Political News

రూ.1.10 కోట్ల లంచం తీసుకుంటూ దొరికి పోయాడు

లంచం తీసుకుంటూ అధికారులు ఏసీబీకీ దొరికిపోవటం చాలా కామన్. అయితే.. సదరు అధికారి స్థాయికి.. తీసుకునే లంచానికి పెద్ద పోలిక లేని రీతిలో చాలా సందర్భాల్లో దొరికిపోతుంటారు. రూ.10 వేలు మొదలు రూ.10 లక్షల లోపు లంచం తీసుకుంటూ దొరికే అధికారులు కోకొల్లలు.

అందుకు భిన్నంగా ‘రియల్’ తిమింగళ అధికారులు ఎలా ఉంటారన్న వాస్తవానికి దగ్గరగా ఉండే భారీ అనకొండ ఒకటి తాజాగా ఏసీబీ అధికారులకు దొరికిన వైనం షాకింగ్ గా మారింది. ఎందుకంటే.. సదరు అధికారి డిమాండ్ చేసిన లంచం రూ.2కోట్లు అయితే.. ఒప్పందంలో భాగంగా తొలి విడతలో రూ.1.10కోట్ల మొత్తాన్ని లంచంగా తీసుకునే సమయంలో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తీరు సంచలనంగా మారింది.

మేడ్చల్ జిల్లా కీసర ఎమ్మార్వోగా వ్యవహరిస్తున్న నాగరాజు శుక్రవారం రాత్రి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. భూ రికార్డుల్లో పేర్లు మార్చటం.. లంచం తీసుకొని వారికి అనుకూలంగా పట్టాదారు పాస్ బుక్ ఇవ్వటం కోసం ఇంత భారీ మొత్తాన్ని డిమాండ్ చేసినట్లు చెబుతున్నారు. కీసర మండలం రాంపల్లి దాయర గ్రామానికి చెందిన 53 ఎకరాల స్థలానికి సంబంధించి రెండు వర్గాల మధ్య కోర్టు నడుస్తున్నట్లుగా చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఒక వర్గానికి అనుకూలంగా రికార్డుల్ని తయారు చేయటానికి వీలుగా ఈ భారీ మొత్తాన్ని లంచంగా కోరినట్లు తెలుస్తోంది. ముందుగా చేసుకున్న ఒప్పందంలో భాగంగా రూ.1.10 కోట్ల మొత్తాన్ని ఏఎస్ రావు నగర్ లోని తన నివాసంలో తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఆయనతో పాటు.. మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు మామూలు వ్యక్తులు కాగా.. మూడో వ్యక్తి మాత్రం రాంపల్లి వీఆర్ఏ సాయిరాజ్ కూడా ఉన్నారు.

ఇంత భారీ మొత్తంలో ఒక రెవెన్యూ అధికారి లంచం రూపంలో తీసుకుంటూ దొరికిపోయిన వైనం పెను సంచలనంగా మారింది. గడిచిన కొంతకాలంగా రెవెన్యూ అధికారులు.. వ్యవస్థపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహంగా ఉండటం తెలిసిందే. ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. అయితే.. రెవెన్యూ అధికారుల వ్యతిరేకత ఎక్కువగా ఉండటంతో ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తూ.. ప్రస్తుతానికి తన ఆలోచనల్ని పట్టి ఉంచారు.

తాజా ఎపిసోడ్ నేపథ్యంలో తన కీలక నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ అమలు చేసే అవకాశం ఉందంటున్నారు. కీసర ఎమ్మార్వో పై ఏసీబీ దాడుల ఉదంతం గురించి ముఖ్యమంత్రి కార్యాలయం ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. కీసర రెవెన్యూ అధికారి పుణ్యమా అని.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉందని చెబుతున్నారు.

This post was last modified on August 15, 2020 9:46 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ది అయోమ‌యంపై ర‌విబాబు అస‌హ‌నం

ఈ రోజుల్లో పెద్ద, చిన్న అని తేడా లేకుండా ప్ర‌తి సినిమాకూ రిలీజ్ డేట్ మార‌డం అన్న‌ది మామూలైపోయింది. ఐతే…

2 hours ago

విజయ్ గురించి మన వాళ్లు కొట్టేసుకుంటున్నారు

ఆలు లేదు చూలు లేదు.. అనే సామెతను గుర్తుకు తెస్తోంది తెలుగు సోషల్ మీడియా గొడవలు చూస్తే. సినిమాలు, రాజకీయాల…

4 hours ago

94 వయసులో ‘సింగీతం’ మాయాజలం

టాలీవుడ్ ఎవర్ గ్రీన్ క్లాసిక్ మాయాబజార్ కు పని చేసిన వ్యక్తి ఇప్పుడో సినిమాకు దర్శకత్వం వహించారంటే నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు…

4 hours ago

ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేస్.. ఎవరెవరికి ఎంత ఛాన్స్?

ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ ఫస్ట్ హాఫ్ పూర్తయ్యింది. దీంతో ప్లేఆఫ్స్ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. ఇక పాయింట్ల పట్టిక…

7 hours ago

‘చిట్టి’బాబుని ‘పెద్ది’గాడు కొట్టగలడా?

ఎట్టకేలకు ఊహించినట్టే, ముందే లీకైనట్టే పెద్ది విడుదల తేదీ జూన్ 4 అనౌన్స్ చేస్తూ అధికారిక ప్రకటన నిర్మాణ సంస్థ…

8 hours ago

లండన్ కొలువులో కొడుకు… తల్లికి ఇందిరమ్మ ఇల్లు

సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్దిదారుల ఎంపికలో అప్పుడప్పుడూ చిత్రవిచిత్రాలు బయటపడుతూ ఉంటాయి. అలా బయటపడిన విచిత్రాలను సరిదిద్దడం అప్పటికప్పుడు సాధ్యం…

8 hours ago