Political News

విచార‌ణ స‌రే, కోర్టుకు రండి..

ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న‌, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కేసు మ‌రో కీల‌క మ‌లుపు తిరిగింది. ఈ కేసులో మొద‌ట్లో ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న క‌డ‌ప ఎంపీ, సీఎం జ‌గ‌న్ స్వ‌యంగా త‌న సోద‌రుడు అని చెప్పుకొన్న అవినాష్‌రెడ్డి ఇప్పుడు నిందితుడిగా మారిన విష‌యం తెలిసిందే. ఈ హ‌త్య‌ను విచారిస్తున్న సీబీఐ అధికారులు మొద‌ట్లో ఆయ‌న‌ను సాక్షిగా పేర్కొన్నారు. అయితే.. త‌ర్వాత కాలంలో ద‌స్త‌గిరి స‌హా ఇతర నిందితుల‌ను విచారించిన త‌ర్వాత అనూహ్యంగా అవినాష్‌రెడ్డిని కూడా నిందితుడిగా పేర్కొన్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఈ దారుణ హ‌త్య కేసులో ఎనిమిది మందిని ప్ర‌ధాన నిందితులుగా సీబీఐ పేర్కొనగా వీరిలో ఏ-8 అవినాష్ రెడ్డి కావ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ఈ కేసు విచార‌ణ‌లో భాగంగా.. త‌న‌ను అరెస్టు చేయ‌కుండా ముంద‌స్తు బెయిల్ తెచ్చుకున్న అవినాష్ రెడ్డి.. విధిగా ప్ర‌తి శ‌నివారం సీబీఐ విచార‌ణ‌కు మాత్రం హాజ‌ర‌వుతున్నారు. ఈ విచార‌ణ కొన‌సాగుతోంది. అయితే.. ఇప్పుడు ఉరుములు లేని పిడుగుల మాదిరిగా సీబీఐ కోర్టు నుంచి అవినాష్‌రెడ్డికి పిలుపు వ‌చ్చింది. విచార‌ణ స‌రే.. ముందు కోర్టుకు రండి! అని సీబీఐ న్యాయ‌స్థానం ఆయ‌న‌కు స‌మ‌న్లు పంపించింది.

తాజాగా జారీ చేసిన స‌మ‌న్ల‌లో వ‌చ్చే నెల‌(ఆగ‌స్టు) 14న కోర్టుకు స్వ‌యంగా హాజ‌రు కావాల‌ని అవినాష్‌ను ఆదేశించింది. అంతేకాదు.. ఆ రోజు ఎలాంటి కార్య‌క్ర‌మాలు పెట్టుకోవ‌ద్ద‌ని.. ఎలాంటి ప‌నులు చేయొద్ద‌ని.. త‌ప్ప‌ని స‌రిగా కోర్టుకు హాజ‌రు కావాల్సిందేన‌ని తేల్చి చెప్పింది. దీనికి ముందు కేసును విచారిస్తున్న సీబీఐ.. వివేకా హ‌త్య‌కు సంబంధించి అడిషిన‌ల్ చార్జి షీటును కోర్టులో స‌మ‌ర్పించింది. దీనిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న న్యాయ‌మూర్తి.. అవినాష్‌రెడ్డికి స‌మ‌న్లు జారీ చేయ‌డంతోపాటు.. ఆ రోజు ఎలాంటి కార‌ణాలు చెప్ప‌కుండా.. కోర్టుకు రావాల‌ని ఆదేశించ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on July 14, 2023 9:00 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

తేనెతుట్టెను గెలుకుతున్న రేవంత్ !

లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే తెలంగాణలో ఉన్న 33 జిల్లాలను 17 జిల్లాలకు కుదిస్తారని వస్తున్న వార్తలు…

22 mins ago

సేఫ్ గేమ్ ఆడుతున్న ఆర్ఆర్ఆర్ నిర్మాత

ఇండస్ట్రీలో సుదీర్ఘ అనుభవంతో ఎన్నో బ్లాక్ బస్టర్లు చూసిన డివివి దానయ్య సగటు మాములు ప్రేక్షకుడికి బాగా దగ్గరయ్యింది మాత్రం…

1 hour ago

మాజీ ప్ర‌ధాని మ‌న‌వ‌డి కోసం… బ్లూ కార్నర్ నోటీసు!

భార‌త దేశ చ‌రిత్ర‌లో ఇదోక అనూహ్య‌మైన.. అస‌హ్యించుకునే ఘ‌ట‌న‌. ఈ దేశాన్ని పాలించి, రైతుల మ‌న్న‌న‌లు, మ‌హిళ‌ల మ‌న్న‌న‌లు పొందిన…

1 hour ago

జ‌గ‌న్.. నీరో : జేడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీ సీఎం జ‌గ‌న్‌.. నీరో చ‌క్ర‌వ‌ర్తిని త‌ల‌పిస్తున్నారంటూ.. సీబీఐ మాజీ డైరెక్ట‌ర్ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ సంచ ల‌న వ్యాఖ్య‌లు చేశారు.…

3 hours ago

ఐపీఎల్ ప్లే ఆఫ్స్ లో ఆర్సీబీ..కప్ కొడతారా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో అత్యంత దురదృష్టకరమైన జట్టు పేరు చెప్పమని అడిగితే…ఠపీమని ఆర్సీబీ పేరు చెప్పేస్తారు క్రికెట్…

3 hours ago

సతీసమేతంగా అమెరికాకు చంద్రబాబు

ఏపీలో ఎన్నికల పోరు ముగియడంతో ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. తమ కుటుంబ సభ్యులు,…

3 hours ago