Political News

ప‌రుచూరులో పాగా వేయ‌లేం.. తేల్చేసిన నేత‌లు

టీడీపీకి కంచుకోట‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల‌పై క‌న్నేసిన వైసీపీ.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుని త‌మ జెండా ఎగ‌రేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉంది. ఈ క్ర‌మంలోనే కుప్పం, టెక్క‌లి, హిందూపురం, పాల‌కొల్లు, కొండ‌పి వంటి బ‌ల‌మైన టీడీపీ వ‌ర్గం ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల‌పైనా వైసీపీ వ్యూహా త్మకంగా పావులు క‌దుపుతోంది. ఇక‌,ఇవ‌న్నీ.. కూడా టీడీపీ ఫైర్‌బ్రాండ్స్ చేతిలో ఉన్న నియోజ‌క‌వ‌ర్గాలే కావ‌డం గ‌మ‌నార్హం.

ఈ జాబితాలో ఉన్న మ‌రో నియోజ‌క‌వ‌ర్గం ప‌రుచూరు. ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలో ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస‌గా టీడీపీ విజ‌యం ద‌క్కించుకుంటోంది. ఆదిలో ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌రరావు(చంద్ర‌బాబు తోడ‌ల్లుడు కాంగ్రెస్‌, టీడీపీ త‌ర‌ఫున కూడా విజ‌యం ద‌క్కించుకున్నారు) త‌ర్వాత‌.. ఆయ‌న పార్టీకి దూరం కావ‌డం.. వైసీపీ పంచ‌న చేరిన ద‌రిమిలా.. 2014, 2019 ఎన్నిక‌ల్లోటీడీపీ అభ్య‌ర్థిగా.. ఏలూరి సాంబ‌శివ‌రావు విజ‌యం సాధించారు.

వాస్త‌వానికి ఏలూరి వివాదాల‌కు దూరంగా ఉంటారు. ప్ర‌జ‌ల‌ను న‌మ్ముకుని.. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండే నాయ‌కు ల్లో ఏలూరి కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే.. ద‌గ్గుబాటి వైసీపీ నుంచి దూరం కావ‌డంతో ఇక్క‌డ ఆయ‌న ఇలాకాలో వైసీపీ పాగా వేయ‌డం ద్వారా.. ఇటు ద‌గ్గుబాటికి, అటు టీడీపీకి కూడా ఒకే సారి చెక్ పెట్టాల‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ భావిస్తున్నారు. అందుకే..ఇక్క‌డ ఇంచార్జిగా.. చీరాల‌కు చెందిన ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌ను నియ‌మించారు.

కానీ, ఆమంచి మ‌న‌సు మాత్రం.. చీరాల‌పైనే ఉంది. దీంతో చుట్ట‌పు చూపుగా మాత్ర‌మే ప‌రుచూరుకు ఆయ‌న వ‌చ్చిపోతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. ఫ‌లితంగా వైసీపీ ఈ నియోజ‌క‌వ‌ర్గంలో చుక్కాని లేని నావ‌గా ప్ర‌యాణం చేస్తోందని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఇంకో వైపు.. టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి.. ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ అవుతున్నారు. పార్టీకార్య‌క్ర‌మాలు.. సొంత‌గా రూపొందించుకున్న షెడ్యూల్‌ను ఆయ‌న అమ‌లు చేస్తున్నారు. దీంతో వైసీపీ ఇక్క‌డ గెలుపుగుర్రం ఎక్క‌డ సాధ్యం కాద‌నే అంచ‌నాలు రావ‌డం పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

This post was last modified on July 18, 2023 8:08 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

3 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

4 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

5 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

5 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

6 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

7 hours ago