టీడీపీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గాలపై కన్నేసిన వైసీపీ.. ఆయా నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకుని తమ జెండా ఎగరేయాలనే పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే కుప్పం, టెక్కలి, హిందూపురం, పాలకొల్లు, కొండపి వంటి బలమైన టీడీపీ వర్గం ఉన్న నియోజకవర్గాలపైనా వైసీపీ వ్యూహా త్మకంగా పావులు కదుపుతోంది. ఇక,ఇవన్నీ.. కూడా టీడీపీ ఫైర్బ్రాండ్స్ చేతిలో ఉన్న నియోజకవర్గాలే కావడం గమనార్హం.
ఈ జాబితాలో ఉన్న మరో నియోజకవర్గం పరుచూరు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గం నుంచి వరుసగా టీడీపీ విజయం దక్కించుకుంటోంది. ఆదిలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు(చంద్రబాబు తోడల్లుడు కాంగ్రెస్, టీడీపీ తరఫున కూడా విజయం దక్కించుకున్నారు) తర్వాత.. ఆయన పార్టీకి దూరం కావడం.. వైసీపీ పంచన చేరిన దరిమిలా.. 2014, 2019 ఎన్నికల్లోటీడీపీ అభ్యర్థిగా.. ఏలూరి సాంబశివరావు విజయం సాధించారు.
వాస్తవానికి ఏలూరి వివాదాలకు దూరంగా ఉంటారు. ప్రజలను నమ్ముకుని.. ప్రజల మధ్య ఉండే నాయకు ల్లో ఏలూరి కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే.. దగ్గుబాటి వైసీపీ నుంచి దూరం కావడంతో ఇక్కడ ఆయన ఇలాకాలో వైసీపీ పాగా వేయడం ద్వారా.. ఇటు దగ్గుబాటికి, అటు టీడీపీకి కూడా ఒకే సారి చెక్ పెట్టాలని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నారు. అందుకే..ఇక్కడ ఇంచార్జిగా.. చీరాలకు చెందిన ఆమంచి కృష్ణమోహన్ను నియమించారు.
కానీ, ఆమంచి మనసు మాత్రం.. చీరాలపైనే ఉంది. దీంతో చుట్టపు చూపుగా మాత్రమే పరుచూరుకు ఆయన వచ్చిపోతున్నారనే వాదన వినిపిస్తోంది. ఫలితంగా వైసీపీ ఈ నియోజకవర్గంలో చుక్కాని లేని నావగా ప్రయాణం చేస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. ఇంకో వైపు.. టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి.. ప్రజలకు మరింత చేరువ అవుతున్నారు. పార్టీకార్యక్రమాలు.. సొంతగా రూపొందించుకున్న షెడ్యూల్ను ఆయన అమలు చేస్తున్నారు. దీంతో వైసీపీ ఇక్కడ గెలుపుగుర్రం ఎక్కడ సాధ్యం కాదనే అంచనాలు రావడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
This post was last modified on July 18, 2023 8:08 am
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…