రోజుకో లెక్క.. రెండు రోజులకో సర్వే.. ఎన్నికలకు ముందు ఇది సర్వత్రా కామన్. అలానే ఏపీలోనూ ఇలాంటి సర్వేలే వస్తున్నాయి. వీటిలో కొన్ని వాస్తవాలు కూడా కనిపిస్తున్నాయి. ఇలానే తాజాగా పట్టణాల్లో నిర్వహించి న మౌత్ ఒపీనియన్ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. వచ్చే ఎన్నికల్లో పట్టణాల్లో టీడీపీ పరిస్థితి ఏంటి? వైసీపీ పరిస్థితి ఏంటి? అనేది ఈ సర్వేల ప్రధాన సారాంశం.
ఈ క్రమంలో పట్టణ వోటు బ్యాంకు మొత్తం టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడ డం గమనార్హం. కూలి నుంచి ఉద్యోగస్తుల వరకు అందరిదీ సైకిల్ బాటేనన్నది ఈ సర్వేలు చెబుతున్న మాట. అంతేకాదు.. చంద్రబాబు వస్తేనే.. అంటూ మెజారిటీ ప్రజలు అనేక విషయాలు చెబుతున్నారట. ముఖ్యంగా రాజధానిని కోరుతున్నవారు పట్టణాల్లోనే ఎక్కువ గా ఉంటున్నారు. ఇదే విషయం సర్వేలోనూ స్పష్టమైంది.
విజయవాడలో వ్యాపారం అంతగా లేదు. ఏదైనా రాజధాని ఉంటే.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు అక్కడకు వస్తారు. లావాదేవీలు కూడా సాగుతాయి. కానీ మాకు రాజధాని లేదు. దీంతో ఇబ్బందులు పడుతున్నాం అని ప్రముఖ మార్కెట్ కాళేశ్వరరావు సూపర్ మార్కెట్ కు చెందిన వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఇక, విశాఖలో వెలుగు చూస్తున్న ఘటనల నేపథ్యంలో ఇక్కడి వారు కూడా ప్రశాంత జీవితం కోరుకుంటున్నారు.
అదేవిధంగా కర్నూలు, అనంతపురం, చిత్తూరు వంటి మెజారిటీ నగరాల్లోనూ టీడీపీ క్లీన్ స్వీప్ చేయడం తథ్యమనే వాదన బలంగా వినిపిస్తోంది. కట్ చేస్తే.. ఇది ఎంత వరకు నిజం అని డౌట్ రావొచ్చు. కానీ, అదేసమయంలో టీడీపీ అధినేత వేసిన వ్యూహాలను బట్టి ఇది నిజమనే నమ్మాలి. ఆయన పట్టణ ఓటు బ్యాంకు విషయంలో వస్తున్న సర్వేలను నమ్ముతున్నారు. నిర్ధారించుకున్నారు కూడా. అందుకే ఇప్పుడు పల్లె బాట పడుతున్నారు. సో.. మొత్తానికి టీడీపీ పట్టణ ఓటు బ్యాంకును స్వీప్ చేయడం ఖాయమని చెబుతున్నారు.
This post was last modified on July 16, 2023 5:41 pm
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు.. సత్తా చాటుకున్నారు. సాధారణ అభివృద్ధి పనులతో పాటు.. ఎవరూ ఊహించని…
నిన్న విడుదలైన బైకర్ కు పబ్లిక్ టాక్, రివ్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. సినిమా చూస్తే నిరాశపడరనే అభిప్రాయం అధిక…
నిన్న విడుదలైన రాకాస, బైకర్ రెండు సినిమాలకు నెగటివ్ రెస్పాన్స్ రాలేదు. అత్యద్భుతంగా ఉన్నాయని కాదు కానీ ఒకసారి చూడొచ్చనే…
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఉన్న రాయపాటి శైలజ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? అంటే…
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…