Political News

పవన్ పై వైవీ హాట్ కామెంట్స్

ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. దీంతోపాటు, హిందూ దేవాలయాలపై, హిందూ దేవాలయాలకు సంబంధించిన ఆస్తుల వ్యవహారంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారం రేపాయి. హిందూ ధర్మాన్ని జగన్ టార్గెట్ చేస్తున్నారని ఆయన విమర్శించారు. తాజాగా పవన్ వ్యాఖ్యలపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. వాలంటీర్ వ్యవస్థ పై చంద్రబాబు పనులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

దేశమంతా వాలంటీర్ల వ్యవస్థను ప్రశంసిస్తోందని సుబ్బారెడ్డి చెప్పారు. నీతి ఆయోగ్ సమావేశంలో కూడా వాలంటీర్లను ప్రశంసించారని గుర్తు చేశారు. ఈ వ్యవస్థను ప్రధాని మోడీ కూడా కొనియాడారని అన్నారు. కరోనా టైంలో ప్రాణాలు అడ్డుపెట్టి మరీ ప్రజలకు వాలంటీర్లు సేవలందించారని చెప్పారు. చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే వాలంటీర్లపై, జగన్ పై పవన్ విమర్శలు గుప్పిస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో జన్మభూమి కమిటీలు ఉండేవని, వాటి దోపిడీకి తట్టుకోలేక ప్రజలు వైసీపీకి ఓటేశారని అన్నారు. దమ్ముంటే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని పవన్, చంద్రబాబు ప్రకటించాలని ఛాలెంజ్ చేశారు.

మరోవైపు, పవన్ వ్యాఖ్యలపై మంత్రి దాడిశెట్టి రాజా మండిపడ్డారు. జగన్ పై అసూయతో పవన్ మాట్లాడిన ఉపన్యాసాలపై ప్రజలు హర్షించరని అన్నారు. మైక్ చేతిలో ఉందని నోటికొచ్చినట్టు పిచ్చిగా మాట్లాడడం తప్పని, అది తప్ప పవన్ కు రాష్ట్రం గురించి, పాలన గురించి ఏం తెలుసని ఆయన ప్రశ్నించారు. రాబోయే ఎన్నికలే జనసేన, టీడీపీలకు ఆఖరి ఎన్నికలని జోస్యం చెప్పారు. ఈ రెండు పార్టీలను జనం సముద్రంలో కలిపేస్తారని ధీమా వ్యక్తం చేశారు. వైవీ సుబ్బారెడ్డి, దాడిశెట్టిల వ్యాఖ్యలపై పవన్ స్పందన ఏవిధంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

This post was last modified on July 17, 2023 8:25 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

1 hour ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago