శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్త సాయిపై సీఐ అంజూ యాదవ్ చేయిచేసుకున్న ఘటన పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఘటనపై ఇప్పటికే పలుమార్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ పై చర్యలు తీసుకోవాలని తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు పవన్ స్వయంగా తిరుపతి వచ్చారు. సీఐ అంజూ యాదవ్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు.
అంతకుముందు, రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో పవన్ కు స్వాగతం పలికేందుకు వేలాదిగా కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. దాదాపు 15 కిలోమీటర్లు భారీ ర్యాలీని జనసైనికులు నిర్వహించారు. ఆ తర్వాత సీఐ అంజూయాదవ్ చేతిలో దెబ్బలు తిన్న సాయితో పాటు మరో ఆరుగురితో వెళ్లి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డికి పవన్ ఫిర్యాదు చేశారు. మరోవైపు, ఈ ఘటనపై జిల్లా ఎస్పీ విచారణ నిర్వహించి డీజీపీకి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది.
మరోవైపు, పవన్ పై తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వినతిపత్రం అంటూ తిరుపతిపై పవన్ దండయాత్రకు వచ్చారని ఎద్దేవా చేశారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిపై పవన్ ఇంతమందితో దాడి చేసేందుకు వచ్చిన్నట్టు ఉందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న తమ పార్టీపై నిందలు వేస్తున్నాడని, తనకు ఓటు వేస్తే ఏం చేస్తాడో పవన్ ఎప్పుడూ చెప్పరని చురకలంటించారు. పగ, ప్రతీకారాలతో భీష్మ ప్రతిజ్ఞలు మాత్రమే పవన్ చేస్తున్నారని దుయ్యబట్టారు.
This post was last modified on July 17, 2023 2:28 pm
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…
వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…
గజ్వేల్ నియోజకవర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట. అయితే.. ఇక్కడే పాగా వేయాలని.. వచ్చే…
తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…
అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…