ఈ మధ్య ఒక రోజు చిత్తూరు జిల్లాలో 25 కరోనా కేసులు బయటపడ్డాయి. అందులో 24 కేసులు ఒక్క శ్రీకాళహస్తి పట్టణం నుంచే కావడం గమనార్హం. అసలు చిత్తూరు జిల్లాలో తొలి కరోనా కేసు బయటపడిందే శ్రీకాళహస్తిలో. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 70 దాటగా అందులో రెండింట మూడొంతుల కేసులు శ్రీకాళహస్తిలోనే ఉండటం గమనార్హం.
ఇప్పుడు ఈ పట్టణంలో కరోనా ప్రమాదకరమైన మూడో దశలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ప్రాంతాన్ని రెడ్ జోన్గా ప్రకటించారు కూడా. ఐతే శ్రీకాళహస్తిలో కరోనా ఇంతగా తీవ్ర రూపం దాల్చడానికి కారణం ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డినే అనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల కిందట ఆయన పట్టణంలో నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ ఎంతగా చర్చనీయాంశం అయిందో తెలిసిందే.
కరోనా బాధితుల్ని ఆదుకోవడానికి ిివిరాళాలు అందజేసిన వాళ్ల ఫ్లెక్సీలు పెట్టి ఆయన భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ భారతి, ప్రభాస్, రతన్ టాటా.. ఇలా ప్రాంతీయ భేదాలు లేకుండా అందరి ఫ్లెక్సీలు పెట్టి ర్యాలీ నిర్వహించారు. కరోనా టైంలో భౌతిక దూరం ఎంత ముఖ్యమో అర్థం చేసుకోకుండా ఎమ్మెల్యే ఇలా ర్యాలీ నిర్వహించడమేంటి.. ఈ ప్రచార ఆర్భాటం ఎందుకు అనే ప్రశ్నలు అప్పుడే వినిపించాయి.
ఇప్పుడు కాళహస్తిలో కరోనా కేసులు ఇంతగా పెరిగిపోవడానికి ఆ ర్యాలీనే కారణమని అభిప్రాయపడుతున్నారు. ఆ ర్యాలీ దృశ్యాలు చూస్తే ఈ ఆరోపణల్లో నిజం లేకపోలేదని అర్థమవుతుంది. అక్కడ పది మందికి పైగా ప్రభుత్వ సిబ్బంది కూడా కరోనా బారిన పడగా.. వాళ్లంతా కూడా ఈ ర్యాలీలో పాల్గొన్న వారే అని కూడా అంటున్నారు.
ఈ ర్యాలీతో పాటు ప్రభుత్వం కరోనా సాయం కింద ప్రకటించిన వెయ్యి రూపాయల సాయాన్ని కూడా పెద్ద మీటింగ్ పెట్టి.. ఒక్కో లబ్దిదారును పిలిచి ఈ సాయం గురించి ప్రచారం సాగిస్తూ పంపకాలు చేయడం కూడా అప్పట్లో విమర్శలకు దారి తీసింది. ఈ పరిణామాల నేపథ్యంలో కాళహస్తిలో కరోనా వ్యాప్తికి ఎమ్మెల్యే చేసిన అతే కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
This post was last modified on April 24, 2020 5:15 pm
టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న టాలీవుడ్ నట సింహం నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఏది పట్టినా బంగారమే అవుతోంది. ఇప్పటికే సినిమాల్లో…
మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్ను వరుసగా రెండోసారి గెలుచుకున్న భారత జట్టుకు బీసీసీఐ గౌరవార్థంగా భారీ నగదు బహుమతి…
బాక్సాఫీస్ వద్ద మోస్ట్ పేయబుల్ హీరోల్లో ఒకడిగా మారిన సిద్దు జొన్నలగడ్డకు సినిమాల పరంగా మధ్యలో బాగానే గ్యాప్ వస్తోంది.…
వైసీపీ అధినేత జగన్ పాలనా కాలంలో తీసుకువచ్చిన నాడు-నేడు అనే మాట ఇప్పుడు కూటమి సర్కారు చక్కగా వినియోగించుకుంటోందా? ఈ…
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో ఆదివారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నెల 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్…
తాజాగా కేంద్రం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ పై అన్ని వర్గాలు స్పందించాయి. రాజకీయ వర్గాల నుంచి పారిశ్రామిక వర్గాల…