Political News

‘ఓటర్ల జాబితాలో వాలంటీర్ల జోక్యం వద్దు’

ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు పెను దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే, అసలు ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ అవసరం లేదని, పంచాయతీ వ్యవస్థ ఉండగా వాలంటీర్లతో ఏం పని అని పవన్ ప్రశ్నిస్తున్నారు. ప్రజల నుంచి వాలంటీర్లు సేకరించిన సున్నితమైన సమాచారం సంఘ విద్రోహ శక్తులకు చేరుతుందని, ఈ డేటా అంతా హైదరాబాదులోని నానక్ రామ్ గూడలో ఉన్నాయని షాకింగ్ ఆరోపణలు చేశారు. 5 వేలిచ్చి వాలంటీర్లను ఇళ్లలోకి దూరనిచ్చారని ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా వాలంటీర్లపై కాపు నేత, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఓటర్ల జాబితా కూర్పులో వాలంటీర్ల జోక్యం లేకుండా జనసైనికులకు చూసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. జనసైనికులకు లేఖ పేరుతో ఆయన రాసిన లేఖ సంచలనం రేపుతోంది. ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లను ఉపయోగించకూడదని ఎన్నికల అధికారి చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఈ క్రమంలోనే జూలై 21 నుండి అర్హులైన కొత్త ఓటర్లను ఓటర్లు జాబితాలో చేర్చుకోవడం, తొలగింపు ప్రారంభమైందని ఆ ప్రక్రియలో వాలంటీర్లు పాల్గొనకుండా జనసేన కార్యకర్తలు పర్యవేక్షించాలని ఆయన పిలుపునిచ్చారు

ఈ ప్రక్రియలో వాలంటీర్లు పాల్గొంటే వైసీపీకి అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉందని, ప్రతిపక్షాలకు అనుకూల ఓట్లను తొలగించే ఛాన్స్ ఉందని ఆయన చెప్పారు. రావణ రాజ్యం పోవాలన్న రామరాజ్యం రావాలన్న జగన్ పోవాలని పవన్ రావాలని పిలుపునిచ్చారు. గతంలో కూడా పవన్ పై ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలను హరి రామ జోగయ్య ఖండించిన సంగతి తెలిసిందే. ఈ లేఖపై వైసీపీ నేతల స్పందన ఏవిధంగా ఉంటుందనన్నది ఆసక్తికరంగా మారింది.

This post was last modified on July 15, 2023 12:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కర్ణుడిగా సూర్య… తీరని కలేనా?

చారిత్రక నేపథ్యం ఉన్న కథలను, భారీ బడ్జెట్లలో, పాన్ ఇండియా స్థాయిలో తీసే ధైర్యం దర్శక నిర్మాతల్లో పెంచిన ఘనత…

31 minutes ago

త్రివిక్రమ్ స్టయిల్లో వెంకీ అట్లూరి

సినిమాలకు టైటిళ్లు పెట్టడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైలే వేరు. స్టార్ హీరోల సినిమాలకు సైతం, క్లాస్‌గా, కొంచెం పొయెటిగ్గా, ఫ్యామిలీ…

2 hours ago

చిరు సినిమా… చేతులు మారుతుందా?

సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. దీనికి తోడు చరణ్‌కు…

3 hours ago

ల‌డ్డూ ఎఫెక్ట్‌: టీటీడీ ఈవో సింఘాల్‌పై చ‌ర్య‌లు

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగం వ్య‌వ‌హారం.. కీల‌క మ‌లుపు తిరిగింది. ఈ క‌ల్తీ వ్య‌వ‌హారంపై విచార‌ణ…

3 hours ago

బ‌డ్జెట్ స‌మావేశాల‌ కోసం అసెంబ్లీకి జ‌గ‌న్‌.. ?

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిసింది. పార్టీ వ‌ర్గాలతో చ‌ర్చ‌లు జ‌రిపిన ఆయ‌న‌..…

6 hours ago

ఫ్యాన్స్ సంతోషం సరే… ఇది తప్పు కదా?

మెగాస్టార్ చిరంజీవి ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న, ఎంతగానో కోరుకున్న సందర్భం రానే వచ్చింది. ఆయనకు మనవడు పుట్టాడు. చిరంజీవి కుటుంబంలో…

6 hours ago