భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలంతా చంద్రయాన్-3 ఎప్పుడెప్పుడు నింగికెరుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ిచంద్రయాన్-2 విఫలమైన నేపథ్యంలో ఈ ప్రయోగంపై ఇస్రో ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ క్రమంలోనే శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఈ మధ్యాహ్నం నింగికెగిసిన చంద్రయాన్-3 మాడ్యూల్ నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. చంద్రయాన్-3ని గగనానికి మోసుకెళ్లిన ఎల్వీమ్3-ఎం4 రాకెట్ అన్ని దశలు సాఫీగా పూర్తి చేసింది.
అనుకున్న సమయానికే చంద్రయాన్-3ని నిర్దేశిత కక్ష్యలోకి విడుదల చేసింది. ఎల్వీమ్3-ఎం4 రాకెట్ నుంచి చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యూల్ విజయవంతంగా విడిపోయింది. దాంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో సంబరాలు మిన్నంటాయి. తమ కృషి ఫలించినందుకు ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్.సోమనాథ్ హర్షం వ్యక్తం చేశారు. ఎల్వీఎమ్3-ఎం4 రాకెట్ చంద్రయాన్-3ని భూకక్ష్యలోకి చేర్చిందని వెల్లడించారు. ప్రపంచంలోనే ఏ దేశం కూడా చంద్రుడిపై ఉన్న దక్షిణ ధృవంపైకి శాటిలైట్ ని పంపలేదు. కానీ. ఆ ఘపత దక్కించుకున్న తొలిదేశంగా భారత్ అవతరించింది.
చంద్రయాన్-3 విజయవంతంగా చేర్చిందని, కక్ష్యను విస్తరించుకుంటూ చంద్రుడి కక్షలోకి ప్రవేశిస్తుందని ఆయన వెల్లడించారు. 40 రోజుల తర్వాత అంటే ఆగస్టు 23 నుంచి 24 తేదీలు మధ్యలో చంద్రుడిపై చంద్రయాన్ దిగుతుందని వెల్లడించారు. ఈ విజయం పట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలను మోడీ అభినందించారు. భారత అంతరిక్ష పరిశోధన రంగం చరిత్రలో ఇది సరికొత్త అధ్యాయం అని అన్నారు. ఈ విజయం భారతీయ శాస్త్రవేత్తల అంకితభావానికి, అకుంఠిత దీక్షకు నిదర్శనమని కొనియాడారు. శాస్త్రవేత్తల స్ఫూర్తికి, చాతుర్యానికి వందనం చేస్తున్నానని మోడీ తెలిపారు.
This post was last modified on July 14, 2023 8:08 pm
దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది. మొత్తం 6…
లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే తెలంగాణలో ఉన్న 33 జిల్లాలను 17 జిల్లాలకు కుదిస్తారని వస్తున్న వార్తలు…
ఇండస్ట్రీలో సుదీర్ఘ అనుభవంతో ఎన్నో బ్లాక్ బస్టర్లు చూసిన డివివి దానయ్య సగటు మాములు ప్రేక్షకుడికి బాగా దగ్గరయ్యింది మాత్రం…
భారత దేశ చరిత్రలో ఇదోక అనూహ్యమైన.. అసహ్యించుకునే ఘటన. ఈ దేశాన్ని పాలించి, రైతుల మన్ననలు, మహిళల మన్ననలు పొందిన…
ఏపీ సీఎం జగన్.. నీరో చక్రవర్తిని తలపిస్తున్నారంటూ.. సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ సంచ లన వ్యాఖ్యలు చేశారు.…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో అత్యంత దురదృష్టకరమైన జట్టు పేరు చెప్పమని అడిగితే…ఠపీమని ఆర్సీబీ పేరు చెప్పేస్తారు క్రికెట్…