సాధారణంగా రాజకీయ నాయకులన్న తర్వాత హామీలివ్వడం సర్వ సాధారణం. ఎన్నికలకు ముందు..తర్వాత అని తేడా లేకుండా హామీలివ్వడం, నిధులు మంజూరు చేస్తామని వాగ్దానాలు చేయడం సహజం. అయితే, వాటిలో చాలా హామీలు బుట్టదాఖలు అయిన సందర్భాలే ఎక్కువగా ఉంటాయి. ఆ హామీలకు, వాగ్దానాలను ప్రతిపక్ష నేతలు కూడా చూసీచూడనట్లు పోతుంటారు. కొన్ని సందర్భాల్లో మాత్రం హామీలిచ్చిన ముఖ్యమంత్రిపైన విమర్శలు గుప్పించి మమా అనిపిస్తారు. కానీ, ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ పొలిటిషియన్, భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య మాత్రం ఆ కేటగిరీలోకి తాను రానంటున్నారు.
ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ పై పొదెం వీరయ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన వైనం ఇపుడు తెలంగాణ రాజకీయాలలో సంచలనం రేపుతోంది. దాదాపు ఏడాది క్రితం భద్రాచలానికి తీవ్ర స్థాయిలో వరద నీరు వచ్చి చేరింది. ఆ సమయంలో దాదాపుగా భద్రాద్రి ఆలయం కూడా కొంత వరకు మునిగిపోయింది. ఇక, భద్రాచలంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఆ సమయంలో వందలాది ఇళ్లు, దుుకాణాలు వరద బీభత్సానికి కొట్టుకుపోగా…వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలోనే భద్రాచలానికి రూ.1000 కోట్లు నిధులు కేటాయిస్తానని కేసీఆర్ హామీనిచ్చారు.
అయితే, ఆ మాట ఇచ్చి ఏడాది గడుస్తున్నా…ఇంకా ఒక్క రూపాయి నిధులు కూడా విడుదల కాలేదు. దీంతో, స్థానిక ఎమ్మెల్యే పొదెం వీరయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా కేసీఆర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. భద్రాచలం ప్రజలను కేసీఆర్ మోసం చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేర్చేలా చర్యలు తీసుకోవాలని, ఆయనపై కేసు పెట్టాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు, గతంలో రామాలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ప్రకటించిన కేసీఆర్…పైసా కూడా ఇవ్వలేదని ఆయన ఫిర్యాదులో ప్రస్తావించారు.
భద్రాచలంలో కరకట్ట పటిష్టత, ఎత్తు పెంచడానికి, ముంపు కాలనీల ప్రజల పునరావాసానికి కేసీఆర్ వెయ్యి కోట్లు ప్రకటించారని, కానీ, ఏడాది గడిచినా నిధులు మంజూరు చేయలేదని చెప్పారు. తాజాగా, వర్షాలు కురుస్తుండటంతో మళ్లీ గోదావరి ఉప్పొంగే అవకాశం ఉందని, ఈ సంవత్సరం కూడా భద్రాచల ప్రాంత ప్రజలు గోదావరి ముంపునకు గురికావాల్సిందేనా అనిప్రశ్నించారు.
This post was last modified on July 17, 2023 10:33 pm
తెలుగు వారి నూతన సంవత్సరాది ఉగాది మరో 20 రోజుల్లో రానుంది. ఏటా వచ్చే పండుగే కదా.. ఏముంది ?…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప.. సభకు…
ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…