రోజుకో లెక్క.. రెండు రోజులకో సర్వే.. ఎన్నికలకు ముందు ఇది సర్వత్రా కామన్. అలానే ఏపీలోనూ ఇలాంటి సర్వేలే వస్తున్నాయి. వీటిలో కొన్ని వాస్తవాలు కూడా కనిపిస్తున్నాయి. ఇలానే తాజాగా పట్టణాల్లో నిర్వహించి న మౌత్ ఒపీనియన్ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. వచ్చే ఎన్నికల్లో పట్టణాల్లో టీడీపీ పరిస్థితి ఏంటి? వైసీపీ పరిస్థితి ఏంటి? అనేది ఈ సర్వేల ప్రధాన సారాంశం.
ఈ క్రమంలో పట్టణ వోటు బ్యాంకు మొత్తం టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడ డం గమనార్హం. కూలి నుంచి ఉద్యోగస్తుల వరకు అందరిదీ సైకిల్ బాటేనన్నది ఈ సర్వేలు చెబుతున్న మాట. అంతేకాదు.. చంద్రబాబు వస్తేనే.. అంటూ మెజారిటీ ప్రజలు అనేక విషయాలు చెబుతున్నారట. ముఖ్యంగా రాజధానిని కోరుతున్నవారు పట్టణాల్లోనే ఎక్కువ గా ఉంటున్నారు. ఇదే విషయం సర్వేలోనూ స్పష్టమైంది.
విజయవాడలో వ్యాపారం అంతగా లేదు. ఏదైనా రాజధాని ఉంటే.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు అక్కడకు వస్తారు. లావాదేవీలు కూడా సాగుతాయి. కానీ మాకు రాజధాని లేదు. దీంతో ఇబ్బందులు పడుతున్నాం అని ప్రముఖ మార్కెట్ కాళేశ్వరరావు సూపర్ మార్కెట్ కు చెందిన వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఇక, విశాఖలో వెలుగు చూస్తున్న ఘటనల నేపథ్యంలో ఇక్కడి వారు కూడా ప్రశాంత జీవితం కోరుకుంటున్నారు.
అదేవిధంగా కర్నూలు, అనంతపురం, చిత్తూరు వంటి మెజారిటీ నగరాల్లోనూ టీడీపీ క్లీన్ స్వీప్ చేయడం తథ్యమనే వాదన బలంగా వినిపిస్తోంది. కట్ చేస్తే.. ఇది ఎంత వరకు నిజం అని డౌట్ రావొచ్చు. కానీ, అదేసమయంలో టీడీపీ అధినేత వేసిన వ్యూహాలను బట్టి ఇది నిజమనే నమ్మాలి. ఆయన పట్టణ ఓటు బ్యాంకు విషయంలో వస్తున్న సర్వేలను నమ్ముతున్నారు. నిర్ధారించుకున్నారు కూడా. అందుకే ఇప్పుడు పల్లె బాట పడుతున్నారు. సో.. మొత్తానికి టీడీపీ పట్టణ ఓటు బ్యాంకును స్వీప్ చేయడం ఖాయమని చెబుతున్నారు.
This post was last modified on July 16, 2023 5:41 pm
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…
రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…
అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…