Political News

విశాఖ‌లో జ‌న‌సేన బ‌ల‌ప‌డేనా? పంచ‌క‌ర్ల చేరిక వెనుక‌!

ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ స‌ర్కారును గ‌ద్దె దింప‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని ప్ర‌క‌టించిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ దూకుడుకు కొంద‌రు నేత‌లు ఫిదా అవుతున్నారు. వారాహి యాత్ర 2.0 త‌ర్వాత పార్టీలో చేరిక‌లు జ‌రుగుతున్నాయి. ఒక‌రిద్ద‌రే అయినా.. కీల‌క నేత‌లు.. సామాజిక వ‌ర్గాల ప‌రంగా బ‌ల‌మైన నాయ‌కులు కావ‌డంతో వారి చేరిక‌ల‌కు ప్రాధాన్యం ఏర్ప‌డింది. ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని చీరాల నుంచి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ సోద‌రుడు స్వాములు చేరిన విష‌యం తెలిసిందే.

తాజాగా విశాఖ‌కు చెందిన బ‌ల‌మైన నాయ‌కుడు, ప్ర‌జ‌ల్లో మంచి పేరున్న నేత పంచ‌క‌ర్ల ర‌మేష్‌బాబు సైతం జన‌సేన‌కు జై కొట్టారు. తాజాగా ఆయ‌న మంగ‌ళ‌గిరిలోని జ‌న‌సేన పార్టీ కార్యాల‌యంలో ప‌వ‌న్‌తో భేటీ అయ్యారు. రెండు మూడు రోజుల్లో మంచి రోజు చూసుకుని జనసేన పార్టీలో చేరుతున్నట్లు పంచకర్ల ప్ర‌క‌టించారు. తాను ఏ ప‌ద‌వులూ ఆశించి రాలేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. జ‌న‌సేన‌లో కార్యకర్తగా పనిచేస్తానని అన్నారు. అదేస‌మ‌యంలో ప‌వ‌న్ ఎలాంటి బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పారు. సుదీర్ఘ కాలంగా రాజ‌కీయాల్లో ఉన్నాన‌ని తెలిపిన పంచ‌క‌ర్ల‌.. తన అనుభవాన్ని పార్టీ ఉపయోగించుకుంటుందని పవన్ హామీ ఇచ్చిన‌ట్టు తెలిపారు.

“జనసేన పార్టీ భావజాలం, రాష్ట్ర శ్రేయస్సు కోసం పవన్ కళ్యాణ్ పడుతున్న తపన చూసి నేను కూడా ఒక సైనికుడిలా ఆయన వెంట నడవాలని నిర్ణయించుకున్నాను. అదే విషయం ఆయనతో చెప్పాను. ఈ నెల 20న అనుచరులతో క‌లిసి పార్టీలో జాయిన్ అవుతాను” అని పంచ‌క‌ర్ల‌ అన్నారు.

ఎవ‌రీ పంచ‌క‌ర్ల‌..

పంచ‌క‌ర్ల ర‌మేష్‌బాబు మాజీ ఎమ్మెల్యే. గ‌తంలో టీడీపీలో ప‌నిచేశారు. త‌ర్వాత వైసీపీలోకి వ‌చ్చారు. విశాఖ జిల్లా వైసీపీకి అధ్యక్షుడుగా ప‌నిచేశారు. అయితే.. విశాఖ వైసీపీలో త‌లెత్తిన ఆధిప‌త్య రాజ‌కీయాల‌తో ఆయ‌న కొన్నాళ్ల కింద‌ట పార్టీకి రాజీనామా చేశారు. అయితే.. త‌న ప‌రిస్థితి వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌కు చెప్పేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నించినా.. అప్పాయింట్‌మెంట్ ల‌భించ‌క‌పోవ‌డంతో పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు.

This post was last modified on July 17, 2023 8:33 am

Share
Show comments
Published by
satya

Recent Posts

కోరుకోని చిక్కులో రష్మిక మందన్న

యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…

4 mins ago

హర్యానా : కమలం ‘చే’జారేనా ?

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…

25 mins ago

ఆ భూమి జూనియర్ ఎప్పుడో అమ్మేశాడు !

ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో కొన్న 681 గజాల స్థలం విషయంలో వివాదం నెలకొందని, ఆ స్థలం…

2 hours ago

సోనియ‌మ్మ‌.. సెంటిమెంటు రాహుల్‌ను కాపాడుతుందా?

రాజ‌కీయాల్లో సెంటిమెంటుకు ఛాన్స్ ఎక్కువ‌. ఉద్ధండ నాయ‌కుల నుంచి చ‌రిత్ర సొంతం చేసుకున్న పార్టీల వ‌ర‌క కూడా సెంటి మెంటుకు…

3 hours ago

“వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్క‌క‌పోవ‌చ్చు”

వైసీపీ నాయ‌కులు స‌హా స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి క‌ళ్ల‌లో భ‌యం క‌నిపిస్తోంద‌ని ఆ పార్టీ రెబ‌ల్ ఎంపీ, ఉండి నుంచి…

10 hours ago

సీమ ఓట్ల హైజాక్‌.. ఎవ‌రికి మేలు?

రాయ‌లసీమ‌లో ఓట్ల హైజాక్ జ‌రిగిందా? వైసీపీకి ప‌డాల్సిన ఓట్లు.. కాంగ్రెస్‌కు ప‌డ్డాయా? అంటే.. ఔన‌నే అంటున్నారు కొంద‌రు రాజ‌కీయ విశ్లేష‌కులు.…

14 hours ago