Political News

నాకివ్వండి స‌ర్‌.. కాదు.. నాకే ఇవ్వాలి స‌ర్‌..

ఎన్నిక‌ల ముందు టికెట్ల వ్య‌వ‌హారం టీడీపీలో వివాదాల‌కు దారితీస్తోంది. దీంతో పార్టీ అధినేత చంద్ర‌బాబు ఇలాంటి నియోజ‌క‌వ ర్గాల విష‌యంలో ఆయ‌న నొప్పింప‌క.. తానొవ్వ‌క అనే ఫార్ములాను అనుస‌రిస్తున్నారు. గిరిజ‌న నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ ఆధిప‌త్యం కొన‌సాగుతోంది. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మాత్రం ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ తాము బ‌ల‌ప‌డాల‌ని .. గెలుపు గుర్రం ఎక్కాల‌ని చంద్ర‌బాబు కృత నిశ్చ‌యంతో ఉన్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గాల‌వారీగా నాయ‌కుల‌ను పిలిచి.. చ‌ర్చించి టికెట్లు క‌న్ఫ‌ర్మ్ చేయాల‌ని నిర్ణ‌యించారు.

ఈ క్ర‌మంలో కీల‌క‌మైన అర‌కు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంపై ఇటీవ‌ల చ‌ర్చించారు. ఇక్క‌డ ఇద్ద‌రు యువ నాయ‌కులు టీడీపీలో టికెట్ కోసం ప‌ర‌స్ప‌ర్ పెనుగులాడుతున్నారు. వీరిలో ఒక‌రు మాజీ యువ మంత్రి కిడారి శ్రావ‌ణ్‌కుమార్ కాగా, మ‌రొక‌రు దొన్ను దొర‌. వీరిలో కిడారి ప్ర‌స్తుతం నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ ఇంచార్జ్‌గా వున్నారు. 2014 ఎన్నిక‌ల్లో కిడారి తండ్రి ఇక్క‌డ నుంచి వైసీపీ టికెట్‌పై విజ‌యం ద‌క్కించుకున్నారు. త‌ర్వాత టీడీపీలో చేరారు. అయితే.. మావోయిస్టులు జ‌రిపిన కాల్పుల్లోఆయ‌న కొద్దికాలానికే మ‌ర‌ణించారు. దీంతో శ్రావ‌ణ్‌కుమార్‌కు చ‌ట్ట‌స‌భ‌ల్లో ప్రాతినిధ్యం లేక‌పోయినా.. చంద్ర‌బాబు మంత్రి ప‌ద‌వి ఇచ్చారు.

ఇక‌, అప్ప‌టి నుంచి కూడా ఆయ‌నే ఇక్క‌డ ఇంచార్జ్‌గా కొన‌సాగుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. ఇక‌, ఎస్టీ టీడీపీ సెల్ ఇంచార్జ్‌గా ఉన్న దొన్నుదొర పార్టీని బ‌లోపేతం చేయ‌డంలో ముందున్నారు. తాజాగా టికెట్ విష‌యానికి వ‌చ్చేస‌రికి ఇద్ద‌రూ కూడా పోటీ ప‌డుతున్నారు. వీరికి గిరిజ‌నుల్లో రెండు వేర్వేరు తెగ‌ల మ‌ద్ద‌తు ఉంది. పైగా అర‌కులో సంఖ్యాబ‌లం ఎక్కువ‌గా ఉన్న గిరిజ‌న తెగ‌కు దొన్ను దొర ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. దీంతో త‌న‌కు ఈ సారి అవ‌కాశం ఇవ్వాల‌ని ఆయ‌న కోరుతున్నారు. అయితే.. పార్టీ త‌ర‌ఫున త‌న తండ్రి ప్రాణాలు ప‌ణంగా పెట్టార‌ని.. కాబ‌ట్టి త‌న‌కే ఇవ్వాల‌ని కిడారి కోరుతున్నారు.

అంతేకాదు.. సంప్ర‌దాయంగా కూడా ఈ టికెట్ త‌న‌కే ఇవ్వాల‌ని కిడారి ఒత్తిడి చేస్తున్నారు. ప్ర‌స్తుతం వైసీపీ ఎమ్మెల్యే కూడా త‌న తెగ‌కు చెందిన వారేన‌ని.. సునాయాసంగా ఓడిస్తాన‌ని ఆయ‌న చెబుతున్నారు. దీంతో టీడీపీలో యాక్టివ్‌గా ఉన్న ఇద్ద‌రూ టికెట్ కోసం పోరు స‌ల్ప‌డంతో చంద్ర‌బాబు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో అభ్య‌ర్థిని ఎంపిక చేయ‌డంపై వాయిదా మంత్రం ప‌ఠించారు. మ‌రో రెండు మాసాల త‌ర్వాత‌.. నివేదిక‌లు తెప్పించుకుని.. అప్పుడు నిర్ణ‌యిస్తాన‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. మ‌రి అప్ప‌టికి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

3 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

4 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

4 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

4 hours ago

లోకేష్ ఆక‌స్మిక త‌నిఖీ.. టీడీపీలో క‌ల‌వ‌రం!

మంత్రి నారా లోకేష్‌.. మంగ‌ళ‌వారం ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని ఓ పాఠ‌శాల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఈ విష‌యాన్ని అత్యంత గోప్యంగా…

5 hours ago

మా సీఎం స్టాలినే.. త‌మిళ‌నాట ‘ఏపీ పాలిటిక్స్’ రిపీట్‌!

ఏపీకి పొరుగునే ఉన్న త‌మిళ‌నాడులో ఇప్పుడు ఇదే త‌ర‌హా రాజ‌కీయాలు కూడా క‌నిపిస్తున్నాయి. పార్టీలు లెక్క‌కు మిక్కిలిగా ఉన్నా.. నాయ‌కులు…

5 hours ago