విశ్వాసం ఉండొచ్చు.. కానీ అతి విశ్వాసం.. ఎవరికీ ఉండకూడదు. వ్యక్తులైనా.. పార్టీలైనా.. అతి విశ్వాసానికి పోయి.. చేతులు కాల్చుకున్న పరిస్థితి కళ్ల ముందే కనిపిస్తోంది. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో తమదే గెలుపని బీజేపీ పెద్దలు రాసి పెట్టుకున్నారు. క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు నాయకులు అందరూ కర్ణాటకలో కమలం వికసిస్తుందని లెక్కలు వేసుకున్నారు. దీంతో ఎడా పెడా.. అనేక విమర్శలు.. కామెంట్లు కూడా చేశారు.
కానీ, కర్నాటకలో పరిస్థితి తిరగబడింది. కట్ చేస్తే.. ఏపీ విషయంలోనూ.. అధికార పార్టీ నాయకులు.. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని అంచనా వేయడం ఏమో కానీ.. అతి విశ్వాసానికిపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. గెలుపు అధికారం అనే విషయాలను పక్కన పెడితే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను వారు మరీ తక్కువ అంచనా వేసేస్తున్నారు. తాజాగా మంత్రి జోగి రమేష్ వంటి వారు హద్దులు దాటేసి.. పవన్పై వలంటీర్ను నిలబెట్టినా.. ఓడిపోతారంటూ కామెంట్ చేశారు.
అంటే.. పవన్ స్థాయి వలంటీర్ కన్నా తక్కువగానే ఉందని బహుశ వైసీపీ అంచనా వేస్తుండవచ్చు. కానీ, ఇది అతి విశ్వాసం అవుతుందే తప్ప.. విశ్వాసం మాత్రం కాదనే లెక్కలు వెలుగు చూస్తున్నాయి. వలంటీర్ వ్యవస్థపై ఎంత నమ్మకం ఉన్నా.. పవన్ వంటి బలమైన అభిమాన గణం ఉన్న నాయకుడిని వదులుకునేందుకు ఈ సారి ప్రజలు సిద్ధంగా లేరనే వాస్తవాన్ని మాత్రం ఆయన గ్రహించలేక పోతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది.
తాము గెలుస్తామనేది ధీమా.. విశ్వాసం.. కానీ, ఎదుటి వారు ఓడిపోతారనడం అతి అవుతుంది. ఇదే ఇప్పుడు వైసీపీని పలుచన చేస్తోందని అంటున్నారు. ఇప్పటి వరకు పవన్ విషయంలో ప్రజల ఆలోచనా సరళి ఎలా ఉన్నా.. మంత్రిజోగి చేసిన వలంటీర్వ్యాఖ్య తర్వాత.. పవన్ను ఇంత చిన్నగా అంచనా వేస్తారా? మేమేంటో చూపిస్తాం.. అంటూ.. జనసైనికులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది పంతాల వరకు వెళ్తే.. పవన్ గెలుపును ఆపడం వైసీపీకి సాధ్యం కాదు. ఏదేమైనా.. విశ్వాసం ఉండొచ్చు.. కానీ, అతి విశ్వాసం.. మాత్రం సరికాదని పరిశీలకులు హితవు పలుకుతున్నారు.
This post was last modified on July 16, 2023 5:40 pm
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై.. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు భగ్గుమన్నారు. పవన్ కల్యాణ్ కాదు.. దిష్టి…
ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రస్తుతం సీబీఐ విచారణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్ను కూడా నెల్లూరు…
డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…
వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…