విశ్వాసం ఉండొచ్చు.. కానీ అతి విశ్వాసం.. ఎవరికీ ఉండకూడదు. వ్యక్తులైనా.. పార్టీలైనా.. అతి విశ్వాసానికి పోయి.. చేతులు కాల్చుకున్న పరిస్థితి కళ్ల ముందే కనిపిస్తోంది. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో తమదే గెలుపని బీజేపీ పెద్దలు రాసి పెట్టుకున్నారు. క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు నాయకులు అందరూ కర్ణాటకలో కమలం వికసిస్తుందని లెక్కలు వేసుకున్నారు. దీంతో ఎడా పెడా.. అనేక విమర్శలు.. కామెంట్లు కూడా చేశారు.
కానీ, కర్నాటకలో పరిస్థితి తిరగబడింది. కట్ చేస్తే.. ఏపీ విషయంలోనూ.. అధికార పార్టీ నాయకులు.. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని అంచనా వేయడం ఏమో కానీ.. అతి విశ్వాసానికిపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. గెలుపు అధికారం అనే విషయాలను పక్కన పెడితే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను వారు మరీ తక్కువ అంచనా వేసేస్తున్నారు. తాజాగా మంత్రి జోగి రమేష్ వంటి వారు హద్దులు దాటేసి.. పవన్పై వలంటీర్ను నిలబెట్టినా.. ఓడిపోతారంటూ కామెంట్ చేశారు.
అంటే.. పవన్ స్థాయి వలంటీర్ కన్నా తక్కువగానే ఉందని బహుశ వైసీపీ అంచనా వేస్తుండవచ్చు. కానీ, ఇది అతి విశ్వాసం అవుతుందే తప్ప.. విశ్వాసం మాత్రం కాదనే లెక్కలు వెలుగు చూస్తున్నాయి. వలంటీర్ వ్యవస్థపై ఎంత నమ్మకం ఉన్నా.. పవన్ వంటి బలమైన అభిమాన గణం ఉన్న నాయకుడిని వదులుకునేందుకు ఈ సారి ప్రజలు సిద్ధంగా లేరనే వాస్తవాన్ని మాత్రం ఆయన గ్రహించలేక పోతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది.
తాము గెలుస్తామనేది ధీమా.. విశ్వాసం.. కానీ, ఎదుటి వారు ఓడిపోతారనడం అతి అవుతుంది. ఇదే ఇప్పుడు వైసీపీని పలుచన చేస్తోందని అంటున్నారు. ఇప్పటి వరకు పవన్ విషయంలో ప్రజల ఆలోచనా సరళి ఎలా ఉన్నా.. మంత్రిజోగి చేసిన వలంటీర్వ్యాఖ్య తర్వాత.. పవన్ను ఇంత చిన్నగా అంచనా వేస్తారా? మేమేంటో చూపిస్తాం.. అంటూ.. జనసైనికులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది పంతాల వరకు వెళ్తే.. పవన్ గెలుపును ఆపడం వైసీపీకి సాధ్యం కాదు. ఏదేమైనా.. విశ్వాసం ఉండొచ్చు.. కానీ, అతి విశ్వాసం.. మాత్రం సరికాదని పరిశీలకులు హితవు పలుకుతున్నారు.
This post was last modified on July 16, 2023 5:40 pm
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…