Political News

‘ఓటర్ల జాబితాలో వాలంటీర్ల జోక్యం వద్దు’

ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు పెను దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే, అసలు ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ అవసరం లేదని, పంచాయతీ వ్యవస్థ ఉండగా వాలంటీర్లతో ఏం పని అని పవన్ ప్రశ్నిస్తున్నారు. ప్రజల నుంచి వాలంటీర్లు సేకరించిన సున్నితమైన సమాచారం సంఘ విద్రోహ శక్తులకు చేరుతుందని, ఈ డేటా అంతా హైదరాబాదులోని నానక్ రామ్ గూడలో ఉన్నాయని షాకింగ్ ఆరోపణలు చేశారు. 5 వేలిచ్చి వాలంటీర్లను ఇళ్లలోకి దూరనిచ్చారని ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా వాలంటీర్లపై కాపు నేత, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఓటర్ల జాబితా కూర్పులో వాలంటీర్ల జోక్యం లేకుండా జనసైనికులకు చూసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. జనసైనికులకు లేఖ పేరుతో ఆయన రాసిన లేఖ సంచలనం రేపుతోంది. ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లను ఉపయోగించకూడదని ఎన్నికల అధికారి చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఈ క్రమంలోనే జూలై 21 నుండి అర్హులైన కొత్త ఓటర్లను ఓటర్లు జాబితాలో చేర్చుకోవడం, తొలగింపు ప్రారంభమైందని ఆ ప్రక్రియలో వాలంటీర్లు పాల్గొనకుండా జనసేన కార్యకర్తలు పర్యవేక్షించాలని ఆయన పిలుపునిచ్చారు

ఈ ప్రక్రియలో వాలంటీర్లు పాల్గొంటే వైసీపీకి అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉందని, ప్రతిపక్షాలకు అనుకూల ఓట్లను తొలగించే ఛాన్స్ ఉందని ఆయన చెప్పారు. రావణ రాజ్యం పోవాలన్న రామరాజ్యం రావాలన్న జగన్ పోవాలని పవన్ రావాలని పిలుపునిచ్చారు. గతంలో కూడా పవన్ పై ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలను హరి రామ జోగయ్య ఖండించిన సంగతి తెలిసిందే. ఈ లేఖపై వైసీపీ నేతల స్పందన ఏవిధంగా ఉంటుందనన్నది ఆసక్తికరంగా మారింది.

This post was last modified on July 15, 2023 12:58 pm

Share

Recent Posts

రోలెక్స్… ఏమో తెలియదన్న సూర్య

లోకనాయకుడు కమల్ హాసన్ పనైపోయిందనుకున్న సమయంలో ఆయన అదిరిపోయే కమ్ బ్యాక్‌‌ ఇచ్చిన సినిమా.. విక్రమ్. ఆ సినిమాతోనే సౌత్…

18 minutes ago

మాజీ ముఖ్యమంత్రి తనయుడు అరెస్టు… అక్కడ పొలిటికల్ హీట్!

తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…

48 minutes ago

ఆ వైరస్ యమ డేంజర్… ఇప్పటికే 22 మంది పిల్లలు మృతి

గుజరాత్‌లో చాందిపుర వైరస్‌ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్‌ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…

1 hour ago

సినిమా చూడాలంటే మ‌నోళ్ల త‌ర్వాతే ఎవ‌రైనా…

సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వ‌రైనా ఒప్పుకోవాల్సిందే. త‌మ సినిమాల‌ను ప్ర‌మోట్ చేయ‌డం కోసం తెలుగు రాష్ట్రాల‌కు…

1 hour ago

సూపర్ స్టార్ కూతురు ఎలా చేసింది

మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…

3 hours ago

పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…

6 hours ago