రాబోయే ఎన్నికలలో బీజేపీ, టీడీపీ, జనసేన లేదా బీజేపీ, జనసేన లేదా బీజేపీ, టీడీపీల మధ్య పొత్తు ఉండే అవకాశాలున్నాయని చాలాకాలంగా పుకార్లు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీలో టీడీపీతో బీజేపీ పొత్తులు ఉండబోవన్న రీతిలో తాజాగా బీజేపీ నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో టీడీపీ పొత్తుపై ఏపీ బీజేపీ ఇన్ఛార్జీ సునీల్ దేవధర్ సంచలన విమర్శలు చేశారు. దివంగత ఎన్టీఆర్ గొప్ప వ్యక్తి అని, బాహుబలి వంటి ఆయనను కట్టప్ప మాదిరి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని షాకింగ్ కామెంట్స్ చేశారు.
2014లో బీజేపీతో కలిసిన చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ తర్వాత బీజేపీకి వెన్నుపోటు పొడిచి బయటకు వెళ్లారని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ సీఎం అయిన తర్వాత రాష్ట్ర పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టయిందని అన్నారు. పురందేశ్వరి నాయకత్వంలో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తామని, రాష్ట్రంలో బీజేపీ – జనసేన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు, టీడీపీతో బీజేపీ పొత్తుపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీపై విశ్వసనీయత లేదని ఆయన షాకింగ్ కామెంట్లు చేశారు.
ఏపీ బీజేపీ చీఫ్ గా పురందేశ్వరి నియామకం దూరదృష్టితో తీసుకున్న నిర్ణయం అని జీవీఎల్ అన్నారు. 2024లో బీజేపీ, జనసేన అధికారంలోకి రానున్నాయని ,20 ఎంపీ స్థానాలే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. మరోవైపు, ఈ ఇద్దరు నేతలు చేసిన కామెంట్లకు భిన్నంగా ఏపీ బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా ఈ సంకేతాలిచ్చిందని, కేంద్రం సంకేతాలివ్వకుంటే తాను ఎందుకు మాట్లాడతానని అన్నారు.
పొత్తుల విషయంలో చర్చలు జరుగుతున్నాయని, జగన్ కు కేంద్రం నుంచి సహకారం లేదని అన్నారు. సీబీఐ కేసుల నుంచి జగన్ ను బీజేపీ కాపాడుతోందనే ప్రచారంలో నిజం లేదన్నారు. ఈ పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు గందరగోళం కలిగించినా…టీడీపీని బీజేపీ దూరం పెడుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on July 14, 2023 3:48 pm
కండల వీరుడు సల్మాన్ ఖాన్, దర్శకుడు వంశీ పైడిపల్లి కలయికలో నిర్మాత దిల్ రాజు తీస్తున్న భారీ చిత్రం ఇటీవలే…
టాలెంట్ ఉన్నా టైం కలిసి రాక సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న అప్ కమింగ్ హీరోల్లో తిరువీర్ ఒకడు. పాపం…
ఎప్పుడో 2019 వన్డే ప్రపంచకప్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు మహేంద్రసింగ్ ధోని. ఆ తర్వాతి ఏడాది అధికారికంగా ఇంటర్నేషనల్…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో వైసిపి పరిస్థితి ఎలా ఉంది.. ఈ పార్టీ తరఫున కార్యక్రమాలు ఏ…
జూన్ 26 లెనిన్ విడుదల కావాలి. గతంలో మే 1 ఫిక్స్ చేసుకున్న డేట్ ని పెద్ది కోసం త్యాగం…
టీడీపీతో రాజకీయం మొదలుపెట్టి...ఆపై బీఆర్ఎస్ లో చేరి సక్సెస్ ఫుల్ రాజకీయవేత్తగా ఎదిగిన మాజీ మంత్రి మల్లారెడ్డి త్వరలోనే మరోమారు పార్టీ…