భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలంతా చంద్రయాన్-3 ఎప్పుడెప్పుడు నింగికెరుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ిచంద్రయాన్-2 విఫలమైన నేపథ్యంలో ఈ ప్రయోగంపై ఇస్రో ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ క్రమంలోనే శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఈ మధ్యాహ్నం నింగికెగిసిన చంద్రయాన్-3 మాడ్యూల్ నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. చంద్రయాన్-3ని గగనానికి మోసుకెళ్లిన ఎల్వీమ్3-ఎం4 రాకెట్ అన్ని దశలు సాఫీగా పూర్తి చేసింది.
అనుకున్న సమయానికే చంద్రయాన్-3ని నిర్దేశిత కక్ష్యలోకి విడుదల చేసింది. ఎల్వీమ్3-ఎం4 రాకెట్ నుంచి చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యూల్ విజయవంతంగా విడిపోయింది. దాంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో సంబరాలు మిన్నంటాయి. తమ కృషి ఫలించినందుకు ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్.సోమనాథ్ హర్షం వ్యక్తం చేశారు. ఎల్వీఎమ్3-ఎం4 రాకెట్ చంద్రయాన్-3ని భూకక్ష్యలోకి చేర్చిందని వెల్లడించారు. ప్రపంచంలోనే ఏ దేశం కూడా చంద్రుడిపై ఉన్న దక్షిణ ధృవంపైకి శాటిలైట్ ని పంపలేదు. కానీ. ఆ ఘపత దక్కించుకున్న తొలిదేశంగా భారత్ అవతరించింది.
చంద్రయాన్-3 విజయవంతంగా చేర్చిందని, కక్ష్యను విస్తరించుకుంటూ చంద్రుడి కక్షలోకి ప్రవేశిస్తుందని ఆయన వెల్లడించారు. 40 రోజుల తర్వాత అంటే ఆగస్టు 23 నుంచి 24 తేదీలు మధ్యలో చంద్రుడిపై చంద్రయాన్ దిగుతుందని వెల్లడించారు. ఈ విజయం పట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలను మోడీ అభినందించారు. భారత అంతరిక్ష పరిశోధన రంగం చరిత్రలో ఇది సరికొత్త అధ్యాయం అని అన్నారు. ఈ విజయం భారతీయ శాస్త్రవేత్తల అంకితభావానికి, అకుంఠిత దీక్షకు నిదర్శనమని కొనియాడారు. శాస్త్రవేత్తల స్ఫూర్తికి, చాతుర్యానికి వందనం చేస్తున్నానని మోడీ తెలిపారు.
This post was last modified on July 14, 2023 8:08 pm
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడిగా పూజలు అందుకునే తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాదిమంది భక్తులు అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని తిరుమలకు…
ఐపీఎల్ 2026 సీజన్ లో 15వ మ్యాచ్ క్రికెట్ ప్రేమికులకు పసందైన వినోదాన్ని అందించింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా…
రాష్ట్ర విభజన కంటే కూడా వైసీపీ అధినేత జగన్తోనే రాష్ట్రానికి ఎక్కువగా నష్టమని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ సాగించిన…
వైసిపి అధినేత జగన్ ప్రకటించిన `ప్లాన్ బి` పెద్దగా వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. రాష్ట్ర రాజధాని విషయంలో ప్రజలు…
నిజమేనండోయ్... భానుడి భగభగలు అప్పుడే మొదలైపోయాయి. మార్చి మాసంలో అప్పుడప్పుడు చిరు జల్లులతో పెద్దగా ఎండ ప్రభావం అయితే పెద్దగా…
చేసినవి తక్కువ సినిమాలే అయినా దర్శకుడిగా మంచి గుర్తింపే ఉంది చందూ మొండేటికి. తొలి చిత్రం ‘కార్తికేయ’తోనే అతను బలమైన…