ఉమ్మడి గుంటూరు జిల్లాలో పక్క పక్కన ఉండే మూడు నియోజకవర్గాల్లో వైసీపీకి వ్యతిరేకత తెరమీదికి వచ్చింది. నిన్న మొన్నటి వరకు తమదే గెలుపని భావించినప్పటికీ.. ఇప్పుడు మారుతున్న పరిణామాల నేపథ్యంలో పార్టీ అంతర్మథనంలో చిక్కుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న అంచనాల మేరకు వినుకొండ, గురజాల, నరసారావు పేట. ఈమూడు నియోజకవర్గాల్లోనూ వైసీపీలో వ్యతిరకత కనిపిస్తోందని అంటున్నారు.
వినుకొండ నుంచి గత ఎన్నికలలో బొల్లా బ్రహ్మనాయుడు విజయం దక్కించుకున్నారు. గడపగడపకు పాదయాత్రతో పాటు.. తను సొంతగా కూడా.. కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో ప్రజల నాడి ఎలా ఉన్నప్పటికీ.. సొంత పార్టీలోనే ఆయనకు సెగ తగులుతుండడం గమనార్హం. ఫంక్షన్లకు వెళ్లి గిఫ్టులు ఇస్తే.. పని జరగదని.. కీలక నాయకులు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. క్షేత్రస్థాయిలో గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమేరకు అమలయ్యాయని వారు ప్రశ్నిస్తున్నారు.
ఇక, గురజాల నియోజకవర్గంలో ప్రజల నాడి డిఫరెంట్గా ఉంది. ఇక్కడ క్షేత్రస్థాయిలో టీడీపీకి బలం ఎక్కువగా ఉండడంతోపాటు.. మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు హవా కొనసాగుతుండడంతో వైసీపీకి ఇక్కడ మళ్లీ గెలుపు పై అంచనాలు తప్పుతున్నాయి. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య రాజకీయాలతో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందనే వాదన వినిపిస్తోంది. దీంతో కాసు మహేష్ రెడ్డికి వ్యతిరేకత కనిపిస్తోందని అంటున్నారు.
ఇక, నరసరావుపేటలోనూ వైసీపీకి వ్యతిరేకత బాగానే పెరిగిందని అంటున్నారు. వరుస విజయాలు దక్కించుకున్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి సొంత కుంపట్లు పెరిగిపోయాయి. ప్రజల్లో సానుభూతి ఉన్నా.. ఆయనకు వ్యతిరేకంగా నాయకులు చేస్తున్న గ్రూపు రాజకీయాలు పార్టీలో అసంతృప్తులు వంటివి డామినేట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పక్కపక్కనే ఉండే ఈ మూడు నియోజకవర్గాల పరిస్థితి పార్టీ అధిష్టానాన్ని ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తోందని అంటున్నారు తాడేపల్లి వర్గాలు.
This post was last modified on July 14, 2023 7:21 am
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…