విశ్వాసం ఉండొచ్చు.. కానీ అతి విశ్వాసం.. ఎవరికీ ఉండకూడదు. వ్యక్తులైనా.. పార్టీలైనా.. అతి విశ్వాసానికి పోయి.. చేతులు కాల్చుకున్న పరిస్థితి కళ్ల ముందే కనిపిస్తోంది. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో తమదే గెలుపని బీజేపీ పెద్దలు రాసి పెట్టుకున్నారు. క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు నాయకులు అందరూ కర్ణాటకలో కమలం వికసిస్తుందని లెక్కలు వేసుకున్నారు. దీంతో ఎడా పెడా.. అనేక విమర్శలు.. కామెంట్లు కూడా చేశారు.
కానీ, కర్నాటకలో పరిస్థితి తిరగబడింది. కట్ చేస్తే.. ఏపీ విషయంలోనూ.. అధికార పార్టీ నాయకులు.. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని అంచనా వేయడం ఏమో కానీ.. అతి విశ్వాసానికిపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. గెలుపు అధికారం అనే విషయాలను పక్కన పెడితే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను వారు మరీ తక్కువ అంచనా వేసేస్తున్నారు. తాజాగా మంత్రి జోగి రమేష్ వంటి వారు హద్దులు దాటేసి.. పవన్పై వలంటీర్ను నిలబెట్టినా.. ఓడిపోతారంటూ కామెంట్ చేశారు.
అంటే.. పవన్ స్థాయి వలంటీర్ కన్నా తక్కువగానే ఉందని బహుశ వైసీపీ అంచనా వేస్తుండవచ్చు. కానీ, ఇది అతి విశ్వాసం అవుతుందే తప్ప.. విశ్వాసం మాత్రం కాదనే లెక్కలు వెలుగు చూస్తున్నాయి. వలంటీర్ వ్యవస్థపై ఎంత నమ్మకం ఉన్నా.. పవన్ వంటి బలమైన అభిమాన గణం ఉన్న నాయకుడిని వదులుకునేందుకు ఈ సారి ప్రజలు సిద్ధంగా లేరనే వాస్తవాన్ని మాత్రం ఆయన గ్రహించలేక పోతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది.
తాము గెలుస్తామనేది ధీమా.. విశ్వాసం.. కానీ, ఎదుటి వారు ఓడిపోతారనడం అతి అవుతుంది. ఇదే ఇప్పుడు వైసీపీని పలుచన చేస్తోందని అంటున్నారు. ఇప్పటి వరకు పవన్ విషయంలో ప్రజల ఆలోచనా సరళి ఎలా ఉన్నా.. మంత్రిజోగి చేసిన వలంటీర్వ్యాఖ్య తర్వాత.. పవన్ను ఇంత చిన్నగా అంచనా వేస్తారా? మేమేంటో చూపిస్తాం.. అంటూ.. జనసైనికులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది పంతాల వరకు వెళ్తే.. పవన్ గెలుపును ఆపడం వైసీపీకి సాధ్యం కాదు. ఏదేమైనా.. విశ్వాసం ఉండొచ్చు.. కానీ, అతి విశ్వాసం.. మాత్రం సరికాదని పరిశీలకులు హితవు పలుకుతున్నారు.
This post was last modified on July 16, 2023 5:40 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…
ఏపీకి పొరుగునే ఉన్న తమిళనాడులో ఇప్పుడు ఇదే తరహా రాజకీయాలు కూడా కనిపిస్తున్నాయి. పార్టీలు లెక్కకు మిక్కిలిగా ఉన్నా.. నాయకులు…