Political News

కేసీఆర్ పై పోలీసులకు ఎమ్మెల్యే ఫిర్యాదు

సాధారణంగా రాజకీయ నాయకులన్న తర్వాత హామీలివ్వడం సర్వ సాధారణం. ఎన్నికలకు ముందు..తర్వాత అని తేడా లేకుండా హామీలివ్వడం, నిధులు మంజూరు చేస్తామని వాగ్దానాలు చేయడం సహజం. అయితే, వాటిలో చాలా హామీలు బుట్టదాఖలు అయిన సందర్భాలే ఎక్కువగా ఉంటాయి. ఆ హామీలకు, వాగ్దానాలను ప్రతిపక్ష నేతలు కూడా చూసీచూడనట్లు పోతుంటారు. కొన్ని సందర్భాల్లో మాత్రం హామీలిచ్చిన ముఖ్యమంత్రిపైన విమర్శలు గుప్పించి మమా అనిపిస్తారు. కానీ, ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ పొలిటిషియన్, భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య మాత్రం ఆ కేటగిరీలోకి తాను రానంటున్నారు.

ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ పై పొదెం వీరయ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన వైనం ఇపుడు తెలంగాణ రాజకీయాలలో సంచలనం రేపుతోంది. దాదాపు ఏడాది క్రితం భద్రాచలానికి తీవ్ర స్థాయిలో వరద నీరు వచ్చి చేరింది. ఆ సమయంలో దాదాపుగా భద్రాద్రి ఆలయం కూడా కొంత వరకు మునిగిపోయింది. ఇక, భద్రాచలంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఆ సమయంలో వందలాది ఇళ్లు, దుుకాణాలు వరద బీభత్సానికి కొట్టుకుపోగా…వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలోనే భద్రాచలానికి రూ.1000 కోట్లు నిధులు కేటాయిస్తానని కేసీఆర్ హామీనిచ్చారు.

అయితే, ఆ మాట ఇచ్చి ఏడాది గడుస్తున్నా…ఇంకా ఒక్క రూపాయి నిధులు కూడా విడుదల కాలేదు. దీంతో, స్థానిక ఎమ్మెల్యే పొదెం వీరయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా కేసీఆర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. భద్రాచలం ప్రజలను కేసీఆర్ మోసం చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేర్చేలా చర్యలు తీసుకోవాలని, ఆయనపై కేసు పెట్టాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు, గతంలో రామాలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ప్రకటించిన కేసీఆర్…పైసా కూడా ఇవ్వలేదని ఆయన ఫిర్యాదులో ప్రస్తావించారు.

భద్రాచలంలో కరకట్ట పటిష్టత, ఎత్తు పెంచడానికి, ముంపు కాలనీల ప్రజల పునరావాసానికి కేసీఆర్ వెయ్యి కోట్లు ప్రకటించారని, కానీ, ఏడాది గడిచినా నిధులు మంజూరు చేయలేదని చెప్పారు. తాజాగా, వర్షాలు కురుస్తుండటంతో మళ్లీ గోదావరి ఉప్పొంగే అవకాశం ఉందని, ఈ సంవత్సరం కూడా భద్రాచల ప్రాంత ప్రజలు గోదావరి ముంపునకు గురికావాల్సిందేనా అనిప్రశ్నించారు.

This post was last modified on July 17, 2023 10:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

1 hour ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

1 hour ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

2 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

4 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

4 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

5 hours ago