Political News

పవన్ వచ్చాడు.. లోకేష్ సైడైపోయాడు

తెలుగుదేశం యువ నేత నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్రతో తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకున్న తీరు.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సబ్జెక్ట్ లేదని, మాట తడబడుతుందని.. ఇలా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న లోకేష్.. యువగళంలో అందరినీ ఆశ్చర్యపరిచాడు.

జనాలను ఆకట్టుకునే ప్రసంగాలు.. ఇంటరాక్షన్ కార్యక్రమాలతో శభాష్ అనిపించుకున్నాడు. జనాలతో లోకేష్ మమేకమైన తీరు.. వివిధ అంశాలపై తన ప్రసంగాలు.. ఏపీ సీఎం జగన్ మీద వేసిన పంచులు చర్చనీయాంశం అయ్యాయి. యాత్ర ముందుకు సాగే కొద్దీ స్పందన పెరిగింది.

జగన్‌కు బాగా బలం ఉన్న రాయలసీమ జిల్లాల్లో లోకేష్ యాత్రకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మీడియాలో ఈ యాత్రకు, లోకేష్‌కు మంచి కవరేజీ వచ్చింది. సోషల్ మీడియాలో ఈ యాత్ర గురించి బాగా చర్చ జరిగింది. ఐతే గత రెండు మూడు వారాల ముందు నుంచి మాత్రం లోకేష్ యాత్ర గురించి పెద్దగా సౌండ్ లేదు.

లోకేష్ ఇటీవలే తన యాత్రలో 2 వేల కిలోమీటర్ల మైలురాయిని పూర్తి చేశాడు. వెయ్యి కిలోమీటర్లు పూర్తయినపుడు జరిగిన హడావుడి.. మీడియా కవరేజీ, సోషల్ మీడియాలో సందడితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితి భిన్నం.

దీని గురించి పెద్ద చర్చే లేదు. ఇందుకు ప్రధాన కారణం జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బేసిగ్గా సినిమా నటుడు కావడం వల్ల పవన్‌కు ఉన్న ఆకర్షణకు తోడు.. యాత్రలో పవన్ చేసిన ప్రసంగాలు రాజకీయంగా కాక రేపాయి. వ్యతిరేక మీడియా సైతం పవన్‌కు కవరేజీ ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంది. కొన్ని రోజలుగా ఏపీ రాజకీయం మొత్తం పవన్ చుట్టూ తిరుగుతుండటం విశేషం. మీడియాను, సోషల్ మీడియాను అతనే ఆక్రమించేశాడు.

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పేరు సైతం పెద్దగా వినిపించడం లేదు. లోకేష్ యాత్ర సంగతి చెప్పాల్సిన పని లేదు. అతను చాలా వరకు సైడ్ అయిపోయాడు. పవన్ మళ్లీ బ్రేక్ తీసుకుంటే తప్ప లోకేష్ మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చేలా లేడు.

This post was last modified on July 14, 2023 7:33 am

Share

Recent Posts

టార్గెట్ చేరుకున్న టాక్సిక్ తెలుగు వేడుక

నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…

27 minutes ago

మెగా హీరోలు అభిమానులు ఇద్దరూ చెక్ చేసుకోవాలి

సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…

2 hours ago

ఎండోస్కోపిక్ కెమెరాతో పేపర్ లీక్… బీజేపీ రాష్ట్రంలో సంచలనం

రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…

2 hours ago

టీడీపీతో పోల్చుకుంటే.. వైసీపీకి `వ‌ర్గ‌`పోరు…!

పార్టీలు బ‌లంగా ఉండాలంటే.. స‌మాజంలోని ప‌లు వ‌ర్గాల మ‌ద్ద‌తు అవ‌స‌రం. నాయ‌కులు, అధినేత‌లు ఎంత బ‌లంగా ఉన్నా.. స‌మాజంలోని వ‌ర్గాలు…

2 hours ago

ఎన్డీయే క‌న్వీన‌ర్‌గా చంద్ర‌బాబు… ఛాన్స్ ఖాయ‌మేనా?

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూట‌మిని బ‌లోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మ‌రింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మ‌క అడుగులు…

7 hours ago

ర‌వితేజ హిట్టు కొడితే ఆల్ హ్యాపీస్

తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వ‌ర్గాలున్నాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అందులో ఒక వ‌ర్గానికి ఇంకో వ‌ర్గానికి అస్స‌లు…

8 hours ago