు చేశాయి. దీంతో, జనసేన-టీడీపీ లేదా జనసేన-బీజేపీ ల మధ్య పొత్తు ఉండే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతుంది.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఎన్డీఏ మిత్ర పక్షాల భేటీకి హాజరయ్యేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లారు. ఈ సమావేశానికి గతంలో ఎన్డీఏ మిత్రపక్షమైన టిడిపికి ఆహ్వానం అందకపోగా జనసేనకు మాత్రం ఆహ్వానం అందింది. దీంతో, ఎన్డీఏలో టీడీపీకి గేట్లు మూసుకుపోయినట్లే. మొత్తం 38 పార్టీలు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నాయని, ఇది బిజెపి బల ప్రదర్శన అని బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా చెప్పారు. దీంతో, బీజేపీ-జనసేనల మధ్య పొత్తు ఖాయమని ముమ్మరంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పొత్తులపై ఢిల్లీలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో ఎన్నికల పొత్తులపై కూడా బీజేపీ పెద్దలతో చర్చించే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ అవకాశం కోసమే చాలాకాలంగా ఎదురుచూస్తున్నానని పవన్ అన్నారు. 2014లో బీజేపీతో కలిసి పోటీ చేశామని, 2019లో విడివిడిగా పోటీ చేశామని పవన్ గుర్తు చేసుకున్నారు. మంగళవారం నాడు జరగబోతున్న ఎన్డీఏ మిత్ర పక్షాల భేటీ కోసం బీజేపీ సీనియర్ నాయకులు తనను ఆహ్వానించారని చెప్పారు. ఈ భేటీలో ఏపీ, తెలంగాణల అభివృద్ధి గురించి చర్చిస్తానని అన్నారు. ఎన్డీఏ విధానాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లే విషయంపై కూడా చర్చలు జరుపుతామని వెల్లడించారు. ఏది ఏమైనా పవన్ తాజా వ్యాఖ్యలతో బీజేపీ, జనసేనల మధ్య పొత్తు ఖాయమన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

This post was last modified on July 18, 2023 10:08 am

Share
Show comments
Published by
satya

Recent Posts

సేఫ్ గేమ్ ఆడుతున్న ఆర్ఆర్ఆర్ నిర్మాత

ఇండస్ట్రీలో సుదీర్ఘ అనుభవంతో ఎన్నో బ్లాక్ బస్టర్లు చూసిన డివివి దానయ్య సగటు మాములు ప్రేక్షకుడికి బాగా దగ్గరయ్యింది మాత్రం…

58 mins ago

మాజీ ప్ర‌ధాని మ‌న‌వ‌డి కోసం… బ్లూ కార్నర్ నోటీసు!

భార‌త దేశ చ‌రిత్ర‌లో ఇదోక అనూహ్య‌మైన.. అస‌హ్యించుకునే ఘ‌ట‌న‌. ఈ దేశాన్ని పాలించి, రైతుల మ‌న్న‌న‌లు, మ‌హిళ‌ల మ‌న్న‌న‌లు పొందిన…

1 hour ago

జ‌గ‌న్.. నీరో : జేడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీ సీఎం జ‌గ‌న్‌.. నీరో చ‌క్ర‌వ‌ర్తిని త‌ల‌పిస్తున్నారంటూ.. సీబీఐ మాజీ డైరెక్ట‌ర్ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ సంచ ల‌న వ్యాఖ్య‌లు చేశారు.…

2 hours ago

ఐపీఎల్ ప్లే ఆఫ్స్ లో ఆర్సీబీ..కప్ కొడతారా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో అత్యంత దురదృష్టకరమైన జట్టు పేరు చెప్పమని అడిగితే…ఠపీమని ఆర్సీబీ పేరు చెప్పేస్తారు క్రికెట్…

3 hours ago

సతీసమేతంగా అమెరికాకు చంద్రబాబు

ఏపీలో ఎన్నికల పోరు ముగియడంతో ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. తమ కుటుంబ సభ్యులు,…

3 hours ago

పుష్ప 2 పోటీ – తగ్గనంటున్న శివన్న

ఇంకో మూడు నెలల్లో ఆగస్ట్ 15 విడుదల కాబోతున్న పుష్ప 2 ది రైజ్ విడుదల తేదీలో ఎలాంటి మార్పు…

3 hours ago