తెలుగుదేశం యువ నేత నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్రతో తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకున్న తీరు.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. సబ్జెక్ట్ లేదని, మాట తడబడుతుందని.. ఇలా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న లోకేష్.. యువగళంలో అందరినీ ఆశ్చర్యపరిచాడు.
జనాలను ఆకట్టుకునే ప్రసంగాలు.. ఇంటరాక్షన్ కార్యక్రమాలతో శభాష్ అనిపించుకున్నాడు. జనాలతో లోకేష్ మమేకమైన తీరు.. వివిధ అంశాలపై తన ప్రసంగాలు.. ఏపీ సీఎం జగన్ మీద వేసిన పంచులు చర్చనీయాంశం అయ్యాయి. యాత్ర ముందుకు సాగే కొద్దీ స్పందన పెరిగింది.
జగన్కు బాగా బలం ఉన్న రాయలసీమ జిల్లాల్లో లోకేష్ యాత్రకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మీడియాలో ఈ యాత్రకు, లోకేష్కు మంచి కవరేజీ వచ్చింది. సోషల్ మీడియాలో ఈ యాత్ర గురించి బాగా చర్చ జరిగింది. ఐతే గత రెండు మూడు వారాల ముందు నుంచి మాత్రం లోకేష్ యాత్ర గురించి పెద్దగా సౌండ్ లేదు.
లోకేష్ ఇటీవలే తన యాత్రలో 2 వేల కిలోమీటర్ల మైలురాయిని పూర్తి చేశాడు. వెయ్యి కిలోమీటర్లు పూర్తయినపుడు జరిగిన హడావుడి.. మీడియా కవరేజీ, సోషల్ మీడియాలో సందడితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితి భిన్నం.
దీని గురించి పెద్ద చర్చే లేదు. ఇందుకు ప్రధాన కారణం జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బేసిగ్గా సినిమా నటుడు కావడం వల్ల పవన్కు ఉన్న ఆకర్షణకు తోడు.. యాత్రలో పవన్ చేసిన ప్రసంగాలు రాజకీయంగా కాక రేపాయి. వ్యతిరేక మీడియా సైతం పవన్కు కవరేజీ ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంది. కొన్ని రోజలుగా ఏపీ రాజకీయం మొత్తం పవన్ చుట్టూ తిరుగుతుండటం విశేషం. మీడియాను, సోషల్ మీడియాను అతనే ఆక్రమించేశాడు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పేరు సైతం పెద్దగా వినిపించడం లేదు. లోకేష్ యాత్ర సంగతి చెప్పాల్సిన పని లేదు. అతను చాలా వరకు సైడ్ అయిపోయాడు. పవన్ మళ్లీ బ్రేక్ తీసుకుంటే తప్ప లోకేష్ మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చేలా లేడు.
This post was last modified on July 14, 2023 7:33 am
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు.. సత్తా చాటుకున్నారు. సాధారణ అభివృద్ధి పనులతో పాటు.. ఎవరూ ఊహించని…
నిన్న విడుదలైన బైకర్ కు పబ్లిక్ టాక్, రివ్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. సినిమా చూస్తే నిరాశపడరనే అభిప్రాయం అధిక…
నిన్న విడుదలైన రాకాస, బైకర్ రెండు సినిమాలకు నెగటివ్ రెస్పాన్స్ రాలేదు. అత్యద్భుతంగా ఉన్నాయని కాదు కానీ ఒకసారి చూడొచ్చనే…
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఉన్న రాయపాటి శైలజ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? అంటే…
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…