Political News

రూ.1.10 కోట్ల లంచం తీసుకుంటూ దొరికి పోయాడు

లంచం తీసుకుంటూ అధికారులు ఏసీబీకీ దొరికిపోవటం చాలా కామన్. అయితే.. సదరు అధికారి స్థాయికి.. తీసుకునే లంచానికి పెద్ద పోలిక లేని రీతిలో చాలా సందర్భాల్లో దొరికిపోతుంటారు. రూ.10 వేలు మొదలు రూ.10 లక్షల లోపు లంచం తీసుకుంటూ దొరికే అధికారులు కోకొల్లలు.

అందుకు భిన్నంగా ‘రియల్’ తిమింగళ అధికారులు ఎలా ఉంటారన్న వాస్తవానికి దగ్గరగా ఉండే భారీ అనకొండ ఒకటి తాజాగా ఏసీబీ అధికారులకు దొరికిన వైనం షాకింగ్ గా మారింది. ఎందుకంటే.. సదరు అధికారి డిమాండ్ చేసిన లంచం రూ.2కోట్లు అయితే.. ఒప్పందంలో భాగంగా తొలి విడతలో రూ.1.10కోట్ల మొత్తాన్ని లంచంగా తీసుకునే సమయంలో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తీరు సంచలనంగా మారింది.

మేడ్చల్ జిల్లా కీసర ఎమ్మార్వోగా వ్యవహరిస్తున్న నాగరాజు శుక్రవారం రాత్రి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. భూ రికార్డుల్లో పేర్లు మార్చటం.. లంచం తీసుకొని వారికి అనుకూలంగా పట్టాదారు పాస్ బుక్ ఇవ్వటం కోసం ఇంత భారీ మొత్తాన్ని డిమాండ్ చేసినట్లు చెబుతున్నారు. కీసర మండలం రాంపల్లి దాయర గ్రామానికి చెందిన 53 ఎకరాల స్థలానికి సంబంధించి రెండు వర్గాల మధ్య కోర్టు నడుస్తున్నట్లుగా చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఒక వర్గానికి అనుకూలంగా రికార్డుల్ని తయారు చేయటానికి వీలుగా ఈ భారీ మొత్తాన్ని లంచంగా కోరినట్లు తెలుస్తోంది. ముందుగా చేసుకున్న ఒప్పందంలో భాగంగా రూ.1.10 కోట్ల మొత్తాన్ని ఏఎస్ రావు నగర్ లోని తన నివాసంలో తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఆయనతో పాటు.. మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు మామూలు వ్యక్తులు కాగా.. మూడో వ్యక్తి మాత్రం రాంపల్లి వీఆర్ఏ సాయిరాజ్ కూడా ఉన్నారు.

ఇంత భారీ మొత్తంలో ఒక రెవెన్యూ అధికారి లంచం రూపంలో తీసుకుంటూ దొరికిపోయిన వైనం పెను సంచలనంగా మారింది. గడిచిన కొంతకాలంగా రెవెన్యూ అధికారులు.. వ్యవస్థపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహంగా ఉండటం తెలిసిందే. ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. అయితే.. రెవెన్యూ అధికారుల వ్యతిరేకత ఎక్కువగా ఉండటంతో ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తూ.. ప్రస్తుతానికి తన ఆలోచనల్ని పట్టి ఉంచారు.

తాజా ఎపిసోడ్ నేపథ్యంలో తన కీలక నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ అమలు చేసే అవకాశం ఉందంటున్నారు. కీసర ఎమ్మార్వో పై ఏసీబీ దాడుల ఉదంతం గురించి ముఖ్యమంత్రి కార్యాలయం ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. కీసర రెవెన్యూ అధికారి పుణ్యమా అని.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉందని చెబుతున్నారు.

This post was last modified on August 15, 2020 9:46 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈ సంక్రాంతికైనా జనంలోకి జగన్ వస్తారా?

రాష్ట్ర రాజ‌కీయాల్లో మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకునే దిశ‌గా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. స‌హ‌జంగా అధికారంలో ఉన్న‌పార్టీలు…

2 hours ago

‘పార్టీ మారినోళ్లు రెండూ కానోల్లా?’

తెలంగాణ‌లో తాజాగా జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం ద‌క్కించుకుంద‌ని.. ఇది 2029 వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని.. అప్పుడు…

4 hours ago

కూటమి కట్టక తప్పదేమో జగన్

వ్య‌క్తిగ‌త విష‌యాలే..  జ‌గ‌న్‌కు మైన‌స్ అవుతున్నాయా? ఆయ‌న ఆలోచ‌నా ధోర‌ణి మార‌క‌పోతే ఇబ్బందులు త‌ప్ప‌వా? అంటే.. అవున‌నే సంకేతాలు పార్టీ…

6 hours ago

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

9 hours ago

‘ప్యారడైజ్’ బిర్యాని… ‘సంపూ’ర్ణ వాడకం అంటే ఇది

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

10 hours ago

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

11 hours ago