ఇకపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఎవరైనా కలవాలంటే కచ్చితంగా పాస్ ఉండాల్సిందే. పవన్ను కలవాలంటే అందరికీ అని కాదు పార్టీలోని నేతలకు మాత్రమే. ఎందుకంటే పవన్ను కలవాలని అనుకుంటున్న ముఖ్యనేతలకు అభిమానుల తాకిడి విపరీతంగా పెరిగిపోతోందట. దాంతో నేతలు పవన్ను కలవటం గగనమైపోతోంది. అందుకనే కొత్తగా పాస్ విధానాన్ని తెచ్చారు. తణుకులో జరిగిన పార్టీ నేతల సమావేశంలో కూడా వీరమహిళలకు ఇలాంటి పాస్ లను ముందుగానే జారీచేశారు.
పాస్ లను చూపించిన వీరమహిళలను మాత్రమే పవన్ తో భేటీకి భద్రతాసిబ్బంది అనుమతించిందట. ఇంతకీ విషయం ఏమిటంటే సినీ హీరోల్లో పవన్ కు మాత్రమే విపరీతమైన ఫ్యాన్ బేసుంది. పవన్ ఎక్కడ నిలబడినా చాలు పవన్ వచ్చారని తెలిస్తే చాలు అభిమానులు విపరీతంగా చేరిపోతారు. దానికితోడు రాజకీయాల్లో కూడా ప్రవేశించటంతో పవన్ రెగ్యులర్ గా జనాల్లో తిరగక తప్పటంలేదు. ఇపుడు వారాహియాత్రతో పశ్చిమగోదావరిలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
వారాహియాత్ర పేరుతో తమ దగ్గరకు వస్తున్నారు కాబట్టి పవన్ను చూడటానికి అభిమానులు విపరీతంగా పోటెత్తుతున్నారు. ఈ సమయంలో ఎక్కడిక్కడ నేతలతో సమీక్షా సమావేశాలు పెట్టుకోవాలంటే పవన్ కు కష్టంగా ఉంది. సమీక్ష జరిగే కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్ళ చుట్టూ అభిమానులే ఉంటున్నారు. దాంతో లోపలకి రావాలని అనుకుంటున్న నేతలు రాలేకపోతున్నారు. దీంతో ఏమిచేయాలో మొదట్లో పార్టీ బాధ్యులకు అర్ధంకాలేదు. అందుకనే చివరకు పాసుల విదానాన్ని ప్రవేశపెట్టారు.
అయితే పాసులను కూడా డూప్లికేట్ చేసేసి లెక్కకు మించినంత జనాల్లో లోపలకు వచ్చేస్తున్నారట. అందుకనే డూప్లికేట్ కు అవకాశంలేని పద్దతిలో కొత్త పాసులను రెడీచేశారట. రూపాయి నోట డిజైన్లో ఉండే పాస్ లను రెడీ చేవశారట. దీన్ని డూప్లికేట్ చేయటం సాధ్యంకాదని పార్టీ ముఖ్యులు అనుకుంటున్నారట. తణుకులో జరిగిన వీరమహిళల సమావేశంలో ఇలాంటి పాసులను తనిఖీ చేసిన తర్వాతే లోపలకు అనుమతించారట. అంటే పవన్ సమావేశాలకు ఎవరిని అనుమతించాలన్నది ముందుగానే డిసైడ్ చేసి వాళ్ళకి మాత్రమే ఈ పాసులను అందిస్తున్నారు. పాస్ లను చూపించిన వాళ్ళని మాత్రమే సెక్యూరిటి లోపలకు అనుమతిస్తున్నారు. మొత్తానికి పవన్ దర్శనం కావాలంటే పాస్ తప్పనిసరి అయిపోయింది.
This post was last modified on July 15, 2023 2:21 pm
వీరాధివీరులు టైటిల్ అధికారికంగా ప్రకటించకపోయినా రవితేజ - శ్రీవిష్ణు మల్టీస్టారర్ కు ఆ పేరు దాదాపు కన్ఫర్మే. రిజిస్టర్ చేశారట…
తెలుగులో అత్యంత ఆదరణ దక్కించుకున్న టీవీ షోల్లో ‘బిగ్ బాస్’ ఒకటి. దీని ద్వారా ఎంతోమంది సాధారణ ప్రజలు సెలబ్రెటీలుగా…
ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటుంటారు. కానీ ఐశ్వర్య రాజేష్ మాత్రం రచ్చ గెలిచి ఇంటికి వచ్చింది. ఆమె అచ్చ…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు హైదరాబాద్ శివార్లలో ఉన్న ఫామ్ హౌస్ గురించి ఈ మధ్య…
దర్శక ధీరుడు రాజమౌళి కెరీర్ను మలుపు తిప్పిన చిత్రం.. సింహాద్రి. ఆయనకు అది రెండో సినిమానే. కానీ ఏకంగా ఇండస్ట్రీ…
నీట్ పేపర్ లీక్ ఇష్యూపై ప్రధాని నరేంద్ర మోదీ ఎట్టకేలకు రియాక్ట్ అయ్యారు. ఎగ్జామ్స్ పారదర్శకంగా జరగడం దేశ బాధ్యత…