Political News

ఆ ఎమ్మెల్యే చేసిన అతే శాపమైందా?

ఈ మధ్య ఒక రోజు చిత్తూరు జిల్లాలో 25 కరోనా కేసులు బయటపడ్డాయి. అందులో 24 కేసులు ఒక్క శ్రీకాళహస్తి పట్టణం నుంచే కావడం గమనార్హం. అసలు చిత్తూరు జిల్లాలో తొలి కరోనా కేసు బయటపడిందే శ్రీకాళహస్తిలో. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 70 దాటగా అందులో రెండింట మూడొంతుల కేసులు శ్రీకాళహస్తిలోనే ఉండటం గమనార్హం.

ఇప్పుడు ఈ పట్టణంలో కరోనా ప్రమాదకరమైన మూడో దశలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ప్రాంతాన్ని రెడ్ జోన్‌గా ప్రకటించారు కూడా. ఐతే శ్రీకాళహస్తిలో కరోనా ఇంతగా తీవ్ర రూపం దాల్చడానికి కారణం ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డినే అనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల కిందట ఆయన పట్టణంలో నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ ఎంతగా చర్చనీయాంశం అయిందో తెలిసిందే.

కరోనా బాధితుల్ని ఆదుకోవడానికి ిివిరాళాలు అందజేసిన వాళ్ల ఫ్లెక్సీలు పెట్టి ఆయన భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ భారతి, ప్రభాస్, రతన్ టాటా.. ఇలా ప్రాంతీయ భేదాలు లేకుండా అందరి ఫ్లెక్సీలు పెట్టి ర్యాలీ నిర్వహించారు. కరోనా టైంలో భౌతిక దూరం ఎంత ముఖ్యమో అర్థం చేసుకోకుండా ఎమ్మెల్యే ఇలా ర్యాలీ నిర్వహించడమేంటి.. ఈ ప్రచార ఆర్భాటం ఎందుకు అనే ప్రశ్నలు అప్పుడే వినిపించాయి.

ఇప్పుడు కాళహస్తిలో కరోనా కేసులు ఇంతగా పెరిగిపోవడానికి ఆ ర్యాలీనే కారణమని అభిప్రాయపడుతున్నారు. ఆ ర్యాలీ దృశ్యాలు చూస్తే ఈ ఆరోపణల్లో నిజం లేకపోలేదని అర్థమవుతుంది. అక్కడ పది మందికి పైగా ప్రభుత్వ సిబ్బంది కూడా కరోనా బారిన పడగా.. వాళ్లంతా కూడా ఈ ర్యాలీలో పాల్గొన్న వారే అని కూడా అంటున్నారు.

ఈ ర్యాలీతో పాటు ప్రభుత్వం కరోనా సాయం కింద ప్రకటించిన వెయ్యి రూపాయల సాయాన్ని కూడా పెద్ద మీటింగ్ పెట్టి.. ఒక్కో లబ్దిదారును పిలిచి ఈ సాయం గురించి ప్రచారం సాగిస్తూ పంపకాలు చేయడం కూడా అప్పట్లో విమర్శలకు దారి తీసింది. ఈ పరిణామాల నేపథ్యంలో కాళహస్తిలో కరోనా వ్యాప్తికి ఎమ్మెల్యే చేసిన అతే కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

This post was last modified on April 24, 2020 5:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

2 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

4 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

4 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

4 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

5 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

6 hours ago