Political News

ఆ ఎమ్మెల్యే చేసిన అతే శాపమైందా?

ఈ మధ్య ఒక రోజు చిత్తూరు జిల్లాలో 25 కరోనా కేసులు బయటపడ్డాయి. అందులో 24 కేసులు ఒక్క శ్రీకాళహస్తి పట్టణం నుంచే కావడం గమనార్హం. అసలు చిత్తూరు జిల్లాలో తొలి కరోనా కేసు బయటపడిందే శ్రీకాళహస్తిలో. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 70 దాటగా అందులో రెండింట మూడొంతుల కేసులు శ్రీకాళహస్తిలోనే ఉండటం గమనార్హం.

ఇప్పుడు ఈ పట్టణంలో కరోనా ప్రమాదకరమైన మూడో దశలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ప్రాంతాన్ని రెడ్ జోన్‌గా ప్రకటించారు కూడా. ఐతే శ్రీకాళహస్తిలో కరోనా ఇంతగా తీవ్ర రూపం దాల్చడానికి కారణం ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డినే అనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల కిందట ఆయన పట్టణంలో నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ ఎంతగా చర్చనీయాంశం అయిందో తెలిసిందే.

కరోనా బాధితుల్ని ఆదుకోవడానికి ిివిరాళాలు అందజేసిన వాళ్ల ఫ్లెక్సీలు పెట్టి ఆయన భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ భారతి, ప్రభాస్, రతన్ టాటా.. ఇలా ప్రాంతీయ భేదాలు లేకుండా అందరి ఫ్లెక్సీలు పెట్టి ర్యాలీ నిర్వహించారు. కరోనా టైంలో భౌతిక దూరం ఎంత ముఖ్యమో అర్థం చేసుకోకుండా ఎమ్మెల్యే ఇలా ర్యాలీ నిర్వహించడమేంటి.. ఈ ప్రచార ఆర్భాటం ఎందుకు అనే ప్రశ్నలు అప్పుడే వినిపించాయి.

ఇప్పుడు కాళహస్తిలో కరోనా కేసులు ఇంతగా పెరిగిపోవడానికి ఆ ర్యాలీనే కారణమని అభిప్రాయపడుతున్నారు. ఆ ర్యాలీ దృశ్యాలు చూస్తే ఈ ఆరోపణల్లో నిజం లేకపోలేదని అర్థమవుతుంది. అక్కడ పది మందికి పైగా ప్రభుత్వ సిబ్బంది కూడా కరోనా బారిన పడగా.. వాళ్లంతా కూడా ఈ ర్యాలీలో పాల్గొన్న వారే అని కూడా అంటున్నారు.

ఈ ర్యాలీతో పాటు ప్రభుత్వం కరోనా సాయం కింద ప్రకటించిన వెయ్యి రూపాయల సాయాన్ని కూడా పెద్ద మీటింగ్ పెట్టి.. ఒక్కో లబ్దిదారును పిలిచి ఈ సాయం గురించి ప్రచారం సాగిస్తూ పంపకాలు చేయడం కూడా అప్పట్లో విమర్శలకు దారి తీసింది. ఈ పరిణామాల నేపథ్యంలో కాళహస్తిలో కరోనా వ్యాప్తికి ఎమ్మెల్యే చేసిన అతే కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

This post was last modified on April 24, 2020 5:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

1 hour ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

2 hours ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

2 hours ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

3 hours ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

3 hours ago

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

4 hours ago