ఉమ్మడి గుంటూరు జిల్లాలో పక్క పక్కన ఉండే మూడు నియోజకవర్గాల్లో వైసీపీకి వ్యతిరేకత తెరమీదికి వచ్చింది. నిన్న మొన్నటి వరకు తమదే గెలుపని భావించినప్పటికీ.. ఇప్పుడు మారుతున్న పరిణామాల నేపథ్యంలో పార్టీ అంతర్మథనంలో చిక్కుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న అంచనాల మేరకు వినుకొండ, గురజాల, నరసారావు పేట. ఈమూడు నియోజకవర్గాల్లోనూ వైసీపీలో వ్యతిరకత కనిపిస్తోందని అంటున్నారు.
వినుకొండ నుంచి గత ఎన్నికలలో బొల్లా బ్రహ్మనాయుడు విజయం దక్కించుకున్నారు. గడపగడపకు పాదయాత్రతో పాటు.. తను సొంతగా కూడా.. కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో ప్రజల నాడి ఎలా ఉన్నప్పటికీ.. సొంత పార్టీలోనే ఆయనకు సెగ తగులుతుండడం గమనార్హం. ఫంక్షన్లకు వెళ్లి గిఫ్టులు ఇస్తే.. పని జరగదని.. కీలక నాయకులు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. క్షేత్రస్థాయిలో గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమేరకు అమలయ్యాయని వారు ప్రశ్నిస్తున్నారు.
ఇక, గురజాల నియోజకవర్గంలో ప్రజల నాడి డిఫరెంట్గా ఉంది. ఇక్కడ క్షేత్రస్థాయిలో టీడీపీకి బలం ఎక్కువగా ఉండడంతోపాటు.. మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు హవా కొనసాగుతుండడంతో వైసీపీకి ఇక్కడ మళ్లీ గెలుపు పై అంచనాలు తప్పుతున్నాయి. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య రాజకీయాలతో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందనే వాదన వినిపిస్తోంది. దీంతో కాసు మహేష్ రెడ్డికి వ్యతిరేకత కనిపిస్తోందని అంటున్నారు.
ఇక, నరసరావుపేటలోనూ వైసీపీకి వ్యతిరేకత బాగానే పెరిగిందని అంటున్నారు. వరుస విజయాలు దక్కించుకున్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి సొంత కుంపట్లు పెరిగిపోయాయి. ప్రజల్లో సానుభూతి ఉన్నా.. ఆయనకు వ్యతిరేకంగా నాయకులు చేస్తున్న గ్రూపు రాజకీయాలు పార్టీలో అసంతృప్తులు వంటివి డామినేట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పక్కపక్కనే ఉండే ఈ మూడు నియోజకవర్గాల పరిస్థితి పార్టీ అధిష్టానాన్ని ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తోందని అంటున్నారు తాడేపల్లి వర్గాలు.
This post was last modified on July 14, 2023 7:21 am
టీడీపీతో రాజకీయం మొదలుపెట్టి...ఆపై బీఆర్ఎస్ లో చేరి సక్సెస్ ఫుల్ రాజకీయవేత్తగా ఎదిగిన మాజీ మంత్రి మల్లారెడ్డి త్వరలోనే మరోమారు పార్టీ…
వైసీపీ కీలక నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. రాజమహేంద్రవరంలోని కోర్టు విచారణకు హాజరై తిరిగి…
రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు సింగపూర్లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన శుక్రవారం తో ముగియనుంది. మూడు రోజుల పర్యటనలో…
సినిమా ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ కాంబినేషన్లు సెట్స్ పైకి వెళ్లకముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్,…
నందమూరి బాలకృష్ణ స్పీడ్ ను అందుకోవడం ఇప్పుడున్న కుర్ర హీరోలకు కూడా కష్టమే అనిపిస్తోంది. అఖండ 2 ఫ్లాప్ అయినా…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. వాస్తవానికి గతంలో కొన్ని కొన్ని చెదురుమొదురు ఘటనలు జరిగేవి. తాజాగా…