ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో మొదట్లో ఆరోపణలు ఎదుర్కొన్న కడప ఎంపీ, సీఎం జగన్ స్వయంగా తన సోదరుడు అని చెప్పుకొన్న అవినాష్రెడ్డి ఇప్పుడు నిందితుడిగా మారిన విషయం తెలిసిందే. ఈ హత్యను విచారిస్తున్న సీబీఐ అధికారులు మొదట్లో ఆయనను సాక్షిగా పేర్కొన్నారు. అయితే.. తర్వాత కాలంలో దస్తగిరి సహా ఇతర నిందితులను విచారించిన తర్వాత అనూహ్యంగా అవినాష్రెడ్డిని కూడా నిందితుడిగా పేర్కొన్నారు.
ఇప్పటి వరకు ఈ దారుణ హత్య కేసులో ఎనిమిది మందిని ప్రధాన నిందితులుగా సీబీఐ పేర్కొనగా వీరిలో ఏ-8 అవినాష్ రెడ్డి కావడం గమనార్హం. ఇక, ఈ కేసు విచారణలో భాగంగా.. తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ తెచ్చుకున్న అవినాష్ రెడ్డి.. విధిగా ప్రతి శనివారం సీబీఐ విచారణకు మాత్రం హాజరవుతున్నారు. ఈ విచారణ కొనసాగుతోంది. అయితే.. ఇప్పుడు ఉరుములు లేని పిడుగుల మాదిరిగా సీబీఐ కోర్టు నుంచి అవినాష్రెడ్డికి పిలుపు వచ్చింది. విచారణ సరే.. ముందు కోర్టుకు రండి! అని సీబీఐ న్యాయస్థానం ఆయనకు సమన్లు పంపించింది.
తాజాగా జారీ చేసిన సమన్లలో వచ్చే నెల(ఆగస్టు) 14న కోర్టుకు స్వయంగా హాజరు కావాలని అవినాష్ను ఆదేశించింది. అంతేకాదు.. ఆ రోజు ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకోవద్దని.. ఎలాంటి పనులు చేయొద్దని.. తప్పని సరిగా కోర్టుకు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది. దీనికి ముందు కేసును విచారిస్తున్న సీబీఐ.. వివేకా హత్యకు సంబంధించి అడిషినల్ చార్జి షీటును కోర్టులో సమర్పించింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. అవినాష్రెడ్డికి సమన్లు జారీ చేయడంతోపాటు.. ఆ రోజు ఎలాంటి కారణాలు చెప్పకుండా.. కోర్టుకు రావాలని ఆదేశించడం గమనార్హం.
బాలీవుడ్లో దీపికా పదుకొనే, ఆలియా భట్ లాంటి హై ప్రొఫైల్ హీరోయిన్ల పోటీని తట్టుకుని చాలా ఏళ్లుగా టాప్లో కొనసాగుతున్న…
జింబాబ్వే పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్లదే ఆధిపత్యం నడుస్తోంది. కుర్రాడు వైభవ్ సూర్యవంశీతో…
ఇటీవలే విడుదలైన నాగబంధంకు అంత ఓపెనింగ్స్ వస్తాయని ఊహించినవాళ్లు చాలా తక్కువ. ఎంత విజువల్ ఎఫెక్ట్స్ తో తీసిన సినిమా…
రెండు సంవత్సరాలకు పైగా మోక్షం కోసం ఎదురు చూస్తున్న విశ్వంభర విడుదలకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే ఆలస్యం వల్ల హైప్…
కాపు నాయకుడు, మాజీ ఎమ్మెల్యే.. దివంగత వంగవీటి మోహన్రంగా కుమార్తె ఆశాలత త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చు కోనున్నారా?…
ఫుట్బాల్ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు శాసించిన క్రిస్టియానో రొనాల్డో శకం కన్నీటితో ముగిసింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ ప్రీ…