ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. దీంతోపాటు, హిందూ దేవాలయాలపై, హిందూ దేవాలయాలకు సంబంధించిన ఆస్తుల వ్యవహారంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారం రేపాయి. హిందూ ధర్మాన్ని జగన్ టార్గెట్ చేస్తున్నారని ఆయన విమర్శించారు. తాజాగా పవన్ వ్యాఖ్యలపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. వాలంటీర్ వ్యవస్థ పై చంద్రబాబు పనులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
దేశమంతా వాలంటీర్ల వ్యవస్థను ప్రశంసిస్తోందని సుబ్బారెడ్డి చెప్పారు. నీతి ఆయోగ్ సమావేశంలో కూడా వాలంటీర్లను ప్రశంసించారని గుర్తు చేశారు. ఈ వ్యవస్థను ప్రధాని మోడీ కూడా కొనియాడారని అన్నారు. కరోనా టైంలో ప్రాణాలు అడ్డుపెట్టి మరీ ప్రజలకు వాలంటీర్లు సేవలందించారని చెప్పారు. చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే వాలంటీర్లపై, జగన్ పై పవన్ విమర్శలు గుప్పిస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో జన్మభూమి కమిటీలు ఉండేవని, వాటి దోపిడీకి తట్టుకోలేక ప్రజలు వైసీపీకి ఓటేశారని అన్నారు. దమ్ముంటే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని పవన్, చంద్రబాబు ప్రకటించాలని ఛాలెంజ్ చేశారు.
మరోవైపు, పవన్ వ్యాఖ్యలపై మంత్రి దాడిశెట్టి రాజా మండిపడ్డారు. జగన్ పై అసూయతో పవన్ మాట్లాడిన ఉపన్యాసాలపై ప్రజలు హర్షించరని అన్నారు. మైక్ చేతిలో ఉందని నోటికొచ్చినట్టు పిచ్చిగా మాట్లాడడం తప్పని, అది తప్ప పవన్ కు రాష్ట్రం గురించి, పాలన గురించి ఏం తెలుసని ఆయన ప్రశ్నించారు. రాబోయే ఎన్నికలే జనసేన, టీడీపీలకు ఆఖరి ఎన్నికలని జోస్యం చెప్పారు. ఈ రెండు పార్టీలను జనం సముద్రంలో కలిపేస్తారని ధీమా వ్యక్తం చేశారు. వైవీ సుబ్బారెడ్డి, దాడిశెట్టిల వ్యాఖ్యలపై పవన్ స్పందన ఏవిధంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…
మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్ను అనుకోకుండా రివీల్…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి…
"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…