భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలంతా చంద్రయాన్-3 ఎప్పుడెప్పుడు నింగికెరుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ిచంద్రయాన్-2 విఫలమైన నేపథ్యంలో ఈ ప్రయోగంపై ఇస్రో ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ క్రమంలోనే శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఈ మధ్యాహ్నం నింగికెగిసిన చంద్రయాన్-3 మాడ్యూల్ నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. చంద్రయాన్-3ని గగనానికి మోసుకెళ్లిన ఎల్వీమ్3-ఎం4 రాకెట్ అన్ని దశలు సాఫీగా పూర్తి చేసింది.
అనుకున్న సమయానికే చంద్రయాన్-3ని నిర్దేశిత కక్ష్యలోకి విడుదల చేసింది. ఎల్వీమ్3-ఎం4 రాకెట్ నుంచి చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యూల్ విజయవంతంగా విడిపోయింది. దాంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో సంబరాలు మిన్నంటాయి. తమ కృషి ఫలించినందుకు ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్.సోమనాథ్ హర్షం వ్యక్తం చేశారు. ఎల్వీఎమ్3-ఎం4 రాకెట్ చంద్రయాన్-3ని భూకక్ష్యలోకి చేర్చిందని వెల్లడించారు. ప్రపంచంలోనే ఏ దేశం కూడా చంద్రుడిపై ఉన్న దక్షిణ ధృవంపైకి శాటిలైట్ ని పంపలేదు. కానీ. ఆ ఘపత దక్కించుకున్న తొలిదేశంగా భారత్ అవతరించింది.
చంద్రయాన్-3 విజయవంతంగా చేర్చిందని, కక్ష్యను విస్తరించుకుంటూ చంద్రుడి కక్షలోకి ప్రవేశిస్తుందని ఆయన వెల్లడించారు. 40 రోజుల తర్వాత అంటే ఆగస్టు 23 నుంచి 24 తేదీలు మధ్యలో చంద్రుడిపై చంద్రయాన్ దిగుతుందని వెల్లడించారు. ఈ విజయం పట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలను మోడీ అభినందించారు. భారత అంతరిక్ష పరిశోధన రంగం చరిత్రలో ఇది సరికొత్త అధ్యాయం అని అన్నారు. ఈ విజయం భారతీయ శాస్త్రవేత్తల అంకితభావానికి, అకుంఠిత దీక్షకు నిదర్శనమని కొనియాడారు. శాస్త్రవేత్తల స్ఫూర్తికి, చాతుర్యానికి వందనం చేస్తున్నానని మోడీ తెలిపారు.
వైసీపీలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీసీఏ)ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో పరాజయం తర్వాత.. జగన్.. పీఏసీకి…
రెండు వారాల క్రితం రణ్వీర్ సింగ్ ని మూడేళ్ళ పాటు బ్యాన్ చేస్తున్నట్టు ఫెడరేషన్ అఫ్ వెస్ట్రన్ సినీ ఎంప్లొయీస్…
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధనం, బంగారం దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చిస్తున్న విషయం…
అతిలోకసుందరిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి. కాలం చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఆవిడ వేసిన…
అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించిన అనంతరం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక…
పవన్ వ్యాఖ్యలపై అందరూ మాట్లాడేశారు.. ఇక మిగిలింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంతే! రెండు రోజుల నుంచి తెలుగు…