ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో మొదట్లో ఆరోపణలు ఎదుర్కొన్న కడప ఎంపీ, సీఎం జగన్ స్వయంగా తన సోదరుడు అని చెప్పుకొన్న అవినాష్రెడ్డి ఇప్పుడు నిందితుడిగా మారిన విషయం తెలిసిందే. ఈ హత్యను విచారిస్తున్న సీబీఐ అధికారులు మొదట్లో ఆయనను సాక్షిగా పేర్కొన్నారు. అయితే.. తర్వాత కాలంలో దస్తగిరి సహా ఇతర నిందితులను విచారించిన తర్వాత అనూహ్యంగా అవినాష్రెడ్డిని కూడా నిందితుడిగా పేర్కొన్నారు.
ఇప్పటి వరకు ఈ దారుణ హత్య కేసులో ఎనిమిది మందిని ప్రధాన నిందితులుగా సీబీఐ పేర్కొనగా వీరిలో ఏ-8 అవినాష్ రెడ్డి కావడం గమనార్హం. ఇక, ఈ కేసు విచారణలో భాగంగా.. తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ తెచ్చుకున్న అవినాష్ రెడ్డి.. విధిగా ప్రతి శనివారం సీబీఐ విచారణకు మాత్రం హాజరవుతున్నారు. ఈ విచారణ కొనసాగుతోంది. అయితే.. ఇప్పుడు ఉరుములు లేని పిడుగుల మాదిరిగా సీబీఐ కోర్టు నుంచి అవినాష్రెడ్డికి పిలుపు వచ్చింది. విచారణ సరే.. ముందు కోర్టుకు రండి! అని సీబీఐ న్యాయస్థానం ఆయనకు సమన్లు పంపించింది.
తాజాగా జారీ చేసిన సమన్లలో వచ్చే నెల(ఆగస్టు) 14న కోర్టుకు స్వయంగా హాజరు కావాలని అవినాష్ను ఆదేశించింది. అంతేకాదు.. ఆ రోజు ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకోవద్దని.. ఎలాంటి పనులు చేయొద్దని.. తప్పని సరిగా కోర్టుకు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది. దీనికి ముందు కేసును విచారిస్తున్న సీబీఐ.. వివేకా హత్యకు సంబంధించి అడిషినల్ చార్జి షీటును కోర్టులో సమర్పించింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. అవినాష్రెడ్డికి సమన్లు జారీ చేయడంతోపాటు.. ఆ రోజు ఎలాంటి కారణాలు చెప్పకుండా.. కోర్టుకు రావాలని ఆదేశించడం గమనార్హం.
This post was last modified on July 14, 2023 9:00 pm
టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల జీతాల్లో కోత పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏటా ఆటగాళ్లకు…
జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా డెవిల్ ఇవాళ భారీ హడావిడి మధ్య కర్ణాటకలో విడుదలయ్యింది.…
వైసీపీ అధినేత జగన్కు భారీ దెబ్బ తగిలింది. ఇప్పటి వరకు పల్నాడు రాజకీయాల్లో ఏక ఛత్రాధిపత్యంగా చక్రం తిప్పిన పిన్నెల్లి…
ఇండిగో ఎయిర్లైన్స్ ఎట్టకేలకు దిగొచ్చింది. ప్రయాణికుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక 'డ్యామేజ్ కంట్రోల్' చర్యలు మొదలుపెట్టింది. డిసెంబర్…
బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ముగిసింది. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఎన్నికల…