Political News

తిరుపతి పై పవన్ దండయాత్ర: భూమన

శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్త సాయిపై సీఐ అంజూ యాదవ్ చేయిచేసుకున్న ఘటన పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఘటనపై ఇప్పటికే పలుమార్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ పై చర్యలు తీసుకోవాలని తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు పవన్ స్వయంగా తిరుపతి వచ్చారు. సీఐ అంజూ యాదవ్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు.

అంతకుముందు, రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో పవన్ కు స్వాగతం పలికేందుకు వేలాదిగా కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. దాదాపు 15 కిలోమీటర్లు భారీ ర్యాలీని జనసైనికులు నిర్వహించారు. ఆ తర్వాత సీఐ అంజూయాదవ్ చేతిలో దెబ్బలు తిన్న సాయితో పాటు మరో ఆరుగురితో వెళ్లి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డికి పవన్ ఫిర్యాదు చేశారు. మరోవైపు, ఈ ఘటనపై జిల్లా ఎస్పీ విచారణ నిర్వహించి డీజీపీకి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరోవైపు, పవన్ పై తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వినతిపత్రం అంటూ తిరుపతిపై పవన్‌ దండయాత్రకు వచ్చారని ఎద్దేవా చేశారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిపై పవన్‌ ఇంతమందితో దాడి చేసేందుకు వచ్చిన్నట్టు ఉందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న తమ పార్టీపై నిందలు వేస్తున్నాడని, తనకు ఓటు వేస్తే ఏం చేస్తాడో పవన్ ఎప్పుడూ చెప్పరని చురకలంటించారు. పగ, ప్రతీకారాలతో భీష్మ ప్రతిజ్ఞలు మాత్రమే పవన్ చేస్తున్నారని దుయ్యబట్టారు.

This post was last modified on July 17, 2023 2:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

2 hours ago

ఈసారి ఉగాది పండగ మాత్రమే కాదు

తెలుగు వారి నూత‌న సంవ‌త్స‌రాది ఉగాది మ‌రో 20 రోజుల్లో రానుంది. ఏటా వ‌చ్చే పండుగే క‌దా.. ఏముంది ?…

6 hours ago

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

9 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

10 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

11 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

12 hours ago